Category Archives: HEALTH

Science and Health

బ్రహ్మపుత్ర నది కింద రాబోయే 14-కిమీ సొరంగం గురించి తప్పు చిత్రంతో దావా చేయబడింది ; Fact Check

బ్రహ్మపుత్ర నది కింద అండర్ వరల్డ్ రోడ్డు-రైలు మార్గం రాబోతోందంటూ సోషల్ మీడియాలో ఓ చిత్రం వైరల్ అవుతోంది.
పరిశీలనలో ఉన్న బ్రహ్మపుత్ర నది కింద సొరంగానికి సంబంధించిన అనేక ప్రణాళికల కారణంగా ఇది ప్రాముఖ్యాత సంతరించుకుంది.

పోస్ట్‌తో పాటు, అండర్ వాటర్ రైల్-కమ్-రోడ్ నెట్‌వర్క్ యొక్క చిత్రం హిందీభాషలో ఉన్న క్లెయిమ్‌/దావాతో జోడించబడింది.
“इसे कहते हैं नया भारत…..भारत की पहली पानी के नीचे सड़क व रेलवे लाइन, यह असम में ब्रह्मपुत्र नदी के नीचे बनी लगभग 14 किलोमीटर लंबी सुरंग है। – जय हो” (తెలుగు అనువాదం: దీనిని న్యూ ఇండియా అంటారు… భారతదేశపు నీటి అడుగున మొట్టమొదటి రహదారి మరియు రైల్వే లైన్. ఇది అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింద నిర్మించిన సుమారు 14-కిమీ పొడవైన సొరంగం.జై హో).

పోస్ట్‌ వాట్సాప్‌లో విస్తృతంగా షేర్ చేయబడింది.

FACT CHECK

వాస్తవం తనిఖీ చేయడం కోసం Digiteye India చిత్రాన్ని స్వీకరించి, Google రివర్స్ ఇమేజ్ లో పరిశీలన చేయగా, అది పాత చిత్రమని మరియు దావా తప్పుదారి పట్టించే విధంగా ఉందని కనుగొన్నాము.

జర్మనీని డెన్మార్క్‌తో కలిపే యూరప్‌లోని ఫెహ్‌మార్న్ బెల్ట్ ఫిక్స్‌డ్ లింక్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన చిత్రం. ఈ చిత్రం నీటి అడుగున రైలు మరియు రహదారి లింక్ ఉండడంతో విస్తృతంగా ప్రసిద్ది చెందింది.

ప్రాజెక్ట్‌ పూర్తి అయినప్పుడు, నీటి అడుగున ఆటో మరియు రైలు సొరంగం జర్మనీ మరియు డెన్మార్క్‌లను కలుపుతుంది” అని ఈ చిత్ర సారాంశం. ఈ చిత్రం క్రెడిట్ ఫెమెర్న్‌కి క్రింద విధంగా ఇవ్వబడింది:

బ్రహ్మపుత్ర నది దిగువన ఉన్న నీటి అడుగున లింక్‌కు(underwater link ) సంబంధించిన వార్తల కోసం వెతుకుతున్నప్పుడు, రైల్వే మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మరియు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) దేశంలోనే నీటి అడుగున మొట్టమొదటి రోడ్-కమ్-రైల్ సొరంగాలను నిర్మించాలని యోచిస్తున్నట్లు పలు వార్తా నివేదికలు వెలువడ్డాయి. బ్రహ్మపుత్ర నది అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్‌లను కలుపుతుంది, దీని నిర్మాణానికి వ్యయం ₹7,000 కోట్లు అని అంచనా.

అయితే, ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ప్రణాళికను లేదా వివరణను విడుదల చేయలేదు. అందువల్ల, ఇది భారతదేశపు నీటి అడుగున మొట్టమొదటి రైలు-రోడ్డు ప్రాజెక్ట్ అనే వాదన తప్పు.

వాదన/Claim:అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింద భారతదేశంలోని నీటి అడుగున మొట్టమొదటి రహదారి మరియు రైల్వే లైన్ సొరంగం నిర్మించబడుతుందనే వాదనతో ఉన్న చిత్రం.

నిర్ధారణ/Conclusion:వార్త సరైనది కానీ చిత్రం తప్పు ,ఆ చిత్రం ఐరోపాలో రాబోయే సొరంగం చిత్రం.

Rating: Misleading:

[మరి కొన్ని fact Checks: Is Nobel laureate Amartya Sen dead? Fake Twitter account’s claim goes viral; Fact Check  Image of beautiful marine animal Sea Pen passed off as Nagapushpa, a rare flower]

MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check

మీజిల్స్, గవదబిళ్లలు మరియు రుబెల్లా వ్యాక్సిన్ (MMR) ఆటిజంకు కారణమవుతుందని సోషల్ మీడియా మరియు వాట్సాప్‌లో అనేక వైరల్ పోస్ట్‌లు మరియు సందేశాలు పేర్కొంటున్నాయి. ప్రజలను ఈ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండాలని వైరల్ పోస్ట్‌లు ప్రజలను కోరుతున్నాయి. MMR వ్యాక్సిన్ మరియు ఆటిజం మధ్య సంబంధం(లింక్) ఉందని ఇది పేర్కొంది.

MMR వ్యాక్సిన్‌లు పెద్దప్రేగు శోథను(colitis) కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని మరియు వ్యక్తులలో ఆటిజం స్పెక్ట్రమ్ రుగ్మతల అభివృద్ధికి దారితీస్తుందని వైరల్ పోస్ట్‌లు పేర్కొన్నాయి.
Claim/వాదనలు ‘ఆండ్రూ వేక్‌ఫీల్డ్ రాసిన పేపర్‌’ను మరియు వ్యాక్సిన్‌ల ఆధారంగా తీసిన ఒక డాక్యుమెంటరీలో ఈ రెండింటి మధ్య సంబంధం(లింక్) ఉందని కూడా పేర్కొన్నారు.

FACT CHECK

ఈ వైరల్ పోస్ట్‌లు తమ వాదనను ధృవీకరించడానికి ‘MMR వ్యాక్సిన్ పెద్దప్రేగు శోథ మరియు ఆటిజం స్పెక్ట్రమ్ రుగ్మతలతో ముడిపడి ఉందని పేర్కొన్న ఆండ్రూ వేక్‌ఫీల్డ్ వారి యొక్క 1998 పేపర్ను విస్తృతంగా ఉపయోగించుకున్నారు.అయితే, వేక్‌ఫీల్డ్ చేసిన ఈ వాదనను శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు.
ఎపిడెమియాలజిస్ట్ సెనాద్ బెజిక్ యునిసెఫ్‌తో మాట్లాడుతూ వేక్‌ఫీల్డ్‌కు ఈ అంశంపై ఆర్థికపరమైన ఆసక్తి ఉందని చెప్పారు.అతను ఈ వ్యాధులకు వ్యతిరేకంగా తన స్వంత టీకాను నమోదు చేసుకున్నాడు. అతను అనేక నైతిక నియమావళిని ఉల్లంఘించాడని కూడా నివేదికలు పేర్కొన్నాయి. అతని పత్రం 2010లో ఉపసంహరించబడింది.మరియు అతని డాక్టర్ సాధన రద్దు చేయబడింది.

MMR వ్యాక్సిన్ అంటే ఏమిటి?

MMR వ్యాక్సిన్ మీజిల్స్, గవదబిళ్లలు మరియు రుబెల్లా వంటి వ్యాధుల నుంచీ పిల్లలని కాపాడడానికి ఇచ్చె వ్యాక్సిన్. భారతదేశంలో, MMR టీకాలు రెండు మోతాదులలో ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడతాయి: 12 – 15 నెలలు మరియు 4 – 6 సంవత్సరాలు కలిగి ఉన్నా పిల్లలకు.
మీజిల్స్, గవదబిళ్లలు మరియు రుబెల్లా వైరల్ వ్యాధులు, ఇవి పిల్లలలో అనారోగ్యం, వైకల్యం మరియు మరణానికి కూడా కారణమవుతాయి. దీని లక్షణాలు శరీరంపై తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యలను కలిగి ఉంటాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, MMR టీకా గత 20 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్లకు పైగా మరణాలను నివారించింది.

WHO ఏమి చెబుతుంది?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆటిజం మరియు ఆటిజం స్పెక్ట్రమ్ రుగ్మతలను “విభిన్నమైన పరిస్థితుల సమూహంగా నిర్వచించింది. అవి సామాజిక పరస్పర చర్య మరియు కమ్యూనికేషన్‌లతో కొంత ఇబ్బందిని కలిగి ఉంటాయి.
ఇతర లక్షణాలు:  కార్యకలాపాలు మరియు ప్రవర్తనల యొక్క విలక్షణమైన నమూనాలు, ఒక కార్యాచరణ నుండి మరొక కార్యాచరణకు మారడంలో ఇబ్బంది, వివరాలపై దృష్టి మరియు ఇంద్రియ కార్యకలాపాలకు సంబంధించి అసాధారణ ప్రతిచర్యలు వంటివి.”

పర్యావరణ మరియు జన్యుపరమైన కారణాల వల్ల ఆటిజం రావచ్చని పేర్కొంది. ఆటిజం లేదా ఆటిజం స్పెక్ట్రమ్ రుగ్మతలకు కారణమయ్యే MMR వ్యాక్సిన్‌లకు సంబంధించిన వాదనలు పరిశోధనలో “పద్ధతి లోపాల” నుండి ఉత్పన్నమవుతాయి.MMR వ్యాక్సిన్(మీజిల్స్, గవదబిళ్లలు మరియు రుబెల్లా వ్యాక్సిన్) మరియు ఆటిజం ముడిపడి ఉన్నాయి అనటానికి ఎటువంటి ఆధారాలు లేవని WHO స్పష్టంగా పేర్కొంది.

వ్యాక్సిన్‌లు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌కు(ASD) కారణం కాదని US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) పేర్కొంది.వారి 2013 పరిశోధనలో, టీకాలో ఉపయోగించే పదార్థాలు ఆటిజంకు కారణం కాదని కూడా పేర్కొంది.

2002లో, అర ​​మిలియన్ కంటే ఎక్కువ మంది పిల్లలపై నిర్వహించిన డానిష్ అధ్యయనం కూడా MMR టీకాకు(మీజిల్స్, గవదబిళ్లలు మరియు రుబెల్లా వ్యాక్సిన్) మరియు ఆటిజం మధ్య ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించింది.టీకాలు వేసిన పిల్లలలో మరియు తీసుకోని పిల్లలలో ఆటిజం ప్రమాదం ఒకేలా ఉంటుందని అధ్యయనం చూపించింది.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలు/ దావా తప్పు.వాటిలో నిజం లేదు.

వాదన/CLAIM: MMR వ్యాక్సిన్ ఆటిజంకు కారణమవుతుంది.

నిర్ధారణ:విస్తృతమైన అధ్యయనాలు మరియు శాస్త్రీయ ఆధారాలు MMR టీకా మరియు ఆటిజం ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంది అనే వాదనను బలంగా తిరస్కరించాయి.

RATING: Totally False —

పైనాపిల్‌తో కూడుకున్న వేడినీరు క్యాన్సర్‌ కణాలను నాశనం చేయగలదా? Fact Check

అనేక అరుదైన పండ్ల రసాలను ఉపయోగించి క్యాన్సర్‌ను నివారించవచ్చు అనే అనేక వాదనలు WhatsAppలో షేర్ అవుతున్నాయి.ఈసారి పైనాపిల్ కలిపిన వేడినీరు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందనే వాదన వాట్సాప్‌లో షేర్ చేయబడింది.

WhatsAppలో సందేశం ఇలా వుంది: “వేడి పైనాపిల్ నీరు మిమ్మల్ని జీవితకాలం కాపాడుతుంది” మరియు “వేడి పైనాపిల్ క్యాన్సర్ కణాలను నాశనం చేయగలదు!”

అటువంటి claim/వాదన నిజమో కాదో తెలుసుకోమని Digiteye India Teamకి వాస్తవ పరిశీలన కోసం అభ్యర్థన వచ్చింది.
ట్విట్టర్‌ మరియు సోషల్ మీడియాలో ఒక సంవత్సరం పాటు ఇదే విధమైన వాదన ఉంది.ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చును.

పైనాపిల్ కాండంలో అధిక స్థాయిలో “bromelain/బ్రోమెలైన్” అనే ఎంజైమ్ ఉంటుంది – ఇది ప్రభావవంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, కండరాల ఉపశమనం మరియు జీర్ణక్రియకు సహాయం చేస్తుంది మరియు ఇది ట్యూమర్ కణాల పెరుగుదలకు ఆటంకం కలిగించే రసాయనాలు కూడా ఉండటం వలన, క్యాన్సర్‌ను నిరోధించడానికి పైనాపిల్‌ను మంచి ఆహారంగా చెప్పవచ్చును. pic.twitter.com/oJxcEE321Z
— Compounding Pharmacy (@abccompounding) February 15, 2023

FACT CHECK

మా బృందం దీనిని స్వీకరించి, ఈ claim/వాదన కొత్తది కాదని, 2021 నుండి షేర్ అవుతోంది అని తెలుసుకుంది.ముఖ్యంగా, PubMed వెబ్‌సైట్‌లో  పరిశోధన నివేదిక ప్రచురించబడిన తర్వాత ఈ వాదన/దావా చేయబడింది.

ఇటలీలోని నేపుల్స్‌లోని నేపుల్స్ ఫెడెరికో II విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ విభాగానికి సంబంధించిన ‘బార్బరా రొమానో(Barbara Romano )’ మరియు ఇతరులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం, క్యాన్సర్‌ కణాలను నిరోధించడానికి పైనాపిల్‌ కాండంలో కనిపించే కొన్ని ఎంజైమ్‌ల నాణ్యతపై ల్యాబ్ పరీక్షలు నిర్వహించి, పై నివేదికను ప్రచురించింది.
“bromelain/బ్రోమెలైన్”మరియు “N-acetylcysteine/ఎన్-ఎసిటైల్‌సిస్టీన్” కలయిక జీర్ణశయాంతర (జిఐ) క్యాన్సర్ కణాల మనుగడ మరియు విస్తరణ యొక్క నిరోధాన్ని పెంచుతుంది” అని అధ్యయనంలో తేలింది.

అయితే ఈ అధ్యయనం ఇంకా ఖచ్చితమైనా నిర్దారణ చేయలేదు మరియు మరింత పరిశీనలన అవసరం. ఇండోనేషియా క్యాన్సర్ ఫౌండేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ అరు విసాక్సోనో సుడోయో(Dr Aru Wisaksono Sudoyo) ఆగస్టు 6, 2021న AFPకి చెప్పారు.ఈ దశలో అటువంటి వాదన/దావాను ఖచ్చితంగా నిజమని నిర్ధారించలేము. క్యాన్సర్ కణాల పెరుగుదలను అణిచివేసే గుణాల కోసం “bromelain/బ్రోమెలైన్” అధ్యయనం చేయబడిందని, అయితే ఇప్పటివరకు ఎటువంటి గట్టి ఆధారం లేదని ఆయన పేర్కొన్నారు.ప్రయోగశాలలో పని చేసేది నిజ జీవితంలో ప్రభావవంతంగా ఉండకపోవచ్చు” అని ఆయన హెచ్చరించారు.

న్యూయార్క్ నగరానికి చెందిన క్యాన్సర్ నిపుణుడు మరియు “Beyond the Magic Bullet: The Anti-Cancer Cocktail” పుస్తక రచయిత,డాక్టర్ రేమండ్ చాంగ్(Dr Raymond Chang)కూడా క్యాన్సర్ కణాలపై పైనాపిల్ యొక్క ప్రభావం అనే పరిశోధన ఇప్పటికీ టెస్ట్ ట్యూబ్ అధ్యయనాలపై ఆధారపడి ఉందనే వాస్తవాన్ని పునరుద్ఘాటించారు.

మనం ప్రయోగశాలలో చేసే ప్రయోగాలు మరియు క్లినికల్ రియాలిటీ మధ్య తేడా గురించి తెలుసుకోవాలి అని చాంగ్ చెప్పారు. “చాలా సహజమైన వస్తువులు ఒక కృత్రిమ ప్రయోగశాల వాతావరణంలో క్యాన్సర్ కణాలను చంపుతాయి,కానీ మనుషులపై నిజంగా ప్రయోగించినప్పుడు అవి పని చేయవు.”

ఇప్పటికీ క్లినికల్ ట్రయల్స్ యొక్క ఫలితాలు మిశ్రమంగా ఉండి,ల్యాబ్ అధ్యయనాలు కూడా ప్రాథమికంగా ఉన్నాయి.మరియు మానవ ట్రయల్స్ (మనుషులపై ప్రయోగము) విస్తృత స్థాయిలో చేపట్టే వరకు, వేడి నీటిలో ఉన్న పైనాపిల్ క్యాన్సర్‌ను నయం చేయగలదని ఖచ్చితంగా నిర్ధారించలేము.

Claim/వాదన:పైనాపిల్‌తో కూడుకున్న వేడినీరు క్యాన్సర్‌ను నయం చేస్తుంది.

నిర్ధారణ:పరిశోధన ఫలితాలు ఇప్పటికీ ల్యాబ్ దశలోనే ఉన్నాయి మరియు మానవ ట్రయల్స్ (మనుషులపై ప్రయోగము) పెండింగ్‌లో ఉన్నాయి,కాబట్టి దీనిని ఖచ్చితంగా నిజమని నిర్ధారించలేము.

Rating: Misleading —





లేదు, ఈ వీడియో ప్రముఖ నటి వైజయంతిమాల 99 ఏళ్ళ వయసులో డ్యాన్స్ చేసింది కాదు; Fact Check

ఇటీవల ప్రముఖ నటి వైజయంతిమాల 99 ఏళ్ల వయసులో డ్యాన్స్ చేస్తూ కనిపించిందంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక వీడియో వైరల్ అయ్యింది. పోస్ట్ ఇలా ఉంది: ఆమె వైజయంతిమాల అని నమ్మడం కష్టంగా ఉంది… ఆమె అద్భుతమైన నర్తకి. 99 ఏళ్ల వయసులోనూ ఆమె డ్యాన్స్ చేయగలదు. నిజమే… రిటైర్ అయ్యరు కానీ అలసిపోలేదు.

ఇక్కడ షేర్ చేయబడింది.

వైజయంతిమాల

FACT CHECK

వాస్తవం పరిశీలన చేయమని Whatsappలో అభ్యర్థన వచ్చినప్పుడు Digiteye India సంస్థ వారు వీడియో యొక్క కొన్ని ప్రముఖ ఫ్రేమ్‌లను తీసుకొని Google రివర్స్ ఇమేజ్ శోధనలో వాటిని పరిశీలించినప్పుడు, ఆ వీడియో 93 ఏళ్ల వృద్ధురాలు గురించి ABP లైవ్ ద్వారా డిసెంబర్ 6, 2022న ఒక వార్తా నివేదికలో ఉపయోగించినట్లు కనుగొన్నాము.

ఆమె మరియు బాలీవుడ్  నటుడు షమ్మీ కపూర్ యొక్క ప్రసిద్ధ పాట ‘బదన్ పే సితారే లాపేతే హుయే’కి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. కాని వైరల్ వీడియోలో ఉన్న వృద్ధురాలు నటి వైజయంతిమాల అని నివేదికలో పేర్కొనలేదు.

93 साल की उम्र में दादी पर चढ़ा शम्मी कपूर का जादू…
बदन पे सितारे लपेटे हुये गाने पर जमकर थिरक रही दादी…#Viral #Dance #ShammiKapoor

pic.twitter.com/HCLW9cTahU

— Narendra Singh (@NarendraNeer007) December 5, 2022

మరింత పరిశీలించినప్పుడు, అనేక మీడియా నివేదికలలో డిసెంబర్ 2022లో 93 ఏళ్ల వృద్ధురాలు చాలా సరదాగా డ్యాన్స్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆమె ‘ప్రిన్స్’ చిత్రంలో వైజయంతిమాల మరియు షమ్మీ కపూర్ చేసిన ప్రసిద్ధ పాటకి/సంగీతానికి అద్భుతమైన నృత్యం చేయడం కనిపిస్తుంది.

వీడియోలోని నాట్యం చేసిన వృద్ధురాలు వైజయంతిమాల లాగా లేదు.చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వైజయంతిమాల తాజా ఫోటో(పైన ఫోటో) చూస్తే మనకు తెలుస్తుంది.ఈ సంఘటన/ఇవెంట్ మార్చి 21, 2023న Mylapore Times కవర్ చేసారు.

IMDB రికార్డుల ప్రకారం, వైజయంతిమాల ఆగస్టు 13, 1933న జన్మించారు, అంటే ప్రస్తుతం ఆమె వయస్సు 89 సంవత్సరాలు,మరియు వాదన/దావా ప్రకారం 99 సంవత్సరాలు కాదు.

వాదన/దావాలోని ఈ వీడియో సంబంధము లేదనిది, మరియు వైజయంతిమాలకి తప్పుగా ఆపాదించబడింది.

వాదన/Claim: ప్రముఖ నటి వైజయంతిమాల 99 ఏళ్ల వయసులో డ్యాన్స్ చేస్తున్నట్లు తప్పుడు వీడియో షేర్ చేయబడింది.

నిర్ధారణ:వీడియోలో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి వైజయంతిమాల కాదు, ఆమె వయస్సు 89 సంవత్సరాలు, 99 సంవత్సరాలు కాదు.
Rating: Misrepresentation —

గుడ్లు చెట్ల నుండి వేలాడుతున్నాయా? Fact Check

చెట్లకు వేలాడుతున్న గుడ్ల యొక్క కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో అవి తెల్లటి మామిడిపండ్లు అనే వాదనలతో ప్రచారం చేయబడ్డాయి.

“కొన్ని ఆఫ్రికన్ల భూములలో మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో తెల్లటి మామిడిపండ్లు కనిపిస్తాయి” అని Facebookలో పోస్ట్ చేయబడినది.
ఆ చిత్రాలను ట్విట్టర్‌లో కూడా షేర్ చేశారు here.
వాదన/Claim ఇలా ఉంది: “హే అబ్బాయిలు, మీరు ఇంతకు ముందు తెల్లటి మామిడిపండ్లు చూశారా లేదా తిన్నారా ??? దేవుని సృష్టి ఎంత అందమైది”.

Hey guys, have you seen or eaten the white mongo before??? What a beautiful God creations ❤️ pic.twitter.com/3f2i05tbi0

— aa alhaji (@aaalhajiii) April 30, 2023

FACT CHECK

చిత్రాల ప్రామాణికత కోసం పరిశీలన చేసినప్పుడు, ఈ చిత్రాలకు ఎడమ దిగువన ‘Bing ఇమేజ్ క్రియేటర్’ ముద్ర వుందని మా బృందం గ్రహించింది.


మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజన్ బింగ్‌లో వెతికితే , Artificial Intelligence ఈ చిత్రాలను ‘బింగ్ ఇమేజ్ క్రియేటర్‌ని’ ఉపయోగించి సృష్టించిన చిత్రాలు అని తేలింది.

Hey guys, have you seen or eaten the white mongo before??? What a beautiful God creations ❤️ pic.twitter.com/3f2i05tbi0

— aa alhaji (@aaalhajiii) April 30, 2023

 

“చిత్రంలోని కొన్ని గుడ్లు లోపాలు మరియు వక్రఆకారం కలిగి ఉన్నాయి,కొన్ని ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి,మరికొన్ని ఆకారంలో అసమానతలను చూపుతున్నాయి”అని మైక్రోసాఫ్ట్‌కు చెందిన ‘జెనరేటివ్ AI మరియు డీప్‌ఫేక్‌’ సలహాదారు హెన్రీ అజ్డర్ (Henry Ajder) రాయిటర్స్‌తో(Reuters) అన్నారు.

అందువల్ల, ఇవి AI- రూపొందించబడిన గుడ్లు, నిజమైన గుడ్లు కావు.

Claim/వాదన: గుడ్ల లేదా తెల్లటి మామిడిపండ్లు చెట్ల నుండి వేలాడుతున్నాయి.

నిర్ధారణ: సృష్టికర్త ‘Bing ఇమేజ్ క్రియేటర్‌ని’ ఉపయోగించి AI చేత రూపొందించిబడిన చిత్రం, అంతేకాని నిజమైనది కాదు.
Rating: Misleading —

శానిటైజర్ వాడటం వలన చేతులు కాలి గాయలవుతాయ? Fact check

ఆల్కహాల్ కలిగి ఉన్నహ్యాండ్ శానిటైజర్‌లను చేతులకు రాసుకుని తర్వాత నిప్పు లేదా స్టవ్ దగ్గరికి వెళ్లవద్దని సూచిస్తూ సోషల్ మీడియాలో ఒక వైరల్ సందేశం కనిపించింది.
హిందీలో సందేశం ఇలా ఉంది: “ఒక మహిళ శానిటైజర్ చేతులకు రాసుకుని వంట చేయడానికి వంటగదికి వెళ్లింది. ఆమె స్టవ్ ఆన్ చేసిన క్షణంలో, శానిటైజర్‌లో ఆల్కహాల్ ఉండటంతో ఆమె చేతులకు మంటలు అంటుకున్నాయి.”

ఒక మహిళ తీవ్రంగా కాలిపోయిన చేతులను చూపుతున్న చిత్రం షేర్ చేస్తు “దయచేసి ఆల్కహాల్ కలిగి ఉన్న హ్యాండ్ శానిటైజర్‌లను చేతికి రాసుకున్న తర్వాత స్టవ్/ఫైర్ దగ్గరికి వెళ్లవద్దు.”అని సందేశం/message పెట్టరు.

వైరల్ అవుతున్న చిత్రం శానిటైజర్‌ వల్ల కాలిన చిత్రం కాదు. అది వేరొక చిత్రం.
‘Google రివర్స్ ఇమేజ్’ఉపయోగించి పరిశీలించినప్పుడు, ఇది స్కిన్ గ్రాఫ్ట్‌ల(skin grafts) కోసం తీసిన బాధితుడి యొక్క చేతుల చిత్రం.ఒకవేళ చేతులు నిజంగా కాలితే, అంచులు అంత స్పష్టంగా(ఎవరో కట్ చేసినట్టు) కనపడవు. స్కిన్ గ్రాఫ్టింగ్(skin grafting) ప్రక్రియాలో, వైద్యులు శరీరంలోని ఒక భాగం నుండి చర్మాన్ని తీసివేసి, మరొక భాగంలో మార్పిడి చేస్తారు.

అందువల్ల, వైరల్ అవుతున్న చిత్రం హ్యాండ్ శానిటైజర్‌ను చేతికి రాసుకున్న వెంటనే నిప్పు వెలిగించేటప్పుడు చేతులకు మంటలు అంటుకున్న మహిళది కాదని స్పష్టమైంది.

శానిటైజర్‌ల గురించి తెలుసుకుందాము.  ఆల్కహాల్ కంటెంట్ శానిటైజర్‌ ద్రవంలో కేవలం ఒక మిల్లీలీటర్ (అనుమతించబడిన మోతదు) మాత్రమే ఉంటుంది,ఇది చేతులకు రాసుకున్న 10 సెకన్లలో ఆవిరైపోతుంది.
నాణ్యమైన శానిటైజర్‌ని రాసుకుంటే ఎటువంటి మంటను కలిగించదు, ఎందుకంటె రాసుకున్న సెకన్లలో అది ఆవిరైపోతుంది.

అయినప్పటికీ, కొన్ని ఇంట్లో తయారుచేసిన శానిటైజర్లు అగ్నికి కారణమైన సంఘటనల కొన్ని వెలుగులోకి వచ్చాయి.న్యూజెర్సీలోని ఒక బాలుడు స్థానిక 7-ఎలెవెన్ స్టోర్ యజమాని తయారు చేసిన స్ప్రే శానిటైజర్‌ను ఉపయోగించి కాలిన గాయాలకు గురైన సంఘటన జరిగింది. స్టోర్ యజమాని (శానిటోజర్ తయారీలో పూర్తి పరిజ్ఞానం లేకుండా)అందుబాటులో ఉన్న ఫోమింగ్ శానిటైజర్‌లో నీటిని కలిపి తయారుచేశాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునే ముందే అప్పటికే స్టోర్‌లో 14 స్ప్రే బాటిళ్లను విక్రయించినట్లు సమాచారం.

Claim/వాదన: శానిటైజర్ వాడటం వలన చేతులు కాలి గాయలవుతాయ? Fact check
నిర్ధారణ: నాణ్యమైన శానిటైజర్‌ని రాసుకుంటే ఎటువంటి మంట కలిగించదు, ఎందుకంటె రాసుకున్న సెకన్లలో అది ఆవిరైపోతుంది.
Rating Misrepresentation:

ఇది కూడా చూడండి:Rs.2000 note banned from Dec 31? Fact check?



					

దిగ్విజయ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ అంబులెన్సుల ఫోటోలను ట్వీట్ చేస్తూ, UP ముఖ్యమంత్రి నిర్లక్ష్యం అని పప్పులో కాలేశాడు!

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అంబులెన్సుల ఫోటోలను ట్వీట్ చేస్తూ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి   ఆదిత్యనాథ్అంబులెన్సు వాహనాలను దుమ్ము పెట్టాడని ఆరోపించారు. సింగ్ అంబులెన్సుల చిత్రం ట్వీట్ చేశాడు. చిత్రాలను క్రాస్-వెరిఫై చేయకుండా ట్వీట్ చేశాడు.

బీజేపీ నేతలు వెంటనే స్పందించి కాంగ్రెస్ పార్టీ నేత ట్విట్టర్డి ద్వారా నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ట్విట్టర్లో కొందరు ‘నకిలీ’ ఫోటోను వ్యాపమ్ కేసులో కాంగ్రెస్ నాయకుడి నిక్షేపణకు జతచేశారు. “అతను ముందు కల్పించిన సాక్ష్యం మరియు ఇప్పుడు ఒక నకిలీ ఫోటో ఉత్పత్తి,” ఒకరు ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ ప్రొఫెషినల్ ఎగ్జామినేషన్ బోర్డ్ నిర్వహించిన పరీక్షల్లో జరిగిన అవకతవకలను వ్యాపమ్కేసు అని కూడా పిలుస్తారు.