Tag Archives: telugu fake news

రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తకు కుక్క బిస్కెట్ ఇచ్చారా?; వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ కుక్క నిరాకరించిన బిస్కెట్ ను కాంగ్రెస్ కార్యకర్తకు ఇచ్చారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు వాదన. కుక్కకు ఆహారం ఇవ్వడానికి రాహుల్ గాంధీ ఆ బిస్కెట్‌ను కుక్క యజమానికి ఇచ్చారు.
అంతేకాని, ఆ కుక్క యజమాని కాంగ్రెస్ కార్యకర్త లేదా ఏ రాజకీయ పార్టీకి మద్దతుదారుడు కాదు.

రేటింగ్ :పూర్తిగా తప్పు

వాస్తవ పరిశీలన వివరాలు:

కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర నేపథ్యంలో,కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మళ్లీ ప్రతికూల కథనంకు టార్గెట్ అయ్యారు,ఈసారి కుక్కల పట్ల ఆయనకున్న ప్రేమ వలన. యాత్రలో కుక్కతో ఆడుకుంటూ బిస్కెట్ తినిపించడానికి ప్రయత్నించగా, కుక్క బిస్కట్ తీసుకోకపోవడంతో పక్కనే ఉన్న వ్యక్తికి బిస్కెట్ అందిస్తూ కనిపించారు.

అయితే, వీడియోను ఉటంకిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన కొన్ని వాదనలతో సహా అనేక వాదనలు ఆన్‌లైన్‌లో కనిపించాయి, విమర్శలకు దారి తీశాయి.కుక్క నిరాకరించిన బిస్కెట్‌ను పక్కనే నిలబడి ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తకు రాహుల్‌ అందించారని వీడియోతో కూడిన వాదన/దావా పేర్కొంది. ఈ ట్వీట్లను క్రింద చూడవచ్చు:

వీడియోను క్యాప్షన్‌తో షేర్ చేశారు: “అందుకే ఆత్మగౌరవం ఉన్నవారు ఎవరూ కాంగ్రెస్‌లో ఉండలేరు.ఆ రోజు హిమంత శర్మ చెప్పింది ఈ రోజు నిరూపితమైంది.రాహుల్ ముందుగా కుక్కకు బిస్కెట్ అందించారు. కుక్క నిరాకరించినప్పుడు అదే బిస్కెట్‌ను కాంగ్రెస్ కార్యకర్త (కార్మికుడు)కి ఇచ్చాడు.”

 

ఇదే వ్యాఖ్యను బీజేపీ అధికార ప్రతినిధి షెజాద్ పూనావాలా మరో వ్యాఖ్యతో షేర్ చేసుకున్నారు:”కాంగ్రెస్ కార్యకర్తలకు “న్యాయం” జరగదా? కుక్క నిరాకరించిన బిస్కెట్లను రాహుల్ గాంధీ కార్యకర్తలకు తినిపించారు! ఉన్నత వర్గం యొక్క ఆలోచనా విధానం.”

FACT CHECK

మేము ఒరిజినల్ వీడియో మొత్తం పరిశీలించగా,క్లెయిమ్ చేసినట్లు రాహుల్ గాంధీ బిస్కెట్‌ను కాంగ్రెస్ కార్యకర్తకు కాకుండా కుక్క యజమానికి ఇవ్వడాన్ని గమనించాము, చివరికి కుక్క యజమాని తన చేతితో దానికి తినిపించాడు.ఇదే విషయాన్ని వివరిస్తూ, రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కుక్క బాధను గమనించి, కుక్కకి తినిపించడానికి, బిస్కెట్ను దాని యజమానికే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “నేను కుక్కను మరియు దాని యజమానిని పిలిచాను. కుక్క భయపడి, వణుకుతోంది,  నేను దానిని తినిపించడానికి ప్రయత్నించినప్పుడు, కుక్క భయపడింది. కాబట్టి నేను కుక్క యజమానికి బిస్కెట్లు ఇచ్చాను, కుక్క అతని చేతిలో నుండి వాటిని తినేసింది”.

రాహుల్ గాంధీ స్వయంగా కుక్కను పెంచుకుంటున్నారు మరియు కుక్కల మనస్తత్వం గురించి అవగాహన ఉంది.కుక్క యజమాని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పిన కథనానికి మద్దతునిచ్చాడు మరియు అతను కాంగ్రెస్ కార్యకర్త లేదా ఏ రాజకీయ పార్టీకి మద్దతుదారుని కాదని స్పష్టం చేశారు.

ధన్‌బాద్‌లో నివాసముంటున్న జితేంద్ర కుమార్ అనే కుక్క యజమాని తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ తన కుక్కను నిమురుతూ,దానికి బిస్కెట్ ఇచ్చారని తెలిపారు.”నా కుక్క, లూసీ, ఒక ఆడ పోమెరేనియన్, కారుపై ఉండడం వలన భయపడి తినడానికి నిరాకరించింది.” కుక్క భయాందోళనలను అర్థం చేసుకున్న రాహుల్ గాంధీ, దానికి ఆహారం ఇవ్వమని నన్ను కోరారని ఆయన తెలిపారు.

తాను కాంగ్రెస్ కార్యకర్తనన్న బీజేపీ నేతల వాదనను కుక్క యజమాని కూడా తోసిపుచ్చారు.

అందువలన, వైరల్ వీడియోతో పాటు వచ్చిన వాదన/దావా, రాహుల్ గాంధీపై ప్రతికూల కథనంతో తప్పుగా చూపించే ప్రయత్నం జరిగింది.

మరి కొన్ని Fact Checks:

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 25,000 హోమ గుండాలను ఏర్పాటు చేశారా? వాస్తవ పరిశీలన

రాహుల్ గాంధీ యొక్క ‘భారత్ మాత’ ప్రసంగాన్ని అసందర్భంగా ట్వీట్ చేశారు; వాస్తవ పరిశీలన

 

 

 

బీజేపీ గుర్తు(కమలం)తో కూడిన టీ-షర్ట్ ను రాహుల్ గాంధీ ధరించారని తప్పుడు చిత్రం షేర్ చేయబడుతోంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim: రాహుల్ గాంధీ బీజేపీ చిహ్నం ఉన్న టీ-షర్ట్ ధరించిన చిత్రం, ఆయన బీజేపీ ఏజెంట్ అనే వాదనతో షేర్ చేయబడింది

నిర్ధారణ/Conclusion: వాదన తప్పు.రాహుల్ గాంధీ ధరించిన టీ-షర్ట్‌పై బీజేపీ గుర్తును మార్ఫింగ్ చేసి,ఆయన బీజేపీ ఏజెంట్ అని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో షేర్ చేయబడింది.

రేటింగ్: తప్పుదోవ వార్త —

వాస్తవ పరిశీలన వివరాలు:

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గుర్తు ఉన్న టీ షర్ట్ ధరించి ఉన్న ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ జనవరి 14, 2024న మణిపూర్‌లో ప్రారంభమైనప్పుడు ఈ వాదన చేయబడింది.హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది, “हमने तो पहले ही कहा था की यह राहुल गांधी बीजेपी का एजेंट है, आज हमने राहुल गांधी को रंगे हाथो पकड़ लिया है” [తెలుగు అనువాదం: “రాహుల్ గాంధీ బీజేపీ ఏజెంట్ అని ముందే చెప్పాము,ఈరోజు రాహుల్ గాంధీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం.”]

FACT CHECK

బీజేపీ గుర్తు ఉన్న టీ షర్టు ధరించిన రాహుల్ గాంధీ చిత్రం చాలా వింతగా కనిపిస్తుండడంతో ఒరిజినల్(అసలు) చిత్రం కోసం ప్రయత్నించాము.చివరగా, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌తో, ఒరిజినల్(అసలు) చిత్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాట్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసినట్లు మేము గమనించాము.

శ్రీనాట్ కాంగ్రెస్ సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు హెడ్ గా ఉన్నారు మరియు ఆమె జనవరి 14, 2024న హిందీలో ఒక శీర్షికతో చిత్రాన్ని షేర్ చేసుకున్నారు, “जब ईस्ट से वेस्ट की यात्रा की बात हुई थी – तो मैंने कहा कि यह यात्रा सिर्फ़ और सिर्फ़ मणिपुर से शुरू हो सकती है” [తెలుగు అనువాదం: మేము తూర్పు నుండి పడమరకు ప్రయాణించడం గురించి మాట్లాడినప్పుడు – ఈ యాత్ర మణిపూర్ నుండి మాత్రమే ప్రారంభించాలని నేను చెప్పాను]

రాహుల్ గాంధీ ధరించిన టీ-షర్ట్‌పై బీజేపీ గుర్తును మార్ఫింగ్ చేసి,ఆయన చిత్రం మార్చివేయబడింది.

కాబట్టి ఈ వాదన తప్పు.

 

మరి కొన్ని Fact Checks:

రాహుల్ గాంధీ యొక్క ‘భారత్ మాత’ ప్రసంగాన్ని అసందర్భంగా ట్వీట్ చేశారు; వాస్తవ పరిశీలన

రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను ప్రకటించారా? వాస్తవ పరిశీలన

 

 

భారతదేశంలో పోస్ట్ మాస్టర్ ఎంపిక ఈ విధంగా జరుగుతుందనే వాదనతో ఒక వీడియో వైరల్ అవుతోంది ; వాస్తవ పరిశీలన

ఒక వ్యక్తి లైఫ్ జాకెట్ ధరించి, సన్న, పొడవాటి చెక్క ప్లాంక్ వంతెన పై చాలా జాగ్రత్తగా సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నట్టు చూపించే వీడియో ఫేస్‌బుక్ రీల్స్‌లో వైరల్‌గా మారింది.వాదన/దావా ఇలా ఉంది: “భారతదేశంలో పోస్ట్‌మాస్టర్‌ను ఈ విధంగా ఎంపిక చేస్తారు.”

https://www.facebook.com/reel/1460175761597788

FACT CHECK

వాస్తవాన్ని పరిశీలించడం కోసం Digiteye India team వీడియో యొక్క కీలక ఫ్రేమ్‌లను తీసి వాటిని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో పరిశీలించగా,వాస్తవానికి నేపాల్‌లోని కపిల్వాస్తులో జరిగిన సైకిల్ బ్యాలెన్స్ అడ్వెంచర్ గేమ్‌లోని వీడియో అని వెల్లడించే ‘అసలు వీడియో లింక్‌ని’ మేము గమనించాము.ఛానెల్ సచిన్ భట్టారాయ్ ద్వారా అప్‌లోడ్ చేయబడింది, వీడియో వివరణలో ఇలా ఉంది:

“2nd CYCLE PLANK BALANCE:’సైకిల్ ప్లాంక్ బ్యాలెన్స్ పోటీ’ రెండవ ఎడిషన్ టైటిల్‌ను మానిక్ శ్రేష్ఠ గెలుచుకున్నారు.బంగాంగ మునిసిపాలిటీ 3లోని పర్యాటక ప్రదేశమైన రాజపాని వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ కపిల్వాస్తు నిర్వహించిన పోటీలో,అతను 52 మీటర్ల ట్రాక్‌ను దాటడానికి 1 నిమిషం 56 సెకన్లు లో పూర్తి చేసి టైటిల్‌ను గెలుచుకున్నాడు.ధరన్‌కు చెందిన అనిస్ తమంగ్ రెండో స్థానంలో నిలిచాడు. అతను నిర్దేశించిన దూరాన్ని 1 నిమిషం 25 సెకన్లలో అధిగమించాడు. అదేవిధంగా కపిల్వాస్తుకు చెందిన శుభం భట్టై మూడో స్థానంలో నిలిచారు. అతను 40.86 సెకన్లు సెకన్లు లో పూర్తి చేయగా, అరుణ్ ఆర్యల్ నాలుగో స్థానంలో నిలిచాడు.”

‘సైకిల్ ప్లాంక్ బ్యాలెన్స్ అడ్వెంచర్’ గేమ్ దిగువన చూపించినట్లు YouTubeలో విస్తృతంగా షేర్ చేయబడింది:

ఆ వీడియో ఇండియాది కాక నేపాల్‌కి చెందినది.అంతేకాకుండా భారతదేశంలో పోస్టల్ సిబ్బంది ఎంపికకి మార్కులు,మరియు ఎంపిక పరీక్షలో మెరిట్ ఆధారంగా ఉంటుంది. కాబట్టి, వాదన/దావా తప్పు.

వాదన/Claim:వీడియోలో చెక్క ప్లాంక్ వంతెన పైన చాలా జాగ్రత్తగా సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని చూపిస్తూ, భారతదేశంలో పోస్ట్‌మాస్టర్‌ను ఈ విధంగా ఎంపిక చేస్తారనేది వాదన.

నిర్ధారణ/Conclusion:తప్పు వాదన. భారతదేశంలో పోస్ట్ మాస్టర్ కోసం అలాంటి ఎంపిక విధానం ఏది లేదు మరియు అది నేపాల్‌లోని కపిల్వాస్తులో జరిగిన పోటీ యొక్క వీడియో.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

మరి కొన్ని Fact Checks:

భారతదేశంలో ఇప్పుడు కొత్త రైలు ట్రాక్ యంత్రాలు ఉపయోగించబడుతున్నాయని వైరల్ వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

2017లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాకముందు ఉత్తర ప్రదేశ్ లో కేవలం 2 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయా? వాస్తవ పరిశీలన

న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని స్వీకరించారని వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim:న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారనే వాదనతో వీడియో షేర్ చేయబడింది.

నిర్ధారణ/Conclusion:తప్పు.న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న వీడియో కాదు.అది బ్రెంట్ గోబుల్ అనే అమెరికన్ యోగా టీచర్ రోజువారీ ప్రార్థనలో ఉన్న వీడియో.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు

వీడియోలో చేతులు జోడించి హిందూ ఆచారాలను నిర్వహిస్తున్న విదేశీయుడు న్యూజిలాండ్ హోం మంత్రి అని మరియు ఆయన సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారనే వాదన X (గతంలో ట్విట్టర్)లో వైరల్ అవుతోంది.

The video had garnered over two lakh views already and can be seen here and here.

FACT CHECK

న్యూజిలాండ్‌కు సంబంధించిన హోం మంత్రి వివరాల కోసం Digiteye India బృందం పరిశీలించగా,అలాంటి మంత్రిత్వ శాఖ లేదా దానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తిలు దొరకలేదు కానీ,ప్రతుస్తం బ్రూక్ వాన్ వెల్డెన్ న్యూజిలాండ్‌ అంతర్గత వ్యవహారాలు & వర్క్‌ప్లేస్ రిలేషన్స్ అండ్ సేఫ్టీ మంత్రిగా పని చేస్తున్నట్టు గమనించాము.
మరియు, వీడియో నుండి కొన్ని కీలక ఫ్రేమ్‌లను తీసుకొని వాటిని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో పరిశీలించగా వీడియోలో ఉన్న వ్యక్తి బ్రెంట్ గోబుల్ అనే అమెరికన్ యోగా టీచర్ అని ఫలితాలు వెల్లడయ్యాయి.

సోషల్ మీడియా హ్యాండిల్ ప్రకారం, బ్రెంట్ గ్లోబ్ ప్రస్తుతం గోవాలోని అంజునాలో నివసిస్తూ, అన్ని వయసుల వారికి యోగా నేర్పిస్తున్నారు.అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పరిశీలించినప్పుడు, అతను నవంబర్ 2, 2023న పోస్ట్ చేసిన ఒరిజినల్ వీడియోను గమనించాము.
వీడియో కాప్షన్ ఈ విధంగా ఉంది, “గత రాత్రి అలెక్స్ నామకరణ కార్యక్రమం జరిగింది. హిందూ మతం నా పెంపకంలో భాగం కానప్పటికీ, నా భార్య మరియు అత్తమామలకు ముఖ్యమైన ఆచారాలలో పాల్గొనడం నాకు చాలా ఇష్టం. నా కొడుకుకు అందమైన జీవితం ఉండాలని,అవసరమైన సవాళ్లును ఎదురుకుంటూ పోరాడాలని,మనస్ఫూర్తిగా ప్రేమించాలని కోరుకుంటున్నాను”.

 

యోగా టీచర్ వీడియో న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నట్లుగాషేర్ అవుతోంది.

మరి కొన్ని Fact Checks:

జో బిడెన్, రిషి సునక్, జస్టిన్ ట్రూడో రామమందిర కార్యక్రమానికి హాజరయ్యారని ఒక వీడియో ద్వార దావా చేయబడింది; వాస్తవ పరిశీలన

నేపాలీ హిందువులు బహుమతులతో అయోధ్యకు చేరుకున్నట్లుగా షేర్ చేయబడిన వీడియో; వాస్తవ పరిశీలన

 

 

భారతదేశంలో ఇప్పుడు కొత్త రైలు ట్రాక్ యంత్రాలు ఉపయోగించబడుతున్నాయని వైరల్ వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim:రైల్వే ట్రాక్ లేయింగ్ మెషీన్ వీడియోని పోస్ట్ చేస్తూ గత అరవై ఏళ్లతో పోల్చితే ఇప్పుడు భారతదేశ సాంకేతికత చాలా మెరుగ్గా ఉందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు.
భారతదేశం అధునాతన సాంకేతికతతో కొత్త రైల్వేలను ఎలా నిర్మిస్తుందో చూపించే వైరల్ వీడియో మలేషియాలో ‘చైనా కమ్యూనికేషన్స్ కన్స్ట్రక్షన్’ వాళ్ళు రైల్వే లైన్‌ను నిర్మిస్తున్న వీడియో.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీల వివరాలు

ట్యాంపింగ్ మెషిన్ కదులుతూ రైల్వే స్లీపర్‌లను నేలపై ఉంచుతున్న వీడియో ఒకటి ఈ విధమైన వాదన/ దావాతో సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది,, “ये हैं आज के भारत की टेक्नोलॉजी। जिसे विगत 60 वर्षों में सरकार लांच नहीं कर सकी क्योंकि भारत की जनता के टैक्स का पैसा स्विस बैंक में जमा किया जा रहा था। जय श्रीराम”  [తెలుగు అనువాదం ఇలా ఉంది: ఇది ఇప్పటి భారతదేశ సాంకేతిక నైపుణ్యం. ఇది గత 60 సంవత్సరాలుగా ప్రభుత్వం చేత ప్రారంభించబడలేదు ఎందుకంటే ఆ సమయంలో పన్ను చెల్లింపుదారుల డబ్బు మొత్తం మళ్లించి స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేయబడింది]

ఇది Twitter (X)లో ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడుతోంది. ‘చైనా కమ్యూనికేషన్స్ కన్‌స్ట్రక్షన్’యొక్క యంత్రాలు రైలు మార్గాన్ని వేస్తున్న దృశ్యాలు వీడియో లో చూడవచ్చు.

 

FACT CHECK

ఇలాంటి యంత్రాలు గురించి ఎవరు కూడా కవర్ చేయనందున Digiteye India  బృందం వారు దీని వాస్తవ పరిశీలనకు పూనుకుంది.
వీడియోలోని కీఫ్రేమ్‌లను ఉపయోగించి, బృందం Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో పరిశీలన చేయగా, మలేషియాకు సంబంధించిన వీడియో గత సంవత్సరం డిసెంబర్ 12, 2023న పోస్ట్ చేసిన కథనానికి దారితీశాయి.

మలేషియాలోని క్వాంటన్ నగరంలో జరుగుతున్న ఈస్ట్ కోస్ట్ రైల్ లింక్ రోడ్డు పనుల గురించి ‘న్యూస్.సీఎన్’ వెబ్‌సైట్‌లో ప్రచురించారు. దీనిని ‘చైనా కమ్యూనికేషన్స్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ’ నిర్మిస్తోంది.గూగుల్ న్యూస్‌లో క్షుణ్ణంగా పరిశీలించగా అసలు వీడియో చైనా ప్రెస్ తన ఫేస్‌బుక్ పేజీలో అప్‌లోడ్ చేసిందని తేలింది.క్వాంటన్‌లోని రైల్వే లైన్ ను చైనా-మలేషియా జాయింట్ ప్రాజెక్ట్‌లో భాగమని వివరాలు తెలియజేస్తున్నాయి. కావున ఈ వాదన తప్పు.

మరి కొన్ని Fact checks:

జో బిడెన్, రిషి సునక్, జస్టిన్ ట్రూడో రామమందిర కార్యక్రమానికి హాజరయ్యారని ఒక వీడియో ద్వార దావా చేయబడింది; వాస్తవ పరిశీల

ఎత్తైన రైల్వే వంతెనపై వెలుతున్న రైలు వీడియో భారతదేశంలోనిది కాదు, చైనా దేశంలోని వీడియో: Fact Check

 

 

 

2017లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాకముందు ఉత్తర ప్రదేశ్ లో కేవలం 2 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: బ్రిటీష్ కాలం నుండి 2017 వరకు యుపిలో కేవలం రెండు విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని,ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ హయాంలో 24 ఉన్నాయనేది వాదన.

నిర్ధారణ/Conclusion: విమానయాన మంత్రి ప్రకటన ప్రకారం, 2017కి ముందు, ఉత్తరప్రదేశ్‌లో 6 విమానాశ్రయాలు రికార్డులో ఉన్నాయి మరియు ప్రస్తుతం 10 విమానాశ్రయాలు వినియోగంలో ఉండగా మరొక 14 నిర్మాణంలో ఉన్నాయి.

రేటింగ్:తప్పు దారి పట్టించే వార్త —

వాస్తవ పరిశీలన వివరాలు

2017లో యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని సోషల్ మీడియాలో వైరల్ వీడియో ఒకటి షేర్ చేయబడింది.ప్రస్తుత యుపి ప్రభుత్వ హయాంలో 24 విమానాశ్రయాలను ప్రకటించారని, వాటిలో 10 పని చేస్తున్నాయని, మరొక 14 నిర్మాణంలో ఉన్నాయని పేర్కొంది.

ట్విట్టర్‌లో వీడియో ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

బ్రిటీష్ పాలన నుండి 2017 మార్చిలో అఖిలేష్ యాదవ్ పాలన ముగిసేనాటికి ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు విమానాశ్రయాలు మాత్రమే పనిచేస్తున్నాయని వీడియో క్లిప్ లోని వార్త పేర్కొంది.నేడు యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత, 24 విమానాశ్రయాలు ఉన్నాయి, వాటిలో 10 పనిచేస్తున్నాయి,మరొక 14 నిర్మాణంలో ఉన్నాయి.బ్రిటీష్‌వారు మరియు 2017కి ముందు వరకు ఉన్న అన్ని ప్రభుత్వాలు కేవలం రెండు విమానాశ్రయాలను మాత్రమే నిర్మించగలిగారు.

వాస్తవ పరిశీలన

Digiteye India teamవారు వాస్తవాన్ని పరిశీలించడం కోసం ఉత్తరప్రదేశ్‌లోని విమానాశ్రయాలను గురించి Googleలో సెర్చ్ నిర్వహించగా,జనవరి 11, 2024న విమానయాన మంత్రి జ్యోతిరాదియా సింధియా UP విమానాశ్రయాలపై పోస్ట్ చేసిన తాజా PIB పత్రికా ప్రకటనకు దారితీసింది.ఇక్కడ 2014లో ఉత్తరప్రదేశ్‌లో 6 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని,ప్రస్తుతం అయోధ్యలో కొత్తగా ప్రారంభించిన విమానాశ్రయంతో సహా 10 విమానాశ్రయాలు ఉన్నాయని మంత్రి చెప్పారని పేర్కొన్నారు.

ఈ వార్త ANI యొక్క వీడియో వార్తలలో కూడా ప్రసారం చేయబడింది.“2014లో ఉత్తరప్రదేశ్‌లో కేవలం 6 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు రాష్ట్రంలో అయోధ్య విమానాశ్రయంతో సహా 10 విమానాశ్రయాలు ఉన్నాయని” మంత్రి ప్రకటించడం వీడియోలో మనం చూడవచ్చు.వచ్చే ఏడాది నాటికి యూపీలో మరో ఐదు విమానాశ్రయాలు రానున్నాయి. అజంగఢ్, అలీగఢ్, మొరాదాబాద్, శ్రావస్తి, చిత్రకూట్‌లలో ఒకొక్క విమానాశ్రయాన్ని వచ్చే నెలలో ప్రారంభించనున్నారు.ఈ ఏడాది చివరి నాటికి జెవార్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఉండే విమానాశ్రయం కూడా సిద్ధం అవుతుంది.

కావున,యోగి ఆదిత్యనాథ్ కంటే ముందు యూపీలో కేవలం రెండు విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయన్న వాదన తప్పు. లక్నో మరియు వారణాసి విమానాశ్రయాలు నిరంతరం వినియోగంలో ఉండగా, 2014 నాటికి మాత్రం UPలో ఆరు విమానాశ్రయాలు రికార్డులో ఉన్నాయి మరియు బ్రిటిష్ పాలన నుండి రాష్ట్రంలో కేవలం 2 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయనే వాదన కూడా తప్పు.

మరి కొన్ని Fact Checks:

ప్రస్తుతం పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల కారణంగా AP, తెలంగాణలలో పాఠశాలలు మూసివేయబడ్డాయా? వాస్తవ పరిశీలన

విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తుందా? గతంలోని వాదన మళ్లీ షేర్ చేయబడుతోంది; వాస్తవ పరిశీలన

ప్రస్తుతం పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల కారణంగా AP, తెలంగాణలలో పాఠశాలలు మూసివేయబడ్డాయా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి.

నిర్ధారణ/Conclusion: ప్రస్తుత కోవిడ్-19 కేసులకు సంబంధించి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించలేదు. మార్చి 2020లోని పాత వీడియో ఇప్పుడు షేర్ చేయబడుతోంది.

రేటింగ్: తప్పు దారి పట్టించే వార్త–

Fact Check వివరాలు:

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో JN.1 వేరియంట్‌కి సంబంధించిన కొత్త కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది.

ఇదే విషయాన్ని తెలియజేసే ‘టీవీ9 వార్తా కథనం’ కూడా సందేశంలో జత చేసి ఉంది. వార్తా కథనంలో స్పష్టంగా కనబడుతుంది: “తెలంగాణ సెలవులు 28/12/23 నుండి 18/01/24 వరకు.” ఈ వీడియో వాస్తవాన్ని పరిశీలన చేయమని Digiteye India వాట్సాప్‌లో అభ్యర్థన అందుకుంది.

 

FACT CHECK

వాదన/క్లెయిమ్ లోని వాస్తవాన్ని పరిశీలించగా, ఇది అప్పటికే ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయబడిందని గమనించాము.షేర్ చేయబడుతున్న వీడియో తాజా వీడియోగా కనిపించేలా వీడియోపై కొన్ని తేదీలు సూపర్మోస్(superimposed) చేయబడ్డాయి. కానీ డిసెంబర్ 2023 నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో JN.1 కరోనా వేరియంట్ కేసులు నమోదైన తర్వాత TV9 వార్తా ఛానల్ మాత్రం ఇటీవలి కాలంలో ఇలాంటి వార్తలను ప్రసారం చేయలేదు.

TV9 న్యూస్ ఆర్కైవ్‌లను మరింత పరిశీలించగా,ఇది భారతదేశంలో కరోనా వ్యాప్తి చెందడం మరియు మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించబడిన సమయంలో అనగా 2020 మార్చి 18న ప్రచురించబడిన వార్తా నివేదిక.

తెలుగు వార్తాకథనం ఇలా పేర్కొంది: ““ఏపీ కీలక నిర్ణయం.. విద్యాసంస్థలు బంద్”

JN.1 వేరియంట్ కరోనావైరస్ లేదా కోవిడ్-19 కారణంగా ఇటీవలి రోజుల్లో AP మరియు తెలంగాణలో పాఠశాలలు మూసివేయబడుతున్నాయా అని ఇతర వార్తా నివేదికలను పరిశీలించినప్పుడు, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి ప్రకటన ఏది కూడా చేయలేదని తెలుసుకున్నాము.ఈ వార్త ఏ టీవీ న్యూస్ ఛానెల్ లేదా TV9 తెలుగు లేదా స్థానిక వార్తాపత్రిక  కూడా నివేదింలేదు.

ప్రస్తుతం, దేశంలో కోవిడ్ -19 కేసుల పెరుగుదల చాలా తక్కువగా ఉంది మరియు అటువంటి కేసులపై అప్రమత్తంగా ఉండాలని,కేసుల సంఖ్య పెరిగితే ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని కేంద్రం , రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది.దీని ప్రకారం, కోవిడ్ -19 కేసుల పెరుగుదల దృష్ట్యా ఆసుపత్రులను అప్రమత్తం చేస్తూ AP మరియు తెలంగాణ ప్రభుత్వాలు అనేక సూచనలను జారీ చేశాయి.

అందువలన, కోవిడ్ -19 కేసుల పెరుగుదల కారణంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయన్న వాదన తప్పు, మరియు ఈ వాదన/దావాకు మద్దతుగా  2020 పాతలోని వీడియో షేర్ చేయబడుతోంది.

 

మరి కొన్ని Fact Checks:

కరోనా వైరసును ఎలా గుర్తించాలో AIIMS ఒక ప్రకటనను విడుదల చేసిందా? వాస్తవ పరిశీలన

ఫైజర్ కోవిడ్-19 టీకాలు మంకీపాక్స్ వ్యాప్తికి కారణమైందని వైరల్ వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check

 

నేపాలీ హిందువులు బహుమతులతో అయోధ్యకు చేరుకున్నట్లుగా షేర్ చేయబడిన వీడియో; వాస్తవ పరిశీలన

వాదన/Claim: భగవాన్ రామ్ మరియు సీతమ్మ తల్లి వివాహ కానుక వేడుకను నేపాల్‌లోని సీత పుట్టింటి నుండి అయోధ్యలోని భగవాన్ రామ మందిరం వరకు పెద్ద ఊరేగింపుగా నిర్వహిస్తున్నారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు సందేశం.జూలై 2023లో ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నిర్వహించిన ‘భగవత్ కథ’ కోసం 3 కిలోమీటర్ల పొడవైన కలశ యాత్రలో వేలాది మంది మహిళలు పాల్గొన్న ఒక పాత వీడియోను, జనవరి 2024లో అయోధ్యలో జరిగే ‘ప్రాణ ప్రతిష్ఠ’కోసం తరలి వస్తున్న నేపాల్ భక్తుల యాత్రగా షేర్ చేయబడింది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

Fact Check వివరాలు:

జనవరి 22, 2024న అయోధ్యలోని రామమందిరంలో జరిగే ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమం సమీపిస్తున్న తరుణంలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అనేక తప్పుడు వీడియోలు షేర్ చేయ బడుతున్నాయి.ఈ కార్యక్రమానికి నేపాల్ నుండి భారతదేశానికి ‘జై శ్రీ రామ్’ అని నినాదాలు చేస్తు వస్తున్న భక్తుల ఊరేగింపని ఒక వాదనతో షేర్ చేయ బడుతున్న  వీడియో చూడవచ్చు.

వీడియో చూడండి:

జనవరి 22, 2024న ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది మరియు రెండు లక్షల మందికి పైగా భక్తులు అయోధ్యలో జరిగే వేడుకను చూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ఈ వైరల్ సందేశం దేశంలోని చాలా మంది వీక్షకుల దృష్టిని ఆకర్షించింది.

పోస్ట్ యొక్క శీర్షిక ఇలా ఉంది:”భగవాన్ రామ్ మరియు సీతమ్మ తల్లి వివాహ కానుక వేడుకను నేపాల్‌లోని సీత పుట్టింటి నుండి అయోధ్యలోని భగవాన్ రామ మందిరం వరకు పెద్ద ఊరేగింపుగా నిర్వహిస్తారు”.

అదే వీడియోతో కూడిన మరొక సందేశం వేరొక శీర్షికతో ఇలా ఉంది:
బ్రాహ్మణులు కారు, ‘క్షత్రియులు కారు ‘వైశ్యులు’ కారు ‘శూద్రులు’కారు, కేవలం ఒక మహాసముద్రం లాగా హిందువులంతా నేపాల్ నుండి అయోధ్యకు #రామమందిరప్రాణప్రతిష్ట కోసం చేరుకుంటున్నారు”.

వీడియో ఇక్కడ మరియు ఇక్కడ విస్తృతంగా షేర్ చేయబడింది.


FACT CHECK

అదే వీడియో చాలా సందర్భాలలో షేర్ చేయడంతో Digiteye India టీమ్ దాన్ని వాస్తావ పరిశీలన కోసం స్వీకరించింది.మేము వీడియోను కీలక ఫ్రేమ్‌లుగా విభజించి, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ ఉపయోగించి పరిశీలించగా,9 జూలై 2023న ట్విట్టర్లో పోస్ట్ చేసిన ధీరేంద్ర కృష్ణ శాస్త్రి భక్తుల ఊరేగింపుకు సంబంధించిన వీడియో అని తెలుకున్నాము.

“నోయిడాలోని బాగేశ్వర్ ధామ్ సర్కార్ కలాష్ యాత్ర” అని పిలువ బడే ఇది, విస్తృతంగా షేర్ చేయబడింది.గూగుల్‌లో మరిన్ని వివరాల కోసం చూడగా, అది “జైత్‌పూర్ గ్రేటర్ నోయిడా శోభా యాత్ర మరియు కలాష్ యాత్ర” అని తెలుసుకున్నాము. వీడియోను ఇక్కడ చూడండి:

సంఘటన ఇక్కడ మరియు ఇక్కడ నివేదించబడింది.

గ్రేటర్ నోయిడాలో దివ్య దర్బార్ వేడుకలకు ముందు పెద్ద కలశ యాత్ర నిర్వహించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.మూడు కిలోమీటర్ల మేర జరిగిన ఈ కలశ యాత్రలో వేలాది మంది ప్రజలు ముఖ్యంగా మహిళలు పాల్గొన్నారు. ధీరేంద్ర కృష్ణ శాస్త్రిచే నిర్వహించబడిన’భగవత్ కథ’ జూలై 10 మరియు జూలై 16 మధ్య జరిగింది.

కావున, జనవరి 22, 2024న జరగబోయే రామమందిర ప్రాణ ప్రతిష్ట   ఘటన కోసం నేపాల్ భక్తులు బహుమతులు తీసుకువస్తున్నట్లుగా 2023 జూలై నాటి ఒక పాత తప్పుడు వీడియో షేర్ చేయబడింది.

 

మరి కొన్ని Fact Checks:

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 25,000 హోమ గుండాలను ఏర్పాటు చేశారా? వాస్తవ పరిశీలన

ఈ వీడియోలో కేరళ దేవాలయంలోని ప్రసిద్ధ శాఖాహార మొసలిని గురించి తెలుపుతున్నారా? వాస్తవ పరిశీలన

 

తమిళనాడులోని బీహెచ్ఈఎల్ (తిరుచ్చి యూనిట్) రామమందిరం కోసం ఈ భారీ గంటలను తయారు చేసిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:తమిళనాడులోని బీహెచ్ఈఎల్ (తిరుచ్చి యూనిట్) రామమందిరం కోసం ఈ భారీ గంటలను చేసిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion:నిజానికి ఈ గంటలు అయోధ్య రామమందిరం కోసం తయారు చేయబడినవే,కానీ క్లెయిమ్ చేసినట్లుగా BHEL(త్రిచ్చి) కాకుండా, తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని మోహనూర్ రోడ్‌లోని “ఆండాల్ మోల్డింగ్ వర్క్స్ ” వారు వీటిని తయారు చేసారు.

రేటింగ్ :తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు:

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ప్రభుత్వ రంగ సంస్థ – భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బిహెచ్‌ఇఎల్) -భారీ గుడి గంటలను తయారు చేసి ట్రక్కులో అయోధ్య రామ మందిరానికి తరలిస్తుందనే వాదనతో ఒక వీడియో వైరల్ అవుతోంది.

వాదన ఇలా ఉంది:भारत हैवी इलेक्ट्रिकल्स, त्रिचुरापल्ली में निर्माण कर अयोध्या मंदिर को भेजे जा रहे हैं ये सभी घंटे जय श्री राम लिख कर शेयर करें (తెలుగు అనువాదం: “BHEL తిరుచ్చి సంస్థ అయోధ్య ఆలయం కోసం ఈ గంటలను తయారు చేసి అయోధ్యాధామానికి (రామ మందిరం)కి తరలిస్తోంది.కామెంట్ బాక్స్‌లో జై శ్రీ రామ్ అని వ్రాసి, దానిని భక్తుడిగా షేర్ చేయండి”).

FACT CHECK

BHEL ఒక ప్రభుత్వ రంగ సంస్థ (PSU) మరియు అటువంటి నివేదిక ఏ వార్తా సంస్థలలో కనిపించలేదు కావున Digiteye India బృందం వాస్తవ పరిశీలన ప్రక్రియ చేపట్టింది.గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వీడియో దృశ్యాల కీలక ఫ్రేములు పరిశీలించినప్పుడు, ఒరిజినల్ వీడియో గత నెలలో ‘మోజో స్టోరీ’ అనే వీడియో పబ్లిషర్ ద్వారా అప్‌లోడ్ చేయబడిందని, మరియు తమిళనాడు నుండి ‘నలభై రెండు(42) గుడి గంటలు’ రవాణా చేయబడినట్లు తెలుసుకున్నాము.

గూగుల్ న్యూస్‌లో మరింత సమాచారం కోసం చూడగా, బెంగళూరుకు చెందిన రాజేంద్ర ప్రసాద్ అనే భక్తుడు అయోధ్య రామ మందిరం కోసం నమక్కల్ జిల్లాలోని మోహనూర్ రోడ్‌లోని “ఆండాల్ మోల్డింగ్ వర్క్స్”‌కి “48 గుడి గంటల తయారీ” ఆర్డర్ ఇచ్చాడని తెలిసింది.మొదటి బ్యాచ్ 42 గంటలు పూర్తయ్యాయని, బెంగళూరుకు రవాణా చేయడానికి ముందు పూజించడం కోసం నామక్కల్‌లోని ఆంజనేయర్ ఆలయంలో ఉంచామని నివేదిక పేర్కొంది.వార్తా నివేదికలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఒక ప్రభుత్వ రంగ సంస్థ (PSU)అయిన BHEL,ఈ గుడి గంటలు తయారు చేసిందని ఏ వార్తా సంస్థలు నివేదించలేదు.ఒకవేళ BHELకి అటువంటి ఆర్డర్ ఏదైనా వచ్చి ఉంటె, వార్తా నివేదికలలో విస్తృతంగా కవర్ చేయబడి ఉండేది. కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.

మరి కొన్ని Fact checks:

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; Fact Check

జాతీయ వైద్య కమిషన్ తన లోగోను రంగులతో ఉన్న ధన్వంతరి చిత్రంతో మార్చేసిందా? వాస్తవ పరిశీలన

ఈ వీడియోలో కేరళ దేవాలయంలోని ప్రసిద్ధ శాఖాహార మొసలిని గురించి తెలుపుతున్నారా? వాస్తవ పరిశీలన

మాల్దీవుల అధ్యక్షుడు భారత ప్రధాని మోడీపై తన మంత్రులు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసారా?; వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారత ప్రధాని మోదీపై తన ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యలకు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ భారతీయులకు క్షమాపణలు చెప్పారనేది వాదన.

నిర్ధారణ/Conclusion:మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ తన ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భారతీయులకు క్షమాపణలు చెబుతూ ఎలాంటి ట్వీట్ చేయలేదు.

రేటింగ్ :తప్పుగా చూపించే ప్రయత్నం –

వాస్తవ పరిశీలన యొక్క వివరాలు:

మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు,పర్యాటకం కోసం లక్షద్వీప్ దీవులను ప్రోత్సహిస్తున్న మోడీపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్నసందేశం/మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపధ్యంలో,మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ,ఆయన ముగ్గురు మంత్రులు మోదీపై అలాంటి అవమానకర వ్యాఖ్యలను చేసినందుకు భారతీయులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసారంటూ X ప్లాట్ఫారం లో (గతంలో ట్విట్టర్) సందేశం వైరల్ అవుతోంది.

తొలగించబడిన సందేశం యొక్క స్క్రీన్ షాట్ కింద చూడవచ్చు:

ప్రెసిడెంట్ ముయిజ్జూ అధికారిక ‘X’ ఖాతాలో ట్వీట్ ఇలా పేర్కొంది:
“ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బాధ్యతారహితంగా చేసిన వ్యాఖ్యలకు మా మంత్రుల తరపున, నేను భారతీయ మిత్రులకు చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్నాను.భారతదేశం నుండి స్నేహితులకు స్వాగతం పలికేందుకు మరియు మన దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతంచేయడాన్ని ఆకాంషిస్తున్నాను.”

ఈ ట్వీట్ జనవరి 7న పోస్ట్ చేయబడింది. చాలా మంది వినియోగదారులు ఇక్కడ మరియు ఇక్కడ అనేక వ్యాఖ్యలతో దీనిని రీట్వీట్ చేశారు.
అయితే, మోదీని “ఉగ్రవాది” మరియు “ఇజ్రాయెల్ తోలుబొమ్మ” అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకుగాను ముగ్గురు మాల్దీవుల మంత్రులను సస్పెండ్ చేశారు.

FACT CHECK

Digiteye India టీమ్‌కు వాస్తవాన్ని పరిశీలన చేయమని అభ్యర్థన వచ్చినప్పుడు,వారు మొదట మాల్దీవుల ప్రెసిడెంట్ ముయిజ్జూ అధికారిక ‘X’ ఖాతాను సందర్శించి, ట్వీట్ కోసం వెతకగా అది ఎక్కడ కూడా మా దృష్టికి రాలేదు.వాస్తవానికి, అతను తన చివరి సందేశాన్ని జనవరి 5, 2024న తన అధికారిక ‘X’ ఖాతాలో పోస్ట్ చేసారు.

సోషల్ మీడియా మానిటరింగ్ టూల్ ‘Social Blade’ ద్వారా, జనవరి 5, 2024 తర్వాత ప్రెసిడెంట్ ముయిజ్జూ వైపు నుండి ఎటువంటి సందేశం తొలగించబడలేదని మేము తెలుసుకున్నాము,కాబట్టి మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ‘తొలగించబడిన ట్వీట్‘ అనే అవకాశమే లేదు.మరియు క్షమాపణకు సంబంధించిన వార్తల కోసం పరిశీలించగా, ఇప్పటివరకు విశ్వసనీయ వర్గాలనుండి ఎలాంటి సమాచారం కనపడలేదు.

అందువల్ల, ప్రెసిడెంట్ ముయిజ్జూ ‘X’లో (గతంలో ట్విట్టర్‌)వ్యక్తిగతంగా క్షమాపణలు కోరుతూ చేసిన ట్వీట్ మార్ఫింగ్ చేయబడింది లేదా డిజిటల్‌గా మార్చబడింది.అయితే, ప్రధాని మోదీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులు సస్పెండ్ అయిన మాట మాత్రం వాస్తవం.

మరి కొన్ని Fact checks:

లాస్ ఏంజిల్స్‌లోని నైక్ స్టోర్ బ్లాక్ ఫ్రైడే రోజున చోరీకి గురైందా? వాస్తవ పరిశీలన

ఇజ్రాయెల్-హమాస్ దాడుల నేపథ్యంలో, ఇజ్రాయెల్ నిరసనకారులపై కారు దూసుకెళ్లిందనే వాదన; వాస్తవ పరిశీలన