Category Archives: GENERAL

మహా కుంభమేళా ముగింపు రోజున త్రిశూలం ఆకారంలో ఎయిర్ షో నిర్వహించబడిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: మహా కుంభమేళా ముగింపు రోజున 26 ఫిబ్రవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో వైమానిక దళ విమానాల ద్వారా త్రిశూలం ఆకారంలో ఎయిర్ షో నిర్వహించబడిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన. వైరల్ అవుతున్న చిత్రం 2025 ఫిబ్రవరి 26న జరిగిన మహా కుంభమేళా ముగింపు కార్యక్రమానికి సంబంధించినది కాదు, కానీ 2019 నుండి ఇంటర్నెట్‌లో ఉన్న పాత చిత్రం.

రేటింగ్/Rating : తప్పు దారి పట్టించే వాదన–

**************************************************************************

ఫిబ్రవరి 26, 2025న మహా కుంభమేళా చివరి రోజున ప్రయాగ్‌రాజ్‌లో భారత వైమానిక దళం నిర్వహించిన త్రిశూలం ఆకార నిర్మాణం యొక్క చిత్రంతో సోషల్ మీడియా హోరెత్తుతోంది.

వాదన/దావా ఈ విధంగా ఉంది: “ఈ సంవత్సరానికే ఇది చిత్రం !!! 3 సుఖోయ్ 30 MKI విమానాలతో మహాదేవ్ త్రిశూలం ఆకార నిర్మాణం !!! #భారత వాయుసేనకు సెల్యూట్ జై మహాకాల్”.

ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

వాస్తవ పరిశీలన

సోషల్ ప్లాట్‌ఫామ్‌లలో చాలా మంది ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్నందున, వైరల్ క్లెయిమ్/వాదన యొక్క ప్రామాణికతను పరిశీలించడానికి బృందం ప్రయత్నించగా, మహా కుంభమేళా ముగింపు రోజున ఎయిర్ షో సమయంలో త్రిశూలం ఆకార నిర్మాణం జరగలేదని కనుగొన్నారు. ముగింపు రోజున జరిగిన అసలు ఎయిర్ షో వీడియోని దిగువన చూడవచ్చు:

గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో మరింత సమాచారం కోసం వెతకగా, అలాంటి చిత్రం ఇంటర్నెట్‌లో చాలా కాలంగా షేర్ అవుతోందని తేలింది. 2019 నుండి ఇదే చిత్రాన్ని షేర్ చేసిన పోస్ట్ ఇక్కడ ఉంది:

2025 ఫిబ్రవరి 26న మహా కుంభమేళాలో వైమానిక దళ విమానాల ద్వారా త్రిశూలం ఆకారంలో జరిగిన ఎయిర్ షోకి సంబంధించి మరిన్ని వార్తలు/నివేదికల కోసం మరింత శోధించినా, ఎటువంటి ఫలితాలు వెలువడలేదు.కాబట్టి వైరల్ అవుతున్న చిత్రం 2025 ఫిబ్రవరి 26న జరిగిన మహా కుంభమేళా ముగింపు కార్యక్రమానికి సంబంధించినది కాదు, కానీ 2019 నుండి ఇంటర్నెట్‌లో ఉన్న పాత చిత్రం.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

చిత్రంలో కనపడుతున్నట్లు భారతీయ వలసదారుల చేతులకు బేడీలు వేసి గ్వాటెమాలాకు పంపించారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: చిత్రంలో కనపడుతున్నట్లు భారతీయ వలసదారుల చేతులకు బేడీలు వేసి గ్వాటెమాలాకు పంపించేస్తున్నారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. ఈ చిత్రంలో కనిపించేవాళ్ళు భారతీయులు కాదు, ఇతర అక్రమ వలసదారులను USA నుండి గ్వాటెమాలాకు పంపిస్తున్నట్లు(బహిష్కరిస్తున్నట్లు) తెలుస్తుంది.

రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం.

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

ఒక ఫైటర్ జెట్ లోపల కూర్చున్న అనేక మంది వ్యక్తుల చేతులు సంకెళ్లులతో, గొలుసులతో బంధించబడి ఉన్నట్లు చూపించే ఒక చిత్రం, అమెరికా అధికారులు భారతీయులను గ్వాటెమాలాకు పంపించేస్తున్నారనే వాదనతో సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది.

ఫిబ్రవరి 4, 2025 మంగళవారం నాడు 205 మంది భారతీయ పౌరులను తీసుకెళ్లిన US మిలిటరీ జెట్ C-17, టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో నుండి బయలుదేరి అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన సందర్భం సుపరిచితమే.

వాస్తవ పరిశీలన వివరాలు:

ఇటీవల అమెరికా సైనిక విమానంలో 205 మంది భారతీయులను సంకెళ్లు, గొలుసులతో వెనక్కి పంపించేశారనేది(బహిష్కరించిందనేది) నిజమే అయినప్పటికీ, షేర్ చేయబడుతున్న చిత్రం అసలైన చిత్రం కాదు, అది అక్రమ వలసదారులను మెక్సికోలోని గ్వాటెమాలాకు పంపించే (బహిష్కరించే) సమయంలోని చిత్రం.

అసోసియేటెడ్ ప్రెస్ (AP) సౌజన్యంతో ఉన్న ఈ చిత్రం, ఆ వార్తా సంస్థ ద్వారా జనవరి 31, 2025న పోస్ట్ చేయబడింది మరియు దాని శీర్షిక ఇలా ఉంది: “జనవరి 30, 2025, గురువారం, టెక్సాస్‌లోని ఎల్ పాసోలోని ఫోర్ట్ బ్లిస్ వద్ద ఉన్న సైనిక విమానంలో ఫేస్ మాస్క్‌లు ధరించిన మరియు చేతులు,కాళ్లకు సంకెళ్ళతో బంధించబడిన వలసదారులు గ్వాటెమాలాకు తిరిగి వెళ్ళడం(బహిష్కరణ) కోసం ఎదురు చూస్తున్నారు (AP ఫోటో/క్రిస్టియన్ చావెజ్)”.

అందులో భారతీయుల గురించి ఏమీ ప్రస్తావించలేదు.

అందువల్ల, భారతీయులను గ్వాటెమాలాకు పంపించేస్తున్నట్లు(బహిష్కరిస్తున్నట్లు) తప్పుడు చిత్రం షేర్ చేయబడుతోంది.

వాస్తవానికి, భారతీయులను భారతదేశంలోని అమృత్సర్ నగరానికి పంపించిన(బహిష్కరించిన)కొన్ని అసలైన చిత్రాలను US సరిహద్దు గస్తీ సిబ్బంది(US Border Patrol) ద్వారా షేర్ చేయబడటం ఇక్కడ చూడవచ్చు.

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఫిబ్రవరి 6, 2025న పార్లమెంటులో చేసిన ప్రకటనలో దీనిని ధృవీకరించారు, ఇది 2012 నుండి అనుసరిస్తున్న ప్రధానమైన విధానంలో భాగమని వివరించారు. మరింత వివరణ ఇస్తూ ఆయన సభతో ఇలా అన్నారు: “సర్, US ద్వారా బహిష్కరణలను ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు నిర్వహిస్తారు మరియు వాటిని అమలు చేస్తారు.
ప్రధానమైన ఆపరేటింగ్ విధానం ప్రకారం, ICE ఉపయోగించే ‘విమానం ద్వారా బహిష్కరణ’ 2012 నుండి అమలులోకి రాగా, అది పరిమితులు విధించి వెనక్కు పంపడానికి వినియోగిస్తారు. అయితే, మహిళలు మరియు పిల్లలు నియంత్రించబడరని ICE ద్వారా మాకు సమాచారం అందింది.”

అందువలన ఇది తప్పుడు వాదన.

 

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

ట్రంప్ పరిపాలనను విమర్శిస్తున్న అకౌంట్ల నిలిపివేత గురించి మస్క్ Xలో పోస్ట్ చేశారా? వాస్తవ పరిశీలన

అమెరికా మరియు కెనడా 1.2 మిలియన్ల అక్రమ భారతీయ వలసదారులను స్వదేశానికి తిరిగి పంపించేస్తున్నారా ? వాస్తవ-పరిశీలన

కొత్తగా ప్రకటించిన 18% GST అన్ని ఉపయోగించిన కార్ల అమ్మకాలపై వర్తిస్తుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:పాత కార్ల అమ్మకాలపై 18% GST విధించబడింది.

నిర్ధారణ/Conclusion:తప్పు దారి పట్టించే వాదన.పాత కార్ల వ్యక్తిగత(ఒక వ్యక్తి మరొక వ్యక్తికి) విక్రయాలకు GST వర్తించదు, అయితే పాత కార్లను తిరిగి విక్రయించే డీలర్లు లేదా తరుగుదల పొందిన వారు తమ పాత కార్లను విక్రయిస్తున్నపుడు మార్జిన్‌పై 18% GST వర్తిస్తుంది.

రేటింగ్/Rating: తప్పు దారి పట్టించే వాదన —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

***********************************************************************

పాత లేదా వాడిన కార్ల విక్రయాలపై వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)ని 12% నుండి 18%కి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో హల్ చల్ చేస్తోంది. ప్రకటన వెలువడిన వెంటనే, ఆర్థిక మంత్రి ప్రెస్ మీట్ తర్వాత సోషల్ మీడియా వాదనలు మరియు ప్రతివాదనలతో హోరెత్తుతోంది.

దావా ఇలా ఉంది:
“నిర్మల సీతారామన్ గారు చెప్పిన ప్రకారం:
నేను నా డీజిల్ కారును 2014లో కొన్నాను : రూ. 24 లక్షలు
నేను నా డీజిల్ కారును 2024లో విక్రయించాను : రూ. 3 లక్షల 2024
కాబట్టి, నేను 21(24-3)లక్షలపై 18% GST చెల్లించాలి! (మార్జిన్ ఆమె చెప్పిన ప్రకారం )”

ఇదే విధమైన వాదనలు ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడ్డాయి

వాస్తవ పరిశీలన

సోషల్ మీడియాలో ఈ చర్చ వైరల్ అవుతుండగా,Digiteye India బృందం సామాజిక మాధ్యమాల్లో ఆర్థిక మంత్రి క్లుప్తంగా చెప్పినదానికి భిన్నమైన వివరణలను కనుగొన్నారు. తన వివరణలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పునఃవిక్రయాల యొక్క “మార్జిన్ విలువ”పై పన్నును సూచిస్తూ వివరించారు, అయితే వారు ఉపయోగించిన కార్లను విక్రయించే వ్యక్తులు పన్నుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని తప్పుగా సూచించబడింది.

మరిన్ని వార్తా నివేదికలు పరిశీలించగా, వాస్తవానికి పన్ను ఉపయోగించిన వాహనాలు రిసేల్(Resale) చేసే వ్యాపారాలకు వర్తిస్తుంది, ప్రైవేట్ అమ్మకందారులకు కాదని గమనించాము.
ఇంకా, మేము PIBలో భారత ప్రభుత్వం ద్వారా అధికారిక పత్రికా ప్రకటన కోసం చూడగా, “వస్తువులు మరియు సేవలకు సంబంధించిన ఇతర మార్పులు” శీర్షిక కింద, ప్రకటన ఈ విధంగా ఉంది:

“18% వద్ద పేర్కొన్నవి కాకుండా ఇతర EVలతో సహా అన్ని పాత మరియు ఉపయోగించిన వాహనాల అమ్మకాలపై GST రేటును 12% నుండి 18%కి పెంచడం–1200 cc లేదా అంతకంటే ఎక్కువ & 4000 mm లేదా అంతకంటే ఎక్కువ పొడవు కలిగిన పాత మరియు ఉపయోగించిన పెట్రోల్ వాహనాల అమ్మకం; 1500 cc లేదా అంతకంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం & 4000 mm పొడవు గల డీజిల్ వాహనాలు మరియు SUVలు.[గమనిక: GST అనేది సరఫరాదారు/సప్లయర్ యొక్క మార్జిన్‌ను సూచించే విలువపై మాత్రమే వర్తిస్తుంది, అంటే, కొనుగోలు ధర మరియు అమ్మకం ధర మధ్య వ్యత్యాసం (తరుగుదల/depreciation క్లెయిమ్ చేయబడితే తరుగుదల/depreciated విలువ) మరియు వాహనం విలువపై కాదు.అలాగే, నమోదుకాని(రిజిస్ట్రేషన్ చేయని) వ్యక్తుల విషయంలో ఇది వర్తించదు.]”

ముఖ్యంగా, పన్ను మూడు స్పెసిఫికేషన్లపై ఆధారపడి ఉంటుంది:
1. పాత మరియు ఉపయోగించిన వాహనాలు అమ్మే ప్రైవేట్ వ్యక్తులు లేదా రిజిస్ట్రేషన్ చేయని వ్యక్తులు మునుపటిలా 12% GSTని కలిగి ఉంటారు, మరియు పెరిగిన 18% GST వారికి వర్తించదు.
2.పాత కార్లపై తరుగుదలని క్లెయిమ్ చేసిన సంస్థలు వాటిని ‘సరఫరాదారు/సప్లయర్ యొక్క మార్జిన్‌(అంటే కొనుగోలు ధర మరియు అమ్మకం ధర మధ్య వ్యత్యాసం(తరుగుదల/depreciation క్లెయిమ్ చేయబడితే తరుగుదల/depreciated విలువ))’పై ఈ GST వర్తిస్తుంది.అంతేకాని వాహనం విలువపై కాదు.
3.పాత కార్లను కొనుగోలు మరియు విక్రయించే కంపెనీలకు ఈ 18% GST వర్తిస్తుంది.

ఈ వీడియోలో ఆర్థిక మంత్రి వివరణ చూడండి:

ఉదాహరణకి, ఒక వ్యక్తిగా మీరు రూ.12 లక్షలకు కారును కొనుగోలు చేసి రూ. 9 లక్షలకు మరొక వ్యక్తికి విక్రయిస్తే, GST వర్తించదు.
కానీ మీరు డీలర్ అయితే కారును రూ.9 లక్షలకు కొనుగోలు చేసి రూ.10 లక్షలకు విక్రయిస్తే, 18% GST కేవలం రూ.లక్ష మార్జిన్‌కు మాత్రమే వర్తిస్తుంది.

అందుకే, పాత కార్ల విక్రయాలన్నింటిలో పెరిగిన GST వర్తిస్తుందనే వాదనలో నిజం లేదు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

 

అమెరికా మరియు కెనడా 1.2 మిలియన్ల అక్రమ భారతీయ వలసదారులను స్వదేశానికి తిరిగి పంపించేస్తున్నారా ? వాస్తవ-పరిశీలన

వాదన/Claim: యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా 1.2 మిలియన్లకు పైగా భారతీయ అక్రమ వలసదారులను స్వదేశానికి తిరిగి పంపించే ప్రక్రియను ప్రారంభించారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. పత్రాలు లేని 18,000 మంది అక్రమ వలసదారులను వెనక్కి తీసుకోవడానికి భారతదేశం ఇప్పటికే అంగీకరించింది, అయితే US మరియు కెనడా బహిష్కరించే(వెనక్కి పంపించే) 1.2 మిలియన్ల అక్రమ వలసదారులపై ఎటువంటి అధికారిక సంఖ్య స్పష్టంగా లేదు.

రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన —

యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా 1.2 మిలియన్లకు పైగా భారతీయ అక్రమ వలసదారులను స్వదేశానికి తిరిగి పంపించే ప్రక్రియను ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేయబడుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త విధాన ప్రకటనల ప్రకారం పత్రాలు లేని అక్రమ వలసదారులను బహిష్కరించడంపై ఆదేశాలు ఇచ్చిన సందర్భంలో ఈ పోస్ట్ షేర్ చేయబడుతోంది.

అదే పోస్ట్‌ను షేర్ చేస్తూ, మరొక వినియోగదారు ఇలా వ్రాశారు: “US మరియు కెనడా యొక్క కొత్త బహిష్కరణ ప్రణాళికకు ధన్యవాదాలు, కొడుకులు మరియు కుమార్తెలను తిరిగి స్వాగతించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. తన ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారాన్ని పెంచడానికి 1.2 మిలియన్ల మంది పౌరులను తన చేతులతో ఆదుకోడానికి ప్రధాని మోడీ థ్రిల్ అవుతుంటారు”.

వాస్తవ-పరిశీలన

Pew రీసెర్చ్ అంచనా ప్రకారం, దాదాపు 725,000 మంది భారతీయులు యునైటెడ్ స్టేట్స్‌లో ప్రస్తుతం నివసిస్తున్న అనధికార వలసదారులు. యునైటెడ్ స్టేట్స్ నుండి 18,000 మంది పత్రాలు లేని వలసదారులను స్వీకరించటానికి భారతదేశం ఇప్పటికే తన ప్రణాళికలను ప్రకటించింది, అయితే కెనడాలో నివసిస్తున్న భారతదేశానికి చెందిన అక్రమ వలసదారుల గురించి ఎటువంటి గణాంకాలు అందుబాటులో లేవు.

భారత విదేశాంగ మంత్రి S. జైశంకర్ కూడా (క్రింద ఉన్న వీడియో చూడండి) US నుండి భారతీయులు చట్టబద్ధంగా తిరిగి వస్తే స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు, మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కూడా చట్టపరమైన  వలసలకు మద్దతు ఇస్తామని, చట్టవిరుద్ధమైన వలసలను వ్యతిరేకిస్తామని ధృవీకరించారు.

కెనడా గురించి అధికారిక సంఖ్య అందుబాటులో లేదు. Pew రీసెర్చ్ గణాంకాలు కూడా అంచనాలు మాత్రమే, నిశ్చయాత్మకమైనవి కావు.
అయితే, MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌ని ఉటంకిస్తూ కొత్త నివేదికలు ఇలా పేర్కొన్నాయి: “వలసల విషయంపై భారతదేశం-అమెరికా పరస్పర సహకారంతో, అక్రమ వలసలను నిరోధించే ప్రక్రియలో ఇరుపక్షాలు నిమగ్నమై ఉన్నాయి. భారతదేశం నుండి అమెరికాకి(యుఎస్‌కి) చట్టపరమైన వలసలకు మరిన్ని మార్గాలను సృష్టించడానికే ఇది చేయబడుతుంది”.

అంతేకాకుండా, US కస్టమ్స్ మరియు సరిహద్దు రక్షణ డేటా ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో US సరిహద్దు గస్తీ అధికారులు ఎదుర్కొన్న అన్ని చట్టవిరుద్ధమైన సరిహద్దు దాటడలతో పోలిస్తే, పత్రాలు లేని భారతదేశ వలసదారుల సంఖ్య 3% ఉంది.కాబట్టి, అధికారిక గణాంకాలు ప్రభుత్వానికి విడుదలయ్యే వరకు US మరియు కెనడాలో 1.2 మిలియన్ల అక్రమ వలసదారుల సంఖ్య ప్రామాణికమైనది కాదు. ప్రస్తుతానికి, 18,000 మంది పత్రాలు లేని అక్రమ వలసదారులను బహిష్కరించే(వెనక్కి పంపించే) అవకాశం ఉంది.

అందువల్ల, ఈ దావా తప్పుదారి పట్టించే విధంగా ఉంది.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

కమలా హారిస్‌ అమెరికా యొక్క సహజసిద్దమైన పౌరురాలు కాదా? వాస్తవ పరిశీలన

హారిస్‌కు మద్దతు తెలిపినందుకు కంట్రీ మ్యూజిక్ ‘టేలర్ స్విఫ్ట్‌’ను నిషేధించిందా? వాస్తవ పరిశీలన

 

 

 

 

జన్మ హక్కు పౌరసత్వంపై ట్రంప్ సంతకం చేస్తే ఉషా వాన్స్ యొక్క అమెరికా పౌరసత్వం రద్దు చేయబడుతుందా? వాస్తవ-పరిశీలన

వాదన/Claim: వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ భార్య ఉష పుట్టిన సమయంలో ఆమె తల్లిదండ్రులు యుఎస్ పౌరులు కానందున ఆమె పౌరసత్వం రద్దు చేయబడుతుందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన.’బర్త్‌రైట్ సిటిజెన్‌షిప్‌'(“జన్మ హక్కు పౌరసత్వం)పై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌, భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది కాని గతంలోని తేదీ నుంచి అమలులోకి రాదు.

రేటింగ్/Rating: తప్పు దారి పట్టించే వాదన. —

యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ‘బర్త్‌రైట్ సిటిజెన్‌షిప్‌’ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన వెంటనే, వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ భార్య ఉష తను పుట్టినప్పుడు ఆమె తల్లిదండ్రులు యుఎస్ పౌరులు కానందున ఆమె పౌరసత్వాన్ని రద్దు చేస్తారని సూచిస్తూ సోషల్ మీడియాలో ఒక వాదన వైరల్ అవుతోంది.

దావా ఇలా ఉంది: “జన్మ హక్కు పౌరసత్వాన్ని నిషేధిస్తూ ట్రంప్ తన కార్యనిర్వాహక ఉత్తర్వుపై(ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై) సంతకం చేస్తే JD వాన్స్ భార్య ఉషా వాన్స్ పౌరసత్వం రద్దు చేయబడుతుంది. ఆమె పుట్టిన సమయంలో ఆమె తల్లిదండ్రులు US పౌరులు కాదు.”

 వాస్తవ-పరిశీలన

Digiteye India బృందం సోషల్ మీడియాలో మరింత తనిఖీ చేసినప్పుడు, US పౌరుల నుండి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది కాని గతంలోని తేదీ నుంచి అమలులోకి రాదనీ సూచించే అనేక ప్రతిస్పందనలను కనిపించాయి.

సెక్షన్ 2. (ఎ) విధానం ప్రకారం: క్రింది రెండు (1) లేదా (2) సందర్భాలలో :
యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం యొక్క ఏ విభాగం లేదా ఏజెన్సీ యునైటెడ్ స్టేట్స్ పౌరసత్వాన్ని గుర్తించే పత్రాలను జారీ చేయకూడదు లేదా రాష్ట్ర, స్థానిక లేదా ఇతర ప్రభుత్వాలు లేదా వ్యక్తులకు యునైటెడ్ స్టేట్స్ పౌరసత్వాన్ని గుర్తించడానికి ఉద్దేశించిన పత్రాలను ఆమోదించకూడదు:
(1) ఆ వ్యక్తి తల్లి యునైటెడ్ స్టేట్స్‌లో చట్టవిరుద్ధంగా ఉన్నప్పుడు మరియు ఆ వ్యక్తి పుట్టిన సమయంలో ఆ వ్యక్తి తండ్రి యునైటెడ్ స్టేట్స్ పౌరుడు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసి కానప్పుడు, లేదా (2) యునైటెడ్ స్టేట్స్‌లో ఆ వ్యక్తి తల్లి ఉనికి చట్టబద్ధమైనది కానీ తాత్కాలికమైనది మరియు ఆ వ్యక్తి పుట్టిన సమయంలో ఆ వ్యక్తి తండ్రి యునైటెడ్ స్టేట్స్ పౌరుడు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసి కానప్పుడు.

(బి)విభాగం:   ఆర్డర్ అమలులోకి వచ్చిన 30 రోజుల తర్వాత యునైటెడ్ స్టేట్స్‌లో జన్మించిన వ్యక్తులకు మాత్రమే పై (ఎ) విభాగం వర్తిస్తుంది.” కాబట్టి, ఇది వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ భార్య ఉషా వాన్స్‌కి వర్తించదు మరియు దావా తప్పుడు దావా అని స్పష్టమవుతుంది.

 

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

కమలా హారిస్‌ అమెరికా యొక్క సహజసిద్దమైన పౌరురాలు కాదా? వాస్తవ పరిశీలన

హారిస్‌కు మద్దతు తెలిపినందుకు కంట్రీ మ్యూజిక్ ‘టేలర్ స్విఫ్ట్‌’ను నిషేధించిందా? వాస్తవ పరిశీలన

నిప్పురవ్వలతో కూడిన విద్యుత్ స్తంభం ఘటన బెంగుళూరు రోడ్డులో జరిగిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: వరదలతో నిండిన బెంగళూరు రహదారిపై నిప్పురవ్వలతో కూడిన విద్యుత్ స్తంభాన్ని వీడియోలో చూపుతూ,ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా? అంటూ ఒక వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. వరదలతో నిండిన రహదారిపై నిప్పురవ్వలతో కూడిన విద్యుత్ స్తంభం పడి ఉన్న ఘటన వియత్నాం లో జరిగినది, బెంగళూరులో జరిగినది కాదు.

రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

వర్షపు నీటితో రోడ్లు ప్రవహించాయని, వరదల మధ్యలో అకస్మాత్తుగా విద్యుత్తు మెరుపులు కనిపిస్తున్నాయని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బెంగళూరు సర్కిల్‌లలో షేర్ అవుతోంది. వాహనాలు, ద్విచక్ర వాహనాలు వెళ్లే సమయంలో కూడా మంటలు చాలా సేపు అలాగే ఉన్నాయి.

తత్నాల్ హిందూ సేన ద్వారా షేర్ చేయబడిన దావా కన్నడలో ఇలా ఉంది: “ಬ್ರಾಂಡ್ ಬೆಂಗಳೂರು ಬಿಸಿ ನೀರು ಭಾಗ್ಯ ಅಷ್ಟೇ…. ಯಾರಿಗೆ ಏನಾದ್ರೆ ನಮಗೇನು ಅಂತಿದೆ ಕಾಸಿಲ್ಲದ ಸರ್ಕಾರ.. “తెలుగు అనువాదం ఇలా ఉంది: “బ్రాండ్ బెంగళూరుకు వేడి నీరు అందడం అదృష్టం. డబ్బులేని ప్రభుత్వం, ఇతరులకు ఏమి జరిగినా పట్టించుకోమని అంటుంది.

వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు నగరంలో విద్యుత్ స్తంభాల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం దగ్గర డబ్బు లేదనే సందర్భంలో ఈ వాదన చేయబడింది.

ఇదే విధమైన దావాను ఇక్కడ చూడవచ్చు.

వాస్తవ పరిశీలన

మేము వీడియో యొక్క కీలక ఫ్రేమ్‌లను తీసుకొని Google రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించగా, వియత్నామీస్ వార్తల వెబ్‌సైట్ AFamily.vn ద్వారా నిర్వహించబడిన అసలైన(ఒరిజినల్) వీడియోను ఇక్కడ కనుగొన్నము.

అక్టోబర్ 16, 2024న వియత్నామీస్ వార్తా సైట్ ప్రచురించిన నివేదిక, “తెగిన ఎలక్ట్రిక్ వైర్ వర్షం నీళ్లు పారుతున్న రోడ్డుపైకి పడిపోతున్న ప్రమాదకరమైన క్లిప్,నిప్పు రవ్వలు/స్పార్క్స్ ప్రతిచోటా ఎగసిపడుతున్నాయి: కొంతమంది వ్యక్తుల చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.” ఒక అరబిక్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడిన ఇలాంటి వీడియోను ఇక్కడ చూడండి: “వియత్నాంలో వరదల కారణంగా, విద్యుత్ స్తంభం వరద నీటిలో పడిపోయింది”

వియత్నాంలోని కాన్ థో నగరంలో అక్టోబర్ 14, 2024న తీవ్రమైన వరదలు సంభవించాయని, దీని వల్ల ఉరుము పడిన సమయంలో హై-వోల్టేజ్ లైన్ తెగిపోయి వరదలు వచ్చిన రహదారిపై పడిందని, మరియు విద్యుత్ తీగ చాలా సేపటి వరకు స్పార్క్‌లను వెదజల్లుతూనే ఉందని వియత్నాంలోని వార్తా నివేదిక పేర్కొంది.

అందువల్ల, వీడియోలో కనిపించిన సంఘటన వియత్నాంలో జరిగింది, భారతదేశంలోని బెంగళూరు నగరంలోని సంఘటన కాదు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

VP నామినీ J.D. వాన్స్ పేరు ప్రకటించినప్పుడు US రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ‘ఇండియా-ఇండియా’ అన్న నినాదాలు వినిపించాయా? వాస్తవ పరిశీలన

 

సుదర్శన చక్రం, విష్ణు మరియు శివలింగం విగ్రహాలు సంభాల్ మసీదు సర్వేలో దొరికినట్లు సాక్ష్యం ఉందని వాదన. వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ మసీదులో జరిపిన సర్వేలో క్రీ.శ. 1500 నాటి విష్ణువు, శివ లింగం మరియు సుదర్శన చక్ర విగ్రహాల కనుగొనబడ్డాయనేది, వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. విష్ణు మరియు శివ లింగం విగ్రహాలు ఫిబ్రవరి 2024లో కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో కృష్ణ నదిపై వంతెన నిర్మాణ సమయంలో కనుగొనబడ్డాయి, సంభాల్ మసీదు సర్వే సమయంలో కాదు.

రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన —

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ మసీదులో జరిపిన సర్వేలో క్రీస్తుశకం 1500 నాటి పురాతన హిందూ విగ్రహాలు కనుగొనబడినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.పోస్ట్ ఇక్కడ ఉంది:

పోస్ట్‌లోని నాలుగు చిత్రాలలో రెండు విష్ణువు విగ్రహాలు, ఒక శివలింగం మరియు ఒక సుదర్శన చక్రం ఉన్నాయి.ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఒక మసీదు సర్వేపై సంభాల్ హింసాత్మక ఘర్షణల సందర్భంలో ఈ వాదన/దావా చేయబడింది జరిగింది.

ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

వాస్తవ పరిశీలన

మేము మొదట Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో చిత్రాలను పరిశీలించగా, ఆ చిత్రాలు సంభాల్ ప్రాంతం నుండి కాకుండా ఫిబ్రవరి 2024లో కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతంలోని చిత్రాలని ఫలితాలు వెల్లండించాయి.ఫిబ్రవరి 2024లో ఈ విగ్రహాలు వెలికితీసినప్పుడు ప్రచురించబడిన నివేదికలు ఇక్కడ ఉన్నాయి.

కర్నాటకలోని రాయచూర్ జిల్లాలోని దేవసుగూర్ గ్రామ సమీపంలో కృష్ణా నదిపై వంతెన నిర్మాణ సమయంలో విష్ణువు మరియు శివలింగం యొక్క విగ్రహాలను కనుగొన్నారు. ఫిబ్రవరి 2024లో సుమన్ టీవీ ద్వారా తెలుగులో ప్రసారమైన ఈ ఘటనకు సంబంధించిన వార్తా క్లిప్ ఇక్కడ ఉంది:

అందువలన,ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో మసీదులో సర్వే నిర్వహించగా విగ్రహాలు దొరికాయన్న వాదన అవాస్తవం.సంభాల్ మసీదులో ఇప్పటివరకు హిందూ దేవతల విగ్రహాలను కనుగొన్నట్లు ఎటువంటి వార్తలు కానీ ఆధారాలు కానీ లేవు.కాబట్టి,ఈ వాదన/దావా వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

 

ఎలోన్ మస్క్ X ప్లాట్‌ఫారమ్‌లో పుష్ప-2 చిత్రం కోసం కొత్త ‘లైక్’ బటన్‌ను ప్రవేశపెట్టారా? వాస్తవ పరిశీలన

Claim: ఎలోన్ మస్క్ X ప్లాట్‌ఫారమ్‌లో లైక్ బటన్‌ను మార్చారనేది వాదన.

Conclusion: పూర్తిగా తప్పు. ఎలోన్ మస్క్ X ప్లాట్‌ఫారమ్‌లోని లైక్ బటన్‌ను మార్చలేదు మరియు యూసర్ ఎంగేజ్మెంట్ (User Engagement) పెంచడానికి చేసే ఇటువంటి ఉపాయాలకు/కార్యకలాపాలకు X వ్యతిరేమని హెచ్చరించారు.

Rating: పూర్తిగా తప్పు —

(యూసర్ ఎంగేజ్మెంట్ (User Engagement): యూసర్ ఎంగేజ్మెంట్ అనేది వెబ్‌సైట్ లేదా యాప్‌తో వినియోగదారులు ఎలా పరస్పర చర్య చేస్తారో, తరచుగా దాన్ని ఉపయోగిస్తున్నారా మరియు ఎంతకాలం వారు దానిపై ఉంటారనేది కొలిచే మెట్రిక్. )

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

***********************************************************************

భారతీయ చలనచిత్రాలు ప్రతి చిత్రానికి ఖర్చును పెంచుతున్నందున, తెలుగు నటుడు అల్లు అర్జున్ యొక్క “పుష్ప 2 చిత్రం” చుట్టూ జరుగుతున్న ప్రచారం కొత్త స్థాయికి చేరుకుంది.ఈ తీవ్ర ప్రచారం మధ్య, ఎలోన్ మస్క్ లైక్ బటన్‌ను మార్చినట్లు సూచిస్తూ Xలో సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేయబడింది.

వాదన/దావా ఇలా ఉంది: “ఇది అబద్ధం/ఫేక్ కాదు, ఎలోన్ మస్క్ ‘లైక్’ బటన్‌ను దీనికి మార్చారు❤️‍🔥 దానిపై క్లిక్ చేసి చూడండి.”

“ఎలోన్ మస్క్ నిజంగా లైక్ బటన్‌ను మార్చారు-ఇది నిజం!”,అంటూ, మరొక వినియోగదారుడు దీనికి మద్దతు తెలిపారు.


డిసెంబర్ 5, 2024, గురువారం నాడు పాన్-ఇండియా స్థాయిలో వేర్వేరు డబ్బింగ్ వెర్షన్‌లతో తెలుగు చలనచిత్రం పుష్ప 2 విడుదలైంది. ఈ సినిమా మొదటి భాగం పెద్ద హిట్ అయ్యింది మరియు దాని సీక్వెల్ కూడా ఊపందుకుంటున్నది.

వాస్తవ పరిశీలన

ఎక్స్ పాలసీలో లైక్ బటన్‌లపై అటువంటి మార్పు కోసం బృందం పరిశీలించినప్పుడు, ఎలోన్ మస్క్ ‘పుష్ప 2’ చిత్రం కోసం లైక్ బటన్‌ను మార్చలేదని మరియు అది ఫేక్ క్లెయిమ్/వాదన అని తేలింది.

బటన్‌పై ఒకరు క్లిక్ చేసినప్పుడు, అది ఆటోమేటిక్‌గా పోస్ట్‌ను ఇష్టపడుతున్నట్టు(లైక్ చేస్తున్నట్టు) తెలుపుతుంది.అంతేకాకుండా,షేర్ చేయబడిన వీడియో, లైక్ బటన్ ద్వారా ఇష్టపడేలా చేసి యూసర్ ఎంగేజ్మెంట్ పెంచడానికి చేసే మోసపూరిత ప్రక్రియ కోసం ఉద్దేశించబడింది,ఇది x విధానానికి విరుద్ధం.

ఇలాంటి కార్యకలాపాలకు/మాయలకు వ్యతిరేకంగా ఏప్రిల్‌లో ఎలాన్ మస్క్ హెచ్చరించారు.

అందువల్ల, ఈ దావా/వాదన పూర్తిగా తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

ఈ వీడియోలో కమలా హారిస్ ‘Xని షట్ డౌన్ చేయాలి’ అన్నారా? వాస్తవ పరిశీలన

బడ్జెట్ 2024-25 ప్రకారం, విదేశాలకు వెళ్లే వారందరికీ పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరా? వాస్తవ పరిశీలన

 

 

కేంద్ర ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. భారత ప్రభుత్వ(PIB) అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని మరియు దావా తప్పు అని స్పష్టం చేసింది.

రేటింగ్/Rating:తప్పుదారి పట్టించే వాదన. —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

***********************************************************************

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్ని భారతీయ భాషల్లో వైరల్ పోస్ట్ షేర్ అవుతోంది. క్యాబినెట్ ఆమోదించిన విధంగా పదవీ విరమణ వయస్సు 2 సంవత్సరాలు పెరిగినట్లు దావా/వాదన పేర్కొంది.

దేశంలోని యువ ఉద్యోగార్ధులపై దాని ప్రభావం ఎలా ఉంటుందనేది ఇక్కడ  షేర్ చేయబడింది.

హిందీ పోస్ట్ యొక్క తెలుగు అనువాదం: “పదవీ విరమణ వయస్సును రెండేళ్లు పెంచడం వల్ల లక్షలాది మంది ఉద్యోగులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటికే నిరుద్యోగులుగా ఉన్న యువత సంగతేంటి? అది వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇప్పటికే రిక్రూట్‌మెంట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీని వల్ల రెండేళ్లపాటు కొత్త రిక్రూట్‌మెంట్లు కూడా తగ్గుతాయి మరియు మిగిలిన ఉద్యోగులకు కూడా ప్రమోషన్లలో జాప్యం జరుగుతుంది.”

పోస్ట్ ఇక్కడ మరియు ఇక్కడ అందుబాటులో ఉంది.

వాస్తవ పరిశీలన

భారత ప్రభుత్వం ఈ విషయంలో ఏమైనా ప్రకటన జారీ చేసిందా అని పరిశీలించగా,ఇటీవలి రోజుల్లో భారత ప్రభుత్వం నుండి అలాంటి ప్రకటన ఏది లేదని కనుగొన్నాము.
ఈ వాదన వలన, ఉద్యోగంలో కొనసాగడానికి లేదా ప్రమోషన్ అవకాశల్లో తగ్గుదల లాంటి ప్రభావం లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై చూపుతుంది కాబట్టి,ఇది వార్తల్లో ముఖ్యాంశాలుగా ఉండేది. కానీ అలాంటి ప్రకటనేమీ చేయలేదు.

మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచడానికి ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టం చేసింది.

తదుపరి పరిశోధనలో, 2023 ఆగస్టులో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచే ప్రతిపాదన ఏదీ తన పరిశీలనలో లేదని ప్రభుత్వం లోక్‌సభలో ధృవీకరించిందని , మరియు కేసుల వారీగా పరిగణించబడే మినహాయింపులను పరిశీలిస్తుందని కనుగొన్నాము.

అందువల్ల, వాదన/దావా తప్పు మరియు తప్పుదారి పట్టించే విధంగా ఉంది..

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

VP నామినీ J.D. వాన్స్ పేరు ప్రకటించినప్పుడు US రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ‘ఇండియా-ఇండియా’ అన్న నినాదాలు వినిపించాయా? వాస్తవ పరిశీలన

 

సునీతా విలియమ్స్ ISS నుండి భూమికి తిరిగి వచ్చేశారని ఒక వీడియో వైరల్ అవుతుంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim: విజయవంతంగా 127 రోజుల స్పేస్ టూర్ తర్వాత, సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి తిరిగి వచ్చేశారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన.ISSలో సునీతా విలియమ్స్ యొక్క పాత (2012 నాటి) వీడియో ఉపయోగించబడింది. ఆమె ఫిబ్రవరి 2025లో భూమికి తిరిగి రావాల్సి ఉంది.

రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన.

అంతరిక్ష కేంద్రం (ISS)లో నాలుగు నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి సురక్షితంగా తిరిగి వస్తున్నారని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఒక వీడియోను షేర్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలోని కొన్ని పోస్ట్‌లను ఇక్కడ చూడండి:

ఒక వాదన ఈ విధంగా ఉంది: “విజయవంతమైన 127 రోజుల స్పేస్ టూర్ తర్వాత, “సునీతా విలియమ్స్” సురక్షితంగా భూమికి తిరిగి వస్తున్నారు. ఇది నిజంగా మనసుకు హత్తుకునే వీడియో మరియు చూడటానికి అద్భుతంగా ఉంది.”

వాస్తవ పరిశీలన వివరాలు:

అనేక క్లెయిమ్‌/వాదనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం, DigitEye India బృందం వాస్తవ-పరిశీలనకు పూనుకుంది.
వీడియో నుండి కొన్ని ఫ్రేమ్‌లను తీసుకొని, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడం ద్వారా ఇది నవంబర్ 2012 నాటి పాత వీడియో అని తేలింది. సునీతా విలియమ్స్ “32/33 అంతరిక్ష యాత్ర”లో భాగంగా జూలై 15, 2012న బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ను పర్యటించిన సందర్భంలో ISS యొక్క కక్ష్య ప్రయోగశాల, వంటగది, టాయిలెట్, స్లీపింగ్ బెడ్‌, స్పేస్ సూట్ తో సహా అన్ని సౌకర్యాలను మరియు ప్రాంతాలను వీడియోలో రికార్డు చేసారు. ఈ వీడియోను NASA యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది.

ఆమె, ఆమె తోటి వ్యోమగాములు యూరి మాలెన్‌చెంకో మరియు అకిహికో హోషిడ్‌లతో కలిసి రష్యన్ అంతరిక్ష నౌక సోయుజ్ TMA-05Mలో నాలుగు నెలల పాటు ISS దగ్గర నిలిపివేయబడింది(డాక్ చేయబడింది).తిరిగి నవంబర్ 19, 2012న భూమికి తిరిగి వచ్చారు.

అయితే, మళ్లీ జూన్ 5, 2024న, బుచ్ విల్మోర్‌తో పాటు సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) పంపబడ్డారు మరియు వారు బోయింగ్ స్టార్‌లైనర్‌ను ISSతో విజయవంతంగా డాక్ చేయగలిగారు.వాస్తవానికి ఈ మిషన్‌ను వారం రోజుల పాటు టెస్ట్ ఫ్లైట్‌గా ప్లాన్ చేశారు, కానీ బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, వారు తిరిగి రాలేక అంతరిక్షంలో చిక్కుకుపోయారు. ఫిబ్రవరి 2025లో స్పేస్‌ఎక్స్ డ్రాగన్‌లో వారిని తిరిగి భూమికి తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కాబట్టి, సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చేశారనే వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

హారిస్‌కు మద్దతు తెలిపినందుకు కంట్రీ మ్యూజిక్ ‘టేలర్ స్విఫ్ట్‌’ను నిషేధించిందా? వాస్తవ పరిశీలన

సెప్టెంబరు 10న ట్రంప్‌తో ప్రెసిడెన్షియల్ డిబేట్ సమయంలో కమలా హారిస్ తన చెవిపోగుల్లో ‘ఇయర్‌పీస్’ పెట్టుకున్నారా? వాస్తవ పరిశీలన