Category Archives: BUSINESS

మొబైల్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లపై GST 31.3% నుంచి 18%కి తగ్గిందని క్లెయిమ్/వాదన వైరల్ అవుతోంది; Fact Check

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ GST రేటును 31.3% నుండి 18%కి తగ్గించిన తర్వాత మొబైల్ ఫోన్‌లు, టీవీలు మరియు రిఫ్రిజిరేటర్‌లు చౌకగా మారాయని ఒక సోషల్ మీడియా పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది.
ఇది ఇక్కడ మరియు ఇక్కడ సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. ఈ ట్వీట్‌ను షేర్ చేస్తూ, చాలా మంది ‘GST రేట్లు పెంచినప్పుడు విమర్శించిన వారు ఇప్పుడు బయటకు వచ్చి అభినందించాలి’ అంటూ సందేశాలు పోస్ట్ చేశారు. అనేక మీడియా సంస్థలు మరియు అధికారిక వెబ్‌సైట్‌లు ఇదే సందేశాన్ని వెళ్ళడించాయి.

గృహోపకరణాల ధరలపై పెద్ద ఉపశమనం: కొత్త GST రేట్ల క్రింద ఉన్న వస్తువుల జాబితాను చూడవచ్చును 👇#GST #India #House #TV #Mobile #Tax pic.twitter.com/GcjTgpv6Wt

— ET NOW (@ETNOWlive) July 2, 2023

PIB కూడా ఇదే సందేశాన్ని షేర్ చేసింది.
తగ్గిన పన్నులతో, #GST ప్రతి ఇంటికి ఆనందాన్ని తెస్తుంది:గృహోపకరణాలు మరియు మొబైల్ ఫోన్‌లపై #GST ద్వారా ఎంతో ఉపశమనం📱🖥️#6YearsofGST #TaxReforms

#GSTforGrowth pic.twitter.com/LgjGQMbw6e

— PIB India (@PIB_India) June 30, 2023

FACT CHECK

DigitEye బృందం వారు GST కౌన్సిల్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించినప్పుడు, కౌన్సిల్ నుండి అలాంటి నోటిఫికేషన్/సూచన ఏదీ చేయలేదు.అంతేకాకుండా, వైరల్ పోస్ట్‌లో పేర్కొన్న విధంగా 31.3% కాకుండ ప్రస్తుత GST స్లాబ్‌లు 5%, 12%, 18% మరియు గరిష్టంగా 28% వరకు ఉన్నాయి. GST అమలై 6 సంవత్సరాలైన సందర్బాన్ని (6వ వార్షికోత్సవం) 01 జూలై 2023న న్యూఢిల్లీలో ‘GST డే’గా జరుపుకుంది.ఇక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2017లో GSTని ప్రవేశపెట్టడానికి ముందు మరియు తర్వాత యొక్క పన్నులను పోలుస్తూ,GST యొక్క ప్రయోజనాలను హైలైట్ చేసారు.

నేటి నుంచే జీఎస్టీ రేట్లు తగ్గింపు…

ఎవరైతే ‘GST’ రేట్లు పెంచినప్పుడు విమర్శించినారో వారు ఇప్పుడు బయటకు వచ్చి అభినందించాలి. pic.twitter.com/H2ljyr5cKS

— Novice2NSE (@Novice2NSE) July 1, 2023

వాదన ప్రకారం GST తగ్గిందని సోషల్ మీడియా విస్తృతంగా షేర్ చేయబడ్డది.అలానే Zee News, ABP Live, News18, Jagran, India TV, ET Now వంటి అనేక మీడియా సంస్థలు ఇదే సందేశాన్ని అందించాయి. వాస్తవం ఏమిటంటే GSTని ప్రవేశపెట్టడానికి ముందు మరియు తర్వాత యొక్క పన్నుల(SST) పోలిక మాత్రమే, కాని మొబైల్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లపై ప్రస్తుత GST రేటు తగ్గిందని  కాదు. 2020లో కొన్ని గృహోపకరణాలపై రేటు తగ్గించబడింది లేదా పెంచబడింది, కాని ఇప్పుడు కాదు.

తగ్గిన పన్నులతో, #GST ప్రతి ఇంటికి ఆనందాన్ని తెస్తుంది:గృహోపకరణాలు మరియు మొబైల్ ఫోన్‌లపై #GST ద్వారా ఎంతో ఉపశమనం📱🖥️#6YearsofGST pic.twitter.com/JzMGqZjFSA

— CBIC (@cbic_india) July 4, 2023

[ఇది కూడా చూడండి:Did TTD reject KMF bid for supply of Nandini ghee after 50 years? Fact Check]

Central Board of Indirect Taxes & Customs తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వివిధ గృహోపకరణాలపై పన్ను రేట్లు 2017లో GST అమలుకు ముందు మరియు తర్వాత ఉన్నాయని స్పష్టత ఇచ్చింది.పైన పేర్కొన్న ఉపకరణాల రేట్లు 2020లో 28%కి పెంచబడ్డాయి.
అందువల్ల, వాదన/దావా తప్పుదారి పట్టించే విధంగా వుంది, మరియు అది నిజం కాదు.

ప్రస్తుత GST రేట్లు

CBIC వెబ్‌సైట్ మరియు గృహోపకరణాలపై GST యొక్క తాజా సవరణ ప్రకారం, 1 ఏప్రిల్ 2023న నిర్ణయించబడిన పన్ను రేట్లు మారవు. మొబైల్ ఫోన్‌లు, టెలివిజన్‌లు (32 inches కంటే తక్కువ) మరియు రిఫ్రిజిరేటర్‌లకు ప్రస్తుత GST రేట్లు 18%.
2020లో మొబైల్ ఫోన్‌లకు (12% నుండి 18% వరకు), మరియు 2018లో రిఫ్రిజిరేటర్‌లు,టెలివిజన్‌లకు (32 అంగుళాల వరకు) (28% నుండి 18% వరకు) ఈ రేట్ల చివరి సవరణ జరిగింది.

వాదన/Claim: GST రేటును 31.3% నుండి 18%కి తగ్గించిన తర్వాత మొబైల్ ఫోన్‌లు, టీవీలు మరియు రిఫ్రిజిరేటర్లు చౌకగా మారాయి.

నిర్ధారణ: పేర్కొన్న గృహోపకరణాలపై పన్ను రేట్ల సవరణకు సంబంధించి భారత ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. 01 ఏప్రిల్ 2023న నిర్ణయించబడిన పన్ను రేట్లు నేటికీ మారలేదు.

మొబైల్ ఫోన్‌లు, టెలివిజన్‌లు (32 inches కంటే తక్కువ) మరియు రిఫ్రిజిరేటర్‌లకు ప్రస్తుత GST రేట్లు 18%.
2020లో మొబైల్ ఫోన్‌లకు (12% నుండి 18% వరకు), మరియు 2018లో రిఫ్రిజిరేటర్‌లు,టెలివిజన్‌లకు (32 అంగుళాల వరకు) (28% నుండి 18% వరకు) ఈ రేట్ల చివరి సవరణ జరిగింది.

అధికారిక ప్రకటన ప్రకారం GSTకి ముందు మరియు GSTకి తరువాత రేట్లు, అంతేకాని తాజాగా తగ్గించలేదు.
తాజా తగ్గింపుగా తప్పుగా సూచించబడింది.
Rating: Misleading —

[ఇది కూడా చూడండి: No, Rs.500 Indian currency notes with ‘*’ symbol are NOT FAKE but genuine; Fact Check]

పాత రూ.2 నాణెం ఆన్‌లైన్‌లో లక్షల రూపాయలకు అమ్ముడుపోతోందా? వాట్సాప్‌లో వీడియో వైరల్; Fact Check

ఓ యాంకర్ పాత రూ 2 నాణెంకు లక్షల రూపాయలు చెల్లించి కొనుక్కోవడానికి కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్నందున రూ 2 నాణెం మిమ్మల్ని రాత్రికిరాత్రే ధనవంతులను చేస్తుంది.ఆమె మిమ్మల్ని క్వికర్ ఖాతాను (Quikr account)తెరవమని కోరితు మరియు రూ 2 నాణెం చిత్రాన్ని అప్‌లోడ్ చేయమని అడుగుతుంది. 2 నాణెం కొనుగోలుదారు కోసం వేచి ఉండండి అని చెబుతుంది.

Zeenews.com/business వంటి అనేక వార్తా పబ్లికేషన్‌లు కూడా Quikr ఖాతాను ఎలా తెరవాలనే దానిపై వివరంగా సమాచారాన్ని అందించాయి. రూ 2 నాణెం కోసం Googleలో వెతికినప్పుడు, క్రింద సమాచారం వెలువడుతుంది. Digiteye India వాస్తవం తెలుసుకొనుటకు పై వీడియో స్వీకరించింది.

FACT CHECK

Digiteye team వారు Googleలో వెతికినప్పుడు, Claim/దావా రెండు సంవత్సరాలకు పైగా కొనసాగుతోంది.

‘నుమిస్మాటిక్స్'( numismatics–పాత బ్యాంకు నోట్లు, పాత నాణేల సేకరణ మరియు అధ్యయనం)విభాగంలో పరిశీలించినప్పుడు, పాత రూ.2 నాణేలు చాలా వరకు రూ.500కు మించకుండా అమ్ముడుపోయినట్టు క్వికర్ వెల్లడించింది.అంతేకాదు రూ. 2 నాణేలు అంత అరుదైనవి కావు.

Quoraలోని కొంతమంది వ్యక్తులు ఇది మోసానికి దారితీస్తుందని హెచ్చరించారు, దీని ద్వారా రూ. 2 నాణేలు అమ్మేవాళ్ళు తమ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ కార్డ్ నంబర్ మరియు OTP లాంటి సమాచారాన్ని అందించేలా తప్పుదారి పట్టించవచ్చు.ఆ తరువాత మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బును సులభంగా బదిలీ చేస్తారు.

 

Digiteye India బృందం 1994 సంవత్సరం నాటి నాణెం క్వికర్‌లో (Quikr) పెట్టినప్పుడు, కొనాలకున్న వ్యక్తి నాణెంకు రూ. 2 లక్షలు ఇస్తానని, ధృవీకరణ సాకుతో బ్యాంక్ వివరాలు, ఆధార్ కార్డ్ నంబర్ వంటి వివరాలను కోరింది.చివరగా, ఆ వ్యక్తి ధృవీకరణ సాకుతో OTPని షేర్ చేయమని అడిగాడు, దీని వలన team member యొక్క బ్యాంక్ ఖాతా నుండి తక్షణమే నగదు బదిలీ చెయ్యబడే అవకాశం ఉండేది.మా ఆన్‌లైన్ సెర్చ్‌లో వెల్లడైనట్లు ఇది చాలా మందికి అనుభవం అయ్యింది.

ఆర్‌బీఐ ఏం చెబుతోంది:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఆగష్టు 24, 2021న, ఈ విధంగా కొనసాగుతున్న మోసపూరిత కార్యకలాపాలలో భాగంగా వివిధ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పాత నోట్‌లు మరియు నాణేలను కొనుగోలు చేసే లేదా విక్రయించే బోగస్ ఆఫర్‌లకు వ్యతిరేకంగా ప్రజలను హెచ్చరించింది.

ఆర్‌బిఐ (RBI) ఒక పత్రికా ప్రకటనలో, ప్రజలను జాగ్రత్తగా ఉండాలని మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరును ఉపయోగించి ఇటువంటి మోసపూరిత ఆఫర్‌ల ద్వారా డబ్బును రాబట్టడానికి మోసకారుల బారిన పడవద్దని సూచించింది.

కొన్ని అంశాలు మోసపూరితంగా RBI పేరు/లోగోను ఉపయోగిస్తున్నాయని మరియు వివిధ ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా పాత నోట్లు & నాణేల కొనుగోలు మరియు అమ్మకానికి సంబంధించిన లావాదేవీలలో ప్రజల నుండి ఛార్జీలు/కమీషన్/పన్ను కోరుతున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చింది. ఆర్‌బిఐ సందేశన్ని ఏఎన్ఐ వార్తా సంస్థ (ANI news Agency) పేర్కొంది.

మారుతి సుజుకి వంటి ప్రధాన కంపెనీల వార్షికోత్సవాల సందర్భంగా ప్రజలకు బహుమతులు, కార్లు మరియు గృహోపకరణాల ఇస్తామని WhatsAppలో హామీ ఇవ్వబడిన అనేక వాదనలను గతంలో Digiteye India తిరస్కరించి, వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. కొత్త రూ. 2 కాయిన్ ట్రిక్ అనేది కూడా ప్రజలను మోసం చేయడానికి మరొక మోసపూరిత మార్గం.

Claim/వాదన: పాత రూ.2 నాణేన్ని లక్షల రూపాయలకు ఆన్‌లైన్‌లో విక్రయించండి.

నిర్ధారణ: Quikr లేదా Tezbid.com వంటి ఆన్‌లైన్ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లలో 2 నాణెం గరిష్టంగా రూ.500కి విక్రయిస్తుంది, అంతే కాని లక్షల్లో కాదు.మరియు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దోచుకొడానికి ఆన్‌లైన్ మోసంలో భాగం కావచ్చు. కాబట్టి ఈ Claim/వాదన తప్పు.నిజం లేదు.

Rating: Totally False 

 

 

 

 

500 రూపాయలలో నక్షత్రం (*) గుర్తు ఉన్నచో అది నకిలి నోటా? Fact Check

గత కొన్ని రోజులుగా చెలామణిలో ఉన్న నక్షత్రం (*) గుర్తు ఉన్న ₹500 నోట్లు నకిలీ నోట్లు అనే క్లెయిమ్‌తో సోషల్ మీడియా పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది. ఇటీవల RBI చెలామణి నుండి రూ.2,000 నోట్లను ఉపసంహరించుకున్న సందర్భంలో, నక్షత్రం గుర్తు ఉన్న ₹500 నోటు మరింత దృష్టిని ఆకర్షించింది.

ఈ సందర్భంగా, ఫేస్‌బుక్ పోస్ట్‌లోని లో ఒక వాదన ఈ మధ్య చాలమంది షేర్ చేసారు ఇలా: “గత 2-3 రోజుల నుంచి * గుర్తుతో కూడిన ఈ 500 నోట్లు మార్కెట్‌లో చెలామణి కావడం ప్రారంభించాయి.అలాంటి నోటు నిన్న IndusInd బ్యాంక్ నుండి తిరిగి వచ్చింది. ఇది నకిలీ నోటు.ఈ రోజు కూడా, ఒక స్నేహితుడు కస్టమర్ నుండి అలాంటి 2-3 నోట్లను అందుకున్నాడు, కానీ వెంటనే వాటిని తిరిగి ఇచ్చెసాడు.అయితే ఈ నోటును ఎవరో ఉదయం ఇచ్చారని కస్టమర్ కూడా చెప్పాడు.జాగ్రత్త వహించండి. ఇక్కడ మార్కెట్‌లో నకిలీ నోట్లను చెలామణి చేసే మోసగాళ్ల సంఖ్య పెరిగింది. అబ్యర్ధన: దయచేసి అప్రమత్తంగా ఉండండి.ఈ సందేశాన్ని మీ సోదరులకు తెలియజేయండి, తద్వారా వారు మోసం నుండి రక్షించపబడతారు. ధన్యవాదాలు.”

ఈ రకమైన వార్తలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చును.

FACT CHECK

చాలా మంది వ్యక్తులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున Digiteye India team ఈ పోస్ట్‌లో ఎంత వాస్తవం ఉందొ పరిశీలనకు  తీసుకుంది. మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్‌సైట్‌లో, ₹500నోట్లు యొక్క ప్రామాణికత కోసం పరిశీలన చేసినప్పుడు, RBI ఇటీవల జూలై 27, 2023 తేదీలో జారీ చేసినతన పత్రికా ప్రకటనలో,  ఈ నోటు చట్టబద్ధమైనదని స్పష్టం చేసింది. RBI పత్రికా ప్రకటన క్రింద చూడవచ్చు:

ఈ విషయంలో, లోపభూయిష్టంగా ముద్రించిన బ్యాంక్ నోట్లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుట కోరకు బ్యాంక్ నోటు యొక్క నంబర్ ప్యానెల్‌లో స్టార్ (*) చిహ్నం చేర్చబడ్డదని RBI పేర్కొంది. (100 సీరియల్ నంబర్ ఉన్న బ్యాంక్ నోట్ల ప్యాకెట్‌లో స్టార్ (*) చిహ్నం చెర్చబడినది). నక్షత్రం (*) చిహ్నం ఉన్న బ్యాంక్ నోటు ఏదైనా ఇతర చట్టపరమైన బ్యాంక్ నోటుతో సమానంగా ఉంటుంది, అని RBI వెలువడించింది.

RBI యొక్క FAQ విభాగంలో కూడా “స్టార్ (*) చిహ్నం పద్దతి లోపభూయిష్టంగా ముద్రించిన బ్యాంక్ నోట్లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుట కోరకు చెర్చబడినది అని, నక్షత్రం (*) చిహ్నం ఉన్న బ్యాంక్ నోటు ఏదైనా ఇతర చట్టపరమైన బ్యాంక్ నోటుతో సమానంగా ఉంటుంది అని అని RBI వెలువడించింది.

మేము 2006 లో జారీ చేసిన ఇదే విధమైన ప్రెస్ రిలీజ్‌ని కనుగొన్నాము. ఇక్కడ ₹10,₹20,₹50 విలువ కలిగిన
కరెన్సీ నోట్లలో ‘స్టార్’ ప్రిఫిక్స్ జోడించబడుతుందని పేర్కొంది.

Claim/వాదన: RBI యొక్క ₹500 రూపాయలలో నక్షత్రం (*) గుర్తు ఉన్నచో అది నకిలి నోటు.
నిర్ధారణ: తప్పు,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ నోట్లు చట్టబద్ధమైనవని స్పష్టం చేసింది.
Rating: Misrepresentation -- 



					

జగన్ డబ్బు కోసం అడుగుతున్నారా? నకిలీ వీడియో శీర్షిక అలా సూచిస్తుంది!

వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ వీడియోలో మాట్లాడుతున్నాడు అని మనకు తెలుస్తోంది కానీ వీడియోలో ఉన్న టెక్స్ట్ మాత్రం వేరే రకంగా ఉంది. ఈ రకమైన విపరీతార్థాలు సృష్టించి ఏ విధంగానూ ధ్వని వినపడకుండా ఉండే ఈ వీడియోలో ఏమైనా సూచించవచ్చు.

ఈ టెక్స్ట్ ప్రకారము ఒక వ్యక్తి జగన్ను ఉద్దేశించి ఇలా  అంటున్నాడు:”సర్,  అతని దగ్గర డబ్బు ఉంది. దయచేసి అతనిని పార్టీలోకి తీసుకోండి.” అప్పుడు జగన్ ఇచ్చిన జవాబు: “అతను డబ్బు సంపాదించాడు కానీ అది అది తీసి ఇవ్వకపోవచ్చు.”  ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం: “అతను దానిని తప్పకుండా తీసి ఇస్తాడు, దయచేసి అతనిని తీసుకోండి సర్!”

ఇలా ఉంటాయి వీడియో వార్తలు. ఈ ఫేక్ న్యూస్  చాలా విపరీతాలకు దారి తీస్తుంది ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు ఇటువంటి వీడియోలు చాలా వరకు ఉంటాయి. ఎవరైనా ఒక వినబడని వీడియోను  టెక్స్ట్ ట్వీకింగ్ ఇచ్చి దానికి అనుగుణంగా ఉపయోగించవచ్చు.

ఈ వారాంతం బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు! ఎంతవరకు నిజం?

ఈ వారాంతం బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు ఉండవచ్చు అని ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఇది ఎంత వరకు నిజం? శనివారము మొదటి శనివారం కాబట్టి బ్యాంకులకు హాలిడే ఉంటుంది. ఆ తర్వాత ఆదివారం కూడా హాలిడే.

సోమవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి సెలవు దినము. తరువాత రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగుల రెండు రోజుల బ్యాంక్ సమ్మె సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 5 దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలను స్తంభింపచేయడానికి అవకాశం ఉంది.

రిజర్వు బ్యాంకు ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ యునైటెడ్ ఫోరమ్గ్ సమ్మె చేస్తున్నారు కాబట్టి సెప్టెంబర్ 4 మరియు 5 తేదీలలో ఆర్బిఐ ఉద్యోగులు రెండు రోజుల సామూహిక సెలవులకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ సమ్మె దేశవ్యాప్తంగా కేంద్ర, ఇతర రాష్ట్ర బ్యాంకుల బ్యాంకింగ్ కార్యకలాపాలు మొత్తంగా కార్యకలాపాలు మొత్తంగా ఆగిపోయే అవకాశం ఉంది.

కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ఆర్బీఐ ఉద్యోగుల సమ్మె వలన మిగిలిన బ్యాంకులకు అంతగా మూసి వేయాల్సిన అవసరం ఉండదు. సామాన్య బ్యాంకింగ్ ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉంది. ఎటిఎమ్ లావాదేవీలు, శాఖలలో డిపాజిట్, FD పునరుద్ధరణ, ప్రభుత్వ ట్రెజరీ ఆపరేషన్, మనీ మార్కెట్ ఆపరేషన్ వంటివి 5 రోజులు హిట్ కానున్నాయి. కానీ ఆన్లైన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు.

ఎందుకైనా మంచిది బ్యాంకు పనులు ఏమైనా ఉంటే శుక్రవారము తప్పకుండా ముగించుకోవాలి.

దేశం విడిచిపెట్టడానికి ముందు మాల్యా ఎవరిని కలిశారు?

ఎన్ఆర్ఐ విజయమాల్య భారతదేశం విడిచిపెట్టేముందు బిజెపి నాయకులను కలుసుకున్నారు అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లండన్లోని ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ఈమధ్య చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం విజయ్ మాల్యా వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు చేస్తున్న మోసాన్ని గుర్తించడానికి బదులు వారిని నిర్విఘ్నంగా భారతదేశం వదిలిపెట్టడానికి సహాయం చేస్తుందని ఆయన ఆరోపించారు. విజయ్ మాల్యా రూ. 9,000 కోట్ల రుణాలు బాకీ పడి బ్యాంకుల నుంచి తప్పించుకొని 2016 మార్చిలో భారత్ నుంచి బయటపడి, ప్రస్తుతం UKలో నివసిస్తున్నారు.

“మాల్య భారత్ను విడిచిపెట్టడానికి ముందు, ఆయన బిజెపి సీనియర్ నాయకులను కలుసుకున్నారు, వాటిని నేను బహిర్గతం చేయను,” అని రాహుల్ గాంధీ చెప్పారు. ఈ ఆరోపణకు బిజెపి ఇంకా స్పందించలేదు.

Twisted Facts?

భారత సిబిఐ అధికారులు విజయ మాల్యాను తిరిగి భారత్ తీసుకొని రావాలని అనేక ప్రయత్నాలు చేస్తస్తున్నారు, కానీ లండన్ కోర్టులో విజయ్ మాల్యా వేసిన పిటిషన్ ప్రకారము ఇండియా లో ఉన్నటువంటి జైలు అతని ఆరోగ్యానికి అనుకూలంగా లేవని విచారిస్తున్నారు. దీనికి సి.బి.ఐ ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో నంబర్ 12 వీడియోలు తీసి కోర్టులో దాఖలు చేశారు. ఈ వీడియో ఒక టెలివిజన్, వ్యక్తిగత టాయిలెట్, పరుపు మరియు సూర్యకాంతి పుష్కలంగా అందుబాటులోఉంటుందని చూపిస్తుంది. కేసు సెప్టెంబర్ 12 న కోర్టులో విచారణకు వస్తుంది.

దీన్ని గురించి వ్యాఖ్యానిస్తూ, భారత జైళ్లలో “కష్టమైన స్థలాలు” ఉన్నాయని, కానీ విజయ్ మాల్య వంటి పారిపోయిన వారిని భిన్నంగా చూడరాదని రాహుల్ గాంధీ అన్నారు.

Vijay Mallya

“భారతీయ జైళ్లలో చాలామంది మర్యాదగా ఉన్నారు, మాల్య ఆందోళన చెందుతున్నారు, భారతీయులకు న్యాయం జరగాలి,” అని ఆయన చెప్పారు. పారిపోయిన వారిని భిన్నంగా చూడరాదని, ఇలా చేయటం మిగిలినవారిలో వ్యతిరేకతను పెంపొందిస్తుందని ఆయన అన్నారు.

మోడీ ప్రభుత్వం భారత బ్యాంకుల మోసం చేసిన విజయ్ మాల్యా, ఫ్యుజిటివ్ జ్యుయర్స్ నిరావ్ మోడీ, మెహ్జల్ చోక్సి వంటి వ్యక్తులకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇది natural justice వ్యతిరేకమని కూడా ఆయన పేర్కొన్నారు.

Congress man?

కానీ విజయమాల్య మొదట్లో కాంగ్రెస్ పార్టీలో చాలామంది మిత్రులతో కలిసి రాజ్యసభ మెంబర్ గా చాలా సంవత్సరాలు ఉండినారు. అంతేకాకుండా విజయ్ మాల్యా పూర్వికులు కాంగ్రెస్ పార్టీలో అత్యంత ఉన్నతస్థాయిలో సంబంధాలు పెట్టుకున్నారు. ఇది రాహుల్ గాంధీ మర్చిపోయారా?

ముఖ్యంగా విజయ్ మాల్యా కేసు భారత ప్రభుత్వానికి ఒక గుణపాఠం లాంటి లాంటిది. సరైన రూల్స్ లేనిచో ఎటువంటి వారైనా ఇండియా వదిలి పోయే మార్గాలున్నాయి కాబట్టి అన్ని పార్టీలు దీనికి సంబంధించిన శాసనాలు రూపొందించడానికి ఇదే కరెక్ట్ సమయం.

ఇకపోతే విజయ మాల్యాను తీసుకురావడానికి సీబీఐ చేస్తున్న ప్రయత్నాలు నిర్విఘ్నంగా కొనసాగాలి, లేనిచో ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ వచ్చినా ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ పార్టీ అయినా విజయమాల్య కేసు ఉమ్మడిగా సమీక్షించాలి కానీ పొలిటికల్ గా మార్చకూడదు.

UAE నుంచి కేరళ పునరావాస సహాయం? వివాదానికి దారి తీసిన నకిలీ వార్తలు

Prime Minister Narendra Modi conducting an aerial survey of flood affected areas, in Kerala on August 18, 2018. (PIB)

విదేశీ సహాయాన్ని స్వీకరించడం గురించి మోడీ ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైయ్యింది. UAE ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు సహాయంగా ఇవ్వడానికి తయారుగా ఉన్నదని, కానీ మోడీ ప్రభుత్వం దాన్ని తిరస్కరించిందంటూ వార్తలు వెలువడ్డాయి.

భారతీయ జనతా పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నాయకులలో కేంద్ర, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రులు ఈ వివాదం లో ఉన్నారు. ఆశ్చర్యకరంగా, మాజీ విదేశాంగ కార్యకర్తలు కూడా అలాగే అభిప్రాయపడ్డారు.

2016 మే లో ప్రభుత్వం తన 200 పేజీల జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక పత్రాన్ని ఆవిష్కరించింది. విదేశాల్లో సహాయం కోసం భారతదేశం సంసిద్ధంగా ఉండకపోయినా, దేశం సహాయ ఆఫర్లను స్వీకరిస్తుందని ఈ విధాన పత్రం స్పష్టంగా చెబుతోంది. ముఖ్యంగా ఆగస్టు 22 న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కేరళ వరద సాయాన్ని హర్షించింది.

కాని ఒక జాతీయ న్యూస్ పేపర్లో వాసు అనే రిపోర్టర్ స్వంత విశ్లేషణతో UAE గవర్నమెంట్ నుండి వచ్ఛే సహాయాన్ని తిరస్కరించిందంటూ రాసాడు. నిజానికి, ఒక ఎమిరేట్స్ ఎయిర్ కార్గో ఫ్లైట్ తిరువనంతపురం వచ్చింది, యుఎఇ ప్రభుత్వ సంస్థలు, మానవతా సంస్థలు, నివాసితులు మరియు వ్యాపారాల ద్వారా విరాళంగా అందించబడిన కేరళకు 175 టన్నుల వస్తువులని తెచ్చింది. ఇంకా 13 విమానాలు సహాయాన్ని తీసుకొని రావచ్చని అంచనా వేస్తున్నారు.

ఇంతలో, జాతీయ మీడియా మోడీ ప్రభుత్వం UAE క్రౌన్ ప్రిన్స్ ఆఫర్ను తిరస్కరించిందని చెప్పినట్లుగా నకిలీ వార్తలను వెల్లడించడం ద్వారా కొత్త వివాదం ప్రారంభించింది. దీనికి తోడు మోడీ ట్వీట్ ను కూడా ఉపయోగించారు:

A big thanks to @hhshkmohd for his gracious offer to support people of Kerala during this difficult time. His concern reflects the special ties between governments and people of India and UAE.

— Narendra Modi (@narendramodi) August 18, 2018

మోడీ ట్వీట్ లో ఎక్కడా UAE ప్రభుత్వ సహాయాన్నితిరస్కరించడానికి ఉద్దేశించిన అంశం లేదు. వివాదం భారతదేశం విదేశీ సాయాన్ని ఎందుకు స్వీకరించకూడదు అని సమర్థించటానికి వెళ్ళింది. ప్రస్తుత ప్రభుత్వం హఠాత్తుగా ఆ విధానాన్ని తిరస్కరించడం మరియు విదేశీ సాయాన్ని అంగీకరించడం వంటి పరిణామాలను అంచనా వేయడం వరకు వెళ్లింది. తర్వాత, అనవసరమైన దౌత్యపరమైన వివాదానికి ఇది దారి తీయడంతో రెండు ప్రభుత్వాలు క్లారిఫికేషన్ ఇచ్చాయి.

దురదృష్టవశాత్తూ, న్యూయార్క్ టైమ్స్, ఫాక్స్ న్యూస్, డ్యుయిష్ వెల్లే వంటి విదేశీ మీడియా సంస్థలు ఈ కథను నమ్మి దాన్ని గురించి విశ్లేషంగా రాయడం జరిగింది. నిజానికి, కేరళ నాయకత్వం లేదా మోడీ ప్రభుత్వం ఎవరికీ సమస్య లేదు అని మాజీ రాయబారి MK భద్రాకుమార్  అభిప్రాయ పడ్డారు.

కేరళ ముఖ్యమంత్రి పినారాయ్ విజయన్ కేంద్రాన్నించి వచ్చిన సాయం పై తన కృతజ్ఞతను బహిరంగంగా వ్యక్తపరిచారు. రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు వివాదాస్పదాలను రేకెత్తించ వద్దని ప్రతి ఒక్కరికి సలహా కూడా ఇచ్చారు. నరేంద్ర మోడీ కూడా తన ట్వీట్లో కేరళకు తన వ్యక్తిగత వేదనను, అవగాహనను నొక్కిచెప్పారు.