వాదన/Claim: భారతీయ రైల్వే కొత్త నియమం ప్రకారం IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జైలు లేదా రూ.10,000 జరిమానా విధించబడుతుందనేది వాదన.

నిర్ధారణ/Conclusion:ఈ వాదన/దావా తప్పు.రైల్వే మంత్రిత్వ శాఖ అలాంటి కొత్త రూల్ ఏదీ చేయలేదు. IRCTC కూడా “వేర్వేరు ఇంటిపేర్లతో (లేదా ఇతరుల కోసం) ఇ-టికెట్ల బుకింగ్ గురించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలు” తప్పు మరియు తప్పుదారి పట్టించేవి అని స్పష్టం చేసింది.

రేటింగ్: పూర్తిగా తప్పు

********************************************************************

వాస్తవ పరిశీలన వివరాలు:

భారతీయ రైల్వే కొత్త నియమం ప్రకారం ఒక వ్యక్తి తన స్నేహితులకు లేదా బంధువుల కోసం IRCTC వెబ్‌సైట్‌లో తన వ్యక్తిగత IDని(లేదా వివిధ ఇంటి పేర్లని ) ఉపయోగించి రైలు ఇ-టికెట్లును బుక్ చేయకూడదనే ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎవరైనా అలా చేస్తే, జైలు శిక్ష విధించబడుతుందని వాదన పేర్కొంది.

దిగువ పోస్ట్ చూడండి:

ఇతరులకు టిక్కెట్లు బుక్ చేస్తే జైలు లేదా రూ.10,000 జరిమానా విధించబడుతుందని మరొక వాదన పేర్కొంది. దిగువ పోస్ట్ చూడండి:

అసలు వాస్తవం ఏమిటి

ఈ వాదనలు భారతీయ రైల్వే శాఖకు సంబంధించినవి మరియు భారతదేశంలోని అన్ని తరగతుల ప్రజలచే అత్యధికంగా ఉపయోగించే రవాణా విధానం అయినందున Digiteye India బృందం ఈ వాదనలలోని వాస్తవాన్ని పరిశీలించడానికి ప్రయత్నించింది.  మేము మొదట Xలో భారతీయ రైల్వే శాఖ అధికారిక హ్యాండిల్‌ను పరిశీలించగా, IRCTC అప్పటికే ఈ వాదన నకిలీదని స్పష్టం చేసిందని మరియు సరైన సమాచారం, మార్గదర్శకాలను కుడా అందించిందని గమనించాము. IRCTC అధికారిక హ్యాండిల్ యొక్క పోస్ట్ దిగువన చూడండి:

రైల్వే మంత్రిత్వ శాఖ కూడా స్పష్టం చేసింది:

కాబట్టి ఈ వాదన/దావా తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కథనాలు :

సైనికుల (అగ్నివీర్స్) రిక్రూట్ కోసం అగ్నిపథ్ పథకం కొన్ని మార్పులతో మళ్లీ ప్రారంభించబడిందా? వాస్తవ పరిశీలన-వీడియో

అనేక దేశాలు భారతదేశం నుండి పండ్లు మరియు కూరగాయల దిగుమతులను నిషేధించాయా? వాస్తవ పరిశీలన

10 thoughts on “IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జరిమానా విధించబడుతుందా? వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version