ఏటీఎంలలో రూ.500 నోట్లు కాకుండా రూ.100, రూ.200 నోట్లు ఇవ్వాలని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఇతర అన్ని బ్యాంకులను కోరిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇతర అన్ని బ్యాంకులను సెప్టెంబర్ 30 నుండి ATMల ద్వారా 500 నోట్లు చెల్లించడాన్ని నిలిపివేయాలని కోరిందనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. రూ.500 నోట్లతో పాటు రూ.100, రూ.200 నోట్లను దశలవారీగా తప్పనిసరిగా ATM ద్వారా ఇచ్చేలా చూడాలని ఆర్బీఐ బ్యాంకులను కోరింది. వాదన/క్లెయిమ్ చేసినట్లుగా రూ.500 నోట్లను పంపిణీ చేయవద్దని బ్యాంకులకు సూచించలేదు.
రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన—
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇతర అన్ని బ్యాంకులను సెప్టెంబర్ 30 నుండి ATMల ద్వారా 500 నోట్లు చెల్లించడాన్ని నిలిపివేయాలని కోరినట్లు సోషల్ మీడియాలో ఒక సందేశం షేర్ చేయబడుతోంది. పోస్ట్ను ఇక్కడ X.comలో ఇక్కడ చూడవచ్చు:
RBI has asked all banks to stop
disbursing 500₹ notes by 30 sep
from ATM.
Target is 75% of all banks
BANKS ATM & then 90% ATM
by 31 Mar26.
ATM going forward will only
disburse only 200₹ and
100₹ notes only.#Public torture is Real— A K Mandhan (@A_K_Mandhan) June 3, 2025
వాదన/దావా ఈ విధంగా ఉంది: “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇతర అన్ని బ్యాంకులను సెప్టెంబర్ 30 నుండి ATMల ద్వారా 500 నోట్లు చెల్లించడాన్ని నిలిపివేయాలని కోరినట్లు సోషల్ మీడియాలో ఒక సందేశం షేర్ చేయబడుతోంది. సెప్టెంబర్ 30 నాటికి మొత్తం బ్యాంకుల్లో 75% ATMలు, 31 మార్చి 26 నాటికి 90% లక్ష్యం. ఇకపై ATM కేవలం 200₹ మరియు 100₹ నోట్లను మాత్రమే ఇస్తుంది.
#నిజంగా పబ్లిక్ టార్చర్ (#Public torture is Real).”
ఇది ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
వాస్తవ పరిశీలన
Digiteye India బృందం అభ్యర్థనను స్వీకరించి పరిశీలించగా సోషల్ మీడియాలో సూచించిన విధంగా రూ.500 నోటును నిలిపివేయడం గురించి RBI నుండి అలాంటి చర్య ఏమీ లేదని తేలింది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్ 28, 2025న ప్రజలకు తక్కువ విలువ గల నోట్ల లభ్యతను పెంచడానికి ATMలు రూ.100 లేదా రూ.200 డినామినేషన్ నోట్లను పంపిణీ చేయాలనీ బ్యాంకులను కోరుతూ ఒక సర్క్యులర్ జారీ చేసింది. మరియు, రూ.500 నోట్లతో పాటు తక్కువ విలువ గల నోట్లను కూడా ఉంచుకోవాలని మార్గదర్శకంలో స్పష్టంగా ఉంది. దశలవారీగా దీనిని అమలు చేయాలని బ్యాంకులకు సూచించబడింది (దిగువున చూడవచ్చు):
“ప్రజలకు తరచుగా ఉపయోగించే నోట్లకు అందుబాటును పెంచే ప్రయత్నంలో భాగంగా, అన్ని బ్యాంకులు మరియు వైట్ లేబుల్ ATM ఆపరేటర్లు (WLAOs) వారి ATMలు రూ.100, రూ.200 డినామినేషన్ నోట్లను క్రమం తప్పకుండా ఇచ్చేలా చూడాలని నిర్ణయయించబడింది…,” అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన సర్క్యులర్లో పేర్కొంది.
సర్క్యులర్ ప్రకారం, అన్ని ATMలలో 75% కనీసం ఒక క్యాసెట్ నుండైనా రూ.100 లేదా రూ.200 డినామినేషన్ నోట్లను ఇవ్వబడతాయి. మార్చి 31, 2026 నాటికి, అన్ని ATMలలో 90% కనీసం ఒక క్యాసెట్ నుండైనా రూ.100 లేదా రూ.200 డినామినేషన్ నోట్లను ఇవ్వబడతాయి.
కాబట్టి ఏటీఎంల నుంచి రూ.500 నోట్లు తీసుకునే అవకాశం క్రమంగా నిలిపివేస్తారన్న వాదన తప్పు.
మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
సుందర్ పిచాయ్ ‘గూగుల్ ఇన్వెస్ట్’ ప్లాట్ఫారమ్ను బహిరంగంగా ఆమోదించారా? వాస్తవ పరిశీలన
క్యాన్సర్ నివారణకు విటమిన్ ‘డి’ ఏకైక అత్యంత ప్రభావవంతమైన ఔషధమా? వాస్తవ పరిశీలన