Tag Archives: telugu fact check

మహా కుంభమేళా ముగింపు రోజున త్రిశూలం ఆకారంలో ఎయిర్ షో నిర్వహించబడిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: మహా కుంభమేళా ముగింపు రోజున 26 ఫిబ్రవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో వైమానిక దళ విమానాల ద్వారా త్రిశూలం ఆకారంలో ఎయిర్ షో నిర్వహించబడిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన. వైరల్ అవుతున్న చిత్రం 2025 ఫిబ్రవరి 26న జరిగిన మహా కుంభమేళా ముగింపు కార్యక్రమానికి సంబంధించినది కాదు, కానీ 2019 నుండి ఇంటర్నెట్‌లో ఉన్న పాత చిత్రం.

రేటింగ్/Rating : తప్పు దారి పట్టించే వాదన–

**************************************************************************

ఫిబ్రవరి 26, 2025న మహా కుంభమేళా చివరి రోజున ప్రయాగ్‌రాజ్‌లో భారత వైమానిక దళం నిర్వహించిన త్రిశూలం ఆకార నిర్మాణం యొక్క చిత్రంతో సోషల్ మీడియా హోరెత్తుతోంది.

వాదన/దావా ఈ విధంగా ఉంది: “ఈ సంవత్సరానికే ఇది చిత్రం !!! 3 సుఖోయ్ 30 MKI విమానాలతో మహాదేవ్ త్రిశూలం ఆకార నిర్మాణం !!! #భారత వాయుసేనకు సెల్యూట్ జై మహాకాల్”.

ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

వాస్తవ పరిశీలన

సోషల్ ప్లాట్‌ఫామ్‌లలో చాలా మంది ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్నందున, వైరల్ క్లెయిమ్/వాదన యొక్క ప్రామాణికతను పరిశీలించడానికి బృందం ప్రయత్నించగా, మహా కుంభమేళా ముగింపు రోజున ఎయిర్ షో సమయంలో త్రిశూలం ఆకార నిర్మాణం జరగలేదని కనుగొన్నారు. ముగింపు రోజున జరిగిన అసలు ఎయిర్ షో వీడియోని దిగువన చూడవచ్చు:

గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో మరింత సమాచారం కోసం వెతకగా, అలాంటి చిత్రం ఇంటర్నెట్‌లో చాలా కాలంగా షేర్ అవుతోందని తేలింది. 2019 నుండి ఇదే చిత్రాన్ని షేర్ చేసిన పోస్ట్ ఇక్కడ ఉంది:

2025 ఫిబ్రవరి 26న మహా కుంభమేళాలో వైమానిక దళ విమానాల ద్వారా త్రిశూలం ఆకారంలో జరిగిన ఎయిర్ షోకి సంబంధించి మరిన్ని వార్తలు/నివేదికల కోసం మరింత శోధించినా, ఎటువంటి ఫలితాలు వెలువడలేదు.కాబట్టి వైరల్ అవుతున్న చిత్రం 2025 ఫిబ్రవరి 26న జరిగిన మహా కుంభమేళా ముగింపు కార్యక్రమానికి సంబంధించినది కాదు, కానీ 2019 నుండి ఇంటర్నెట్‌లో ఉన్న పాత చిత్రం.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

చిత్రంలో కనపడుతున్నట్లు భారతీయ వలసదారుల చేతులకు బేడీలు వేసి గ్వాటెమాలాకు పంపించారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: చిత్రంలో కనపడుతున్నట్లు భారతీయ వలసదారుల చేతులకు బేడీలు వేసి గ్వాటెమాలాకు పంపించేస్తున్నారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. ఈ చిత్రంలో కనిపించేవాళ్ళు భారతీయులు కాదు, ఇతర అక్రమ వలసదారులను USA నుండి గ్వాటెమాలాకు పంపిస్తున్నట్లు(బహిష్కరిస్తున్నట్లు) తెలుస్తుంది.

రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం.

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

ఒక ఫైటర్ జెట్ లోపల కూర్చున్న అనేక మంది వ్యక్తుల చేతులు సంకెళ్లులతో, గొలుసులతో బంధించబడి ఉన్నట్లు చూపించే ఒక చిత్రం, అమెరికా అధికారులు భారతీయులను గ్వాటెమాలాకు పంపించేస్తున్నారనే వాదనతో సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది.

ఫిబ్రవరి 4, 2025 మంగళవారం నాడు 205 మంది భారతీయ పౌరులను తీసుకెళ్లిన US మిలిటరీ జెట్ C-17, టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో నుండి బయలుదేరి అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన సందర్భం సుపరిచితమే.

వాస్తవ పరిశీలన వివరాలు:

ఇటీవల అమెరికా సైనిక విమానంలో 205 మంది భారతీయులను సంకెళ్లు, గొలుసులతో వెనక్కి పంపించేశారనేది(బహిష్కరించిందనేది) నిజమే అయినప్పటికీ, షేర్ చేయబడుతున్న చిత్రం అసలైన చిత్రం కాదు, అది అక్రమ వలసదారులను మెక్సికోలోని గ్వాటెమాలాకు పంపించే (బహిష్కరించే) సమయంలోని చిత్రం.

అసోసియేటెడ్ ప్రెస్ (AP) సౌజన్యంతో ఉన్న ఈ చిత్రం, ఆ వార్తా సంస్థ ద్వారా జనవరి 31, 2025న పోస్ట్ చేయబడింది మరియు దాని శీర్షిక ఇలా ఉంది: “జనవరి 30, 2025, గురువారం, టెక్సాస్‌లోని ఎల్ పాసోలోని ఫోర్ట్ బ్లిస్ వద్ద ఉన్న సైనిక విమానంలో ఫేస్ మాస్క్‌లు ధరించిన మరియు చేతులు,కాళ్లకు సంకెళ్ళతో బంధించబడిన వలసదారులు గ్వాటెమాలాకు తిరిగి వెళ్ళడం(బహిష్కరణ) కోసం ఎదురు చూస్తున్నారు (AP ఫోటో/క్రిస్టియన్ చావెజ్)”.

అందులో భారతీయుల గురించి ఏమీ ప్రస్తావించలేదు.

అందువల్ల, భారతీయులను గ్వాటెమాలాకు పంపించేస్తున్నట్లు(బహిష్కరిస్తున్నట్లు) తప్పుడు చిత్రం షేర్ చేయబడుతోంది.

వాస్తవానికి, భారతీయులను భారతదేశంలోని అమృత్సర్ నగరానికి పంపించిన(బహిష్కరించిన)కొన్ని అసలైన చిత్రాలను US సరిహద్దు గస్తీ సిబ్బంది(US Border Patrol) ద్వారా షేర్ చేయబడటం ఇక్కడ చూడవచ్చు.

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఫిబ్రవరి 6, 2025న పార్లమెంటులో చేసిన ప్రకటనలో దీనిని ధృవీకరించారు, ఇది 2012 నుండి అనుసరిస్తున్న ప్రధానమైన విధానంలో భాగమని వివరించారు. మరింత వివరణ ఇస్తూ ఆయన సభతో ఇలా అన్నారు: “సర్, US ద్వారా బహిష్కరణలను ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు నిర్వహిస్తారు మరియు వాటిని అమలు చేస్తారు.
ప్రధానమైన ఆపరేటింగ్ విధానం ప్రకారం, ICE ఉపయోగించే ‘విమానం ద్వారా బహిష్కరణ’ 2012 నుండి అమలులోకి రాగా, అది పరిమితులు విధించి వెనక్కు పంపడానికి వినియోగిస్తారు. అయితే, మహిళలు మరియు పిల్లలు నియంత్రించబడరని ICE ద్వారా మాకు సమాచారం అందింది.”

అందువలన ఇది తప్పుడు వాదన.

 

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

ట్రంప్ పరిపాలనను విమర్శిస్తున్న అకౌంట్ల నిలిపివేత గురించి మస్క్ Xలో పోస్ట్ చేశారా? వాస్తవ పరిశీలన

అమెరికా మరియు కెనడా 1.2 మిలియన్ల అక్రమ భారతీయ వలసదారులను స్వదేశానికి తిరిగి పంపించేస్తున్నారా ? వాస్తవ-పరిశీలన

ట్రంప్ పరిపాలనను విమర్శిస్తున్న అకౌంట్ల నిలిపివేత గురించి మస్క్ Xలో పోస్ట్ చేశారా? వాస్తవ పరిశీలన

వాదన/Claimట్రంప్ పరిపాలనను విమర్శించే అన్ని ట్వీట్లను నిలిపివేస్తామని ఎలాన్ మస్క్ Xలో పోస్ట్ చేశారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. ట్రంప్ పరిపాలనను విమర్శించే X ఖాతాలను సస్పెండ్ చేస్తామని/నిలిపివేస్తామని ఎలోన్ మస్క్ పోస్ట్‌ను షేర్ చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు.

రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన —

*****************************************************************************

X యజమాని మరియు బిలియనీర్ ఎలోన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా నిరసన తెలిపే ఖాతాలను/అకౌంట్లను X ప్లాట్‌ఫామ్ నుండి సస్పెండ్ చేయడం/నిలిపివేయడం జరుగుతుందనే సందేశాన్ని పోస్ట్ చేశారని ఒక క్లెయిమ్/వాదన సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

దావా/వాదన ఈ విధంగా ఉంది: ” ట్రంప్ పరిపాలనను నిరసిస్తున్న ఎవరైనా X నుండి సస్పెండ్ చేయబడతారు. ట్రంప్ వ్యతిరేక డ్రామా అంతా థ్రెడ్స్, రెడ్డిట్, బ్లూస్కై, ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ వంటి లిబరల్ ఎకో చాంబర్లలో ((liberal echo chamber) పోస్ట్ చేసుకోవచ్చు”.

FACT-CHECK

ఈ వాదన ఆందోళనకరంగా ఉండటం మరియు అమెరికా వాక్ స్వేచ్ఛ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో, Digiteye India బృందం ఆ వాదన యొక్క ప్రామాణికతను పరిశీలించింది. ముందుగా చిత్రంలోని పోస్ట్‌లో టైమ్‌స్టాంప్ లేదు, కానీ మస్క్ ప్రొఫైల్ ఇమేజ్ మరియు హ్యాండిల్ “@elonmusk” ఉండటం గమనించాము.

ఇంకా, వాదన/క్లెయిమ్ చేయబడిన చిత్రంలో “ఫాలో” బటన్ మాత్రమే ఉంది, కానీ మస్క్ అసలైన (Original)పోస్ట్ ఎగువ కుడి మూలలో xAI లోగోతో పాటు “సబ్‌స్క్రైబ్” బటన్‌ కూడా ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని ఇక్కడ క్రింది చిత్రాలలో స్పష్టంగా చూడవచ్చు:

మేము ఎలోన్ మస్క్ అధికారిక హ్యాండిల్‌ను పరిశీలించినప్పుడు, అతని X ఖాతాలో అలాంటి పోస్ట్ ఏది లేదు, మరియు ఈ పోస్ట్ పై ఎటువంటి వార్తా నివేదికలు లేవు. మస్క్ అటువంటి పోస్ట్‌ను X లో అధికారికంగా షేర్ చేసి ఉంటే అది వేగంగా వార్తల్లోకి వచ్చేది. కాబట్టి, ఆ వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

ఈ వీడియోలో కమలా హారిస్ ‘Xని షట్ డౌన్ చేయాలి’ అన్నారా? వాస్తవ పరిశీలన

బడ్జెట్ 2024-25 ప్రకారం, విదేశాలకు వెళ్లే వారందరికీ పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరా? వాస్తవ పరిశీలన

కొత్తగా ప్రకటించిన 18% GST అన్ని ఉపయోగించిన కార్ల అమ్మకాలపై వర్తిస్తుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:పాత కార్ల అమ్మకాలపై 18% GST విధించబడింది.

నిర్ధారణ/Conclusion:తప్పు దారి పట్టించే వాదన.పాత కార్ల వ్యక్తిగత(ఒక వ్యక్తి మరొక వ్యక్తికి) విక్రయాలకు GST వర్తించదు, అయితే పాత కార్లను తిరిగి విక్రయించే డీలర్లు లేదా తరుగుదల పొందిన వారు తమ పాత కార్లను విక్రయిస్తున్నపుడు మార్జిన్‌పై 18% GST వర్తిస్తుంది.

రేటింగ్/Rating: తప్పు దారి పట్టించే వాదన —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

***********************************************************************

పాత లేదా వాడిన కార్ల విక్రయాలపై వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)ని 12% నుండి 18%కి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో హల్ చల్ చేస్తోంది. ప్రకటన వెలువడిన వెంటనే, ఆర్థిక మంత్రి ప్రెస్ మీట్ తర్వాత సోషల్ మీడియా వాదనలు మరియు ప్రతివాదనలతో హోరెత్తుతోంది.

దావా ఇలా ఉంది:
“నిర్మల సీతారామన్ గారు చెప్పిన ప్రకారం:
నేను నా డీజిల్ కారును 2014లో కొన్నాను : రూ. 24 లక్షలు
నేను నా డీజిల్ కారును 2024లో విక్రయించాను : రూ. 3 లక్షల 2024
కాబట్టి, నేను 21(24-3)లక్షలపై 18% GST చెల్లించాలి! (మార్జిన్ ఆమె చెప్పిన ప్రకారం )”

ఇదే విధమైన వాదనలు ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడ్డాయి

వాస్తవ పరిశీలన

సోషల్ మీడియాలో ఈ చర్చ వైరల్ అవుతుండగా,Digiteye India బృందం సామాజిక మాధ్యమాల్లో ఆర్థిక మంత్రి క్లుప్తంగా చెప్పినదానికి భిన్నమైన వివరణలను కనుగొన్నారు. తన వివరణలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పునఃవిక్రయాల యొక్క “మార్జిన్ విలువ”పై పన్నును సూచిస్తూ వివరించారు, అయితే వారు ఉపయోగించిన కార్లను విక్రయించే వ్యక్తులు పన్నుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని తప్పుగా సూచించబడింది.

మరిన్ని వార్తా నివేదికలు పరిశీలించగా, వాస్తవానికి పన్ను ఉపయోగించిన వాహనాలు రిసేల్(Resale) చేసే వ్యాపారాలకు వర్తిస్తుంది, ప్రైవేట్ అమ్మకందారులకు కాదని గమనించాము.
ఇంకా, మేము PIBలో భారత ప్రభుత్వం ద్వారా అధికారిక పత్రికా ప్రకటన కోసం చూడగా, “వస్తువులు మరియు సేవలకు సంబంధించిన ఇతర మార్పులు” శీర్షిక కింద, ప్రకటన ఈ విధంగా ఉంది:

“18% వద్ద పేర్కొన్నవి కాకుండా ఇతర EVలతో సహా అన్ని పాత మరియు ఉపయోగించిన వాహనాల అమ్మకాలపై GST రేటును 12% నుండి 18%కి పెంచడం–1200 cc లేదా అంతకంటే ఎక్కువ & 4000 mm లేదా అంతకంటే ఎక్కువ పొడవు కలిగిన పాత మరియు ఉపయోగించిన పెట్రోల్ వాహనాల అమ్మకం; 1500 cc లేదా అంతకంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం & 4000 mm పొడవు గల డీజిల్ వాహనాలు మరియు SUVలు.[గమనిక: GST అనేది సరఫరాదారు/సప్లయర్ యొక్క మార్జిన్‌ను సూచించే విలువపై మాత్రమే వర్తిస్తుంది, అంటే, కొనుగోలు ధర మరియు అమ్మకం ధర మధ్య వ్యత్యాసం (తరుగుదల/depreciation క్లెయిమ్ చేయబడితే తరుగుదల/depreciated విలువ) మరియు వాహనం విలువపై కాదు.అలాగే, నమోదుకాని(రిజిస్ట్రేషన్ చేయని) వ్యక్తుల విషయంలో ఇది వర్తించదు.]”

ముఖ్యంగా, పన్ను మూడు స్పెసిఫికేషన్లపై ఆధారపడి ఉంటుంది:
1. పాత మరియు ఉపయోగించిన వాహనాలు అమ్మే ప్రైవేట్ వ్యక్తులు లేదా రిజిస్ట్రేషన్ చేయని వ్యక్తులు మునుపటిలా 12% GSTని కలిగి ఉంటారు, మరియు పెరిగిన 18% GST వారికి వర్తించదు.
2.పాత కార్లపై తరుగుదలని క్లెయిమ్ చేసిన సంస్థలు వాటిని ‘సరఫరాదారు/సప్లయర్ యొక్క మార్జిన్‌(అంటే కొనుగోలు ధర మరియు అమ్మకం ధర మధ్య వ్యత్యాసం(తరుగుదల/depreciation క్లెయిమ్ చేయబడితే తరుగుదల/depreciated విలువ))’పై ఈ GST వర్తిస్తుంది.అంతేకాని వాహనం విలువపై కాదు.
3.పాత కార్లను కొనుగోలు మరియు విక్రయించే కంపెనీలకు ఈ 18% GST వర్తిస్తుంది.

ఈ వీడియోలో ఆర్థిక మంత్రి వివరణ చూడండి:

ఉదాహరణకి, ఒక వ్యక్తిగా మీరు రూ.12 లక్షలకు కారును కొనుగోలు చేసి రూ. 9 లక్షలకు మరొక వ్యక్తికి విక్రయిస్తే, GST వర్తించదు.
కానీ మీరు డీలర్ అయితే కారును రూ.9 లక్షలకు కొనుగోలు చేసి రూ.10 లక్షలకు విక్రయిస్తే, 18% GST కేవలం రూ.లక్ష మార్జిన్‌కు మాత్రమే వర్తిస్తుంది.

అందుకే, పాత కార్ల విక్రయాలన్నింటిలో పెరిగిన GST వర్తిస్తుందనే వాదనలో నిజం లేదు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

 

సుదర్శన చక్రం, విష్ణు మరియు శివలింగం విగ్రహాలు సంభాల్ మసీదు సర్వేలో దొరికినట్లు సాక్ష్యం ఉందని వాదన. వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ మసీదులో జరిపిన సర్వేలో క్రీ.శ. 1500 నాటి విష్ణువు, శివ లింగం మరియు సుదర్శన చక్ర విగ్రహాల కనుగొనబడ్డాయనేది, వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. విష్ణు మరియు శివ లింగం విగ్రహాలు ఫిబ్రవరి 2024లో కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో కృష్ణ నదిపై వంతెన నిర్మాణ సమయంలో కనుగొనబడ్డాయి, సంభాల్ మసీదు సర్వే సమయంలో కాదు.

రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన —

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ మసీదులో జరిపిన సర్వేలో క్రీస్తుశకం 1500 నాటి పురాతన హిందూ విగ్రహాలు కనుగొనబడినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.పోస్ట్ ఇక్కడ ఉంది:

పోస్ట్‌లోని నాలుగు చిత్రాలలో రెండు విష్ణువు విగ్రహాలు, ఒక శివలింగం మరియు ఒక సుదర్శన చక్రం ఉన్నాయి.ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఒక మసీదు సర్వేపై సంభాల్ హింసాత్మక ఘర్షణల సందర్భంలో ఈ వాదన/దావా చేయబడింది జరిగింది.

ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

వాస్తవ పరిశీలన

మేము మొదట Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో చిత్రాలను పరిశీలించగా, ఆ చిత్రాలు సంభాల్ ప్రాంతం నుండి కాకుండా ఫిబ్రవరి 2024లో కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతంలోని చిత్రాలని ఫలితాలు వెల్లండించాయి.ఫిబ్రవరి 2024లో ఈ విగ్రహాలు వెలికితీసినప్పుడు ప్రచురించబడిన నివేదికలు ఇక్కడ ఉన్నాయి.

కర్నాటకలోని రాయచూర్ జిల్లాలోని దేవసుగూర్ గ్రామ సమీపంలో కృష్ణా నదిపై వంతెన నిర్మాణ సమయంలో విష్ణువు మరియు శివలింగం యొక్క విగ్రహాలను కనుగొన్నారు. ఫిబ్రవరి 2024లో సుమన్ టీవీ ద్వారా తెలుగులో ప్రసారమైన ఈ ఘటనకు సంబంధించిన వార్తా క్లిప్ ఇక్కడ ఉంది:

అందువలన,ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో మసీదులో సర్వే నిర్వహించగా విగ్రహాలు దొరికాయన్న వాదన అవాస్తవం.సంభాల్ మసీదులో ఇప్పటివరకు హిందూ దేవతల విగ్రహాలను కనుగొన్నట్లు ఎటువంటి వార్తలు కానీ ఆధారాలు కానీ లేవు.కాబట్టి,ఈ వాదన/దావా వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

 

కేంద్ర ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. భారత ప్రభుత్వ(PIB) అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని మరియు దావా తప్పు అని స్పష్టం చేసింది.

రేటింగ్/Rating:తప్పుదారి పట్టించే వాదన. —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

***********************************************************************

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్ని భారతీయ భాషల్లో వైరల్ పోస్ట్ షేర్ అవుతోంది. క్యాబినెట్ ఆమోదించిన విధంగా పదవీ విరమణ వయస్సు 2 సంవత్సరాలు పెరిగినట్లు దావా/వాదన పేర్కొంది.

దేశంలోని యువ ఉద్యోగార్ధులపై దాని ప్రభావం ఎలా ఉంటుందనేది ఇక్కడ  షేర్ చేయబడింది.

హిందీ పోస్ట్ యొక్క తెలుగు అనువాదం: “పదవీ విరమణ వయస్సును రెండేళ్లు పెంచడం వల్ల లక్షలాది మంది ఉద్యోగులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటికే నిరుద్యోగులుగా ఉన్న యువత సంగతేంటి? అది వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇప్పటికే రిక్రూట్‌మెంట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీని వల్ల రెండేళ్లపాటు కొత్త రిక్రూట్‌మెంట్లు కూడా తగ్గుతాయి మరియు మిగిలిన ఉద్యోగులకు కూడా ప్రమోషన్లలో జాప్యం జరుగుతుంది.”

పోస్ట్ ఇక్కడ మరియు ఇక్కడ అందుబాటులో ఉంది.

వాస్తవ పరిశీలన

భారత ప్రభుత్వం ఈ విషయంలో ఏమైనా ప్రకటన జారీ చేసిందా అని పరిశీలించగా,ఇటీవలి రోజుల్లో భారత ప్రభుత్వం నుండి అలాంటి ప్రకటన ఏది లేదని కనుగొన్నాము.
ఈ వాదన వలన, ఉద్యోగంలో కొనసాగడానికి లేదా ప్రమోషన్ అవకాశల్లో తగ్గుదల లాంటి ప్రభావం లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై చూపుతుంది కాబట్టి,ఇది వార్తల్లో ముఖ్యాంశాలుగా ఉండేది. కానీ అలాంటి ప్రకటనేమీ చేయలేదు.

మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచడానికి ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టం చేసింది.

తదుపరి పరిశోధనలో, 2023 ఆగస్టులో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచే ప్రతిపాదన ఏదీ తన పరిశీలనలో లేదని ప్రభుత్వం లోక్‌సభలో ధృవీకరించిందని , మరియు కేసుల వారీగా పరిగణించబడే మినహాయింపులను పరిశీలిస్తుందని కనుగొన్నాము.

అందువల్ల, వాదన/దావా తప్పు మరియు తప్పుదారి పట్టించే విధంగా ఉంది..

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

VP నామినీ J.D. వాన్స్ పేరు ప్రకటించినప్పుడు US రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ‘ఇండియా-ఇండియా’ అన్న నినాదాలు వినిపించాయా? వాస్తవ పరిశీలన

 

సునీతా విలియమ్స్ ISS నుండి భూమికి తిరిగి వచ్చేశారని ఒక వీడియో వైరల్ అవుతుంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim: విజయవంతంగా 127 రోజుల స్పేస్ టూర్ తర్వాత, సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి తిరిగి వచ్చేశారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన.ISSలో సునీతా విలియమ్స్ యొక్క పాత (2012 నాటి) వీడియో ఉపయోగించబడింది. ఆమె ఫిబ్రవరి 2025లో భూమికి తిరిగి రావాల్సి ఉంది.

రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన.

అంతరిక్ష కేంద్రం (ISS)లో నాలుగు నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి సురక్షితంగా తిరిగి వస్తున్నారని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఒక వీడియోను షేర్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలోని కొన్ని పోస్ట్‌లను ఇక్కడ చూడండి:

ఒక వాదన ఈ విధంగా ఉంది: “విజయవంతమైన 127 రోజుల స్పేస్ టూర్ తర్వాత, “సునీతా విలియమ్స్” సురక్షితంగా భూమికి తిరిగి వస్తున్నారు. ఇది నిజంగా మనసుకు హత్తుకునే వీడియో మరియు చూడటానికి అద్భుతంగా ఉంది.”

వాస్తవ పరిశీలన వివరాలు:

అనేక క్లెయిమ్‌/వాదనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం, DigitEye India బృందం వాస్తవ-పరిశీలనకు పూనుకుంది.
వీడియో నుండి కొన్ని ఫ్రేమ్‌లను తీసుకొని, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడం ద్వారా ఇది నవంబర్ 2012 నాటి పాత వీడియో అని తేలింది. సునీతా విలియమ్స్ “32/33 అంతరిక్ష యాత్ర”లో భాగంగా జూలై 15, 2012న బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ను పర్యటించిన సందర్భంలో ISS యొక్క కక్ష్య ప్రయోగశాల, వంటగది, టాయిలెట్, స్లీపింగ్ బెడ్‌, స్పేస్ సూట్ తో సహా అన్ని సౌకర్యాలను మరియు ప్రాంతాలను వీడియోలో రికార్డు చేసారు. ఈ వీడియోను NASA యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది.

ఆమె, ఆమె తోటి వ్యోమగాములు యూరి మాలెన్‌చెంకో మరియు అకిహికో హోషిడ్‌లతో కలిసి రష్యన్ అంతరిక్ష నౌక సోయుజ్ TMA-05Mలో నాలుగు నెలల పాటు ISS దగ్గర నిలిపివేయబడింది(డాక్ చేయబడింది).తిరిగి నవంబర్ 19, 2012న భూమికి తిరిగి వచ్చారు.

అయితే, మళ్లీ జూన్ 5, 2024న, బుచ్ విల్మోర్‌తో పాటు సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) పంపబడ్డారు మరియు వారు బోయింగ్ స్టార్‌లైనర్‌ను ISSతో విజయవంతంగా డాక్ చేయగలిగారు.వాస్తవానికి ఈ మిషన్‌ను వారం రోజుల పాటు టెస్ట్ ఫ్లైట్‌గా ప్లాన్ చేశారు, కానీ బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, వారు తిరిగి రాలేక అంతరిక్షంలో చిక్కుకుపోయారు. ఫిబ్రవరి 2025లో స్పేస్‌ఎక్స్ డ్రాగన్‌లో వారిని తిరిగి భూమికి తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కాబట్టి, సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చేశారనే వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

హారిస్‌కు మద్దతు తెలిపినందుకు కంట్రీ మ్యూజిక్ ‘టేలర్ స్విఫ్ట్‌’ను నిషేధించిందా? వాస్తవ పరిశీలన

సెప్టెంబరు 10న ట్రంప్‌తో ప్రెసిడెన్షియల్ డిబేట్ సమయంలో కమలా హారిస్ తన చెవిపోగుల్లో ‘ఇయర్‌పీస్’ పెట్టుకున్నారా? వాస్తవ పరిశీలన

 

 

 

 

గోవా తీరంలో పడవ బోల్తా పడి పెద్ద ప్రమాదం జరిగిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: బోల్తా పడిన పడవ, భారతదేశంలోని గోవా తీరంలో జరిగిన ప్రమాదమనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. వీడియోలోని పడవ భారతదేశంలోని గోవాలో కాకుండా ఆఫ్రికాలోని గోమాలో బోల్తాపడి పెద్దప్రమాదం జరిగింది.

రేటింగ్/Rating:తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి..

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

‘గోవా’లో ఓవర్‌లోడెడ్ స్ట్రీమర్ బోట్ బోల్తా పడి చాలా మంది చనిపోయినట్లు, ఇంకా చాలా మంది గల్లంతయ్యారంటూ పేర్కొంటున్న వీడియోను పలువురు సోషల్ మీడియా యూజర్లు షేర్ చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని పోస్టులను చూడండి:

వాస్తవ పరిశీలన వివరాలు:

DigitEye India బృందం వీడియో యొక్క కొన్ని కీఫ్రేమ్‌లను తీసుకొని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో పరిశీలించినప్పుడు, ఈ విషాద సంఘటన భారతదేశంలో జరగలేదని కనుగొనబడింది, అయితే ఈ ప్రయాణీకుల పడవ డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఆఫ్రికాలోని కివు సరస్సు నీటిలో ప్రయాణించడం గమనించాము.

సోషల్ మీడియా పోస్ట్‌లలో పేర్కొన్నట్లుగా ఓవర్‌లోడ్ అయిన పడవ సౌత్ కివులోని మినోవా పట్టణం నుండి గోమాకు ప్రయాణిస్తోంది, భారతదేశంలోని గోవా పట్టణానికి కాదు.  స్థానిక వార్తా నివేదికల ప్రకారం, విషాదకరమైన పడవ ప్రమాదంలో కనీసం 78 మంది మరణించారు, మరియు ఇంకా చాలా మంది గల్లంతయ్యారు.

కాంగోలోని కిటుకు ఓడరేవు నుండి ఒక కిలోమీటరు కంటే తక్కువ దూరంలో ఉన్నప్పటికీ, ఓడరేవుకు చేరుకునేలోపే, అధిక బరువు మరియు అధిక వేగవంతమైన నీటి ప్రవాహాలను తట్టుకోలేక పడవ మునిగిపోయిందనే వివరాలను తెలియజేస్తూ  NewsOnAir వార్త నివేదికను భారతదేశంలో ప్రసారం చేసింది. ఆ పడవ కేవలం 80-90 మంది మాత్రమే ప్రయాణించేలా నిర్మించబడిందని, అయితే 278 మంది ఓవర్‌లోడ్‌తో పడవ మునిగిపోయిందని నివేదికలు వెల్లడించాయి.

 

 

గోవా పోలీసులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు:

కాబట్టి, బోల్తా పడిన పడవ భారతదేశంలోని గోవా తీరంలో జరిగిన సంఘటనేది తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

హారిస్‌కు మద్దతు తెలిపినందుకు కంట్రీ మ్యూజిక్ ‘టేలర్ స్విఫ్ట్‌’ను నిషేధించిందా? వాస్తవ పరిశీలన

సెప్టెంబరు 10న ట్రంప్‌తో ప్రెసిడెన్షియల్ డిబేట్ సమయంలో కమలా హారిస్ తన చెవిపోగుల్లో ‘ఇయర్‌పీస్’ పెట్టుకున్నారా? వాస్తవ పరిశీలన

 

హారిస్‌కు మద్దతు తెలిపినందుకు కంట్రీ మ్యూజిక్ ‘టేలర్ స్విఫ్ట్‌’ను నిషేధించిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: హారిస్‌కు మద్దతు తెలిపినందుకు, కంట్రీ మ్యూజిక్ టేలర్ స్విఫ్ట్‌ను నిషేధించారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన.అటువంటి నిషేధం ఏమి జరగలేదు మరియు వ్యంగ్య వెబ్‌సైట్ ద్వారా ఈ తప్పుడు/దావా చేయబడింది.

రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన. —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి..

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ను సమర్థించిన తర్వాత టేలర్ స్విఫ్ట్‌ను కంట్రీ మ్యూజిక్ నుండి నిషేధించారనే వాదనతో కొన్ని పోస్ట్‌లు సోషల్ మీడియాలో షేర్ చేయబడుతున్నాయి.

X లో పోస్ట్ చేయబడిన ఒక వైరల్ మిమ్(meme) ఇలా పేర్కొంది: “గట్టి మద్దతు తెలిపిన తర్వాత టేలర్ స్విఫ్ట్ కంట్రీ మ్యూజిక్ నుండి నిషేధించబడింది: “ఆమె పాడటానికి కట్టుబడి ఉండాలి, రాజకీయాలకు కాదు”.

పాప్ మ్యూజిక్ ఐకాన్ టేలర్ స్విఫ్ట్, ఇంతకు ముందు రిపబ్లికన్ యొక్క ట్రంప్ గట్టి మద్దతుదారు అయిన ఆమె తన మద్దతును సెప్టెంబర్ 10, 2024న హారిస్‌కు మార్చడంతో వార్తల్లోకి ఎక్కింది.ఆమె హారిస్‌కు బహిరంగగా మద్దతు ఇవ్వడం చూసి, కొత్త ఆరోపణలతో సహా అనేక మీమ్స్ మరియు తప్పుడు ఆరోపణలు సోషల్ మీడియాలో షేర్ చేయబడ్డాయి.

పోస్ట్‌కు 2,400 కంటే ఎక్కువ స్పందనలు మరియు 1,000 వ్యాఖ్యలు వచ్చాయి మరియు స్విఫ్ట్ మద్దతుపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తీవ్ర చర్చను రేకెత్తించింది.

వాస్తవ పరిశీల వివరాలు:

DigitEye బృందం పరిశీలించగా అసలు/ఒరిజినల్ పోస్ట్ ఫేస్‌బుక్‌లో ఉంది, మరియు ఆ సందేశాన్ని వ్యంగ్యంగా పేర్కొన్నట్లు తెలిసింది.అందులో వ్యంగ్య వెబ్‌సైట్ అయిన SpaceXMania.com వెబ్‌సైట్‌కి లింక్‌ ఇవ్వబడింది. కాకపోతే,నాష్‌విల్లే యొక్క కంట్రీ మ్యూజిక్ ఎలైట్ యొక్క ప్రతిచర్యలు లేదా స్టేట్‌మెంట్‌ల ద్వార పాప్ స్టార్ కంట్రీ మ్యూజిక్ నుండి నిషేధించబడిందనడానికి ఎటువంటి ఆధారాలు మాకు దొరకలేదు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్, SpaceXMania.com కథనానికి లింక్ ఇవ్వబడింది. మేము దాని ప్రామాణికత కోసం పరిశీలించినప్పుడు, అది వ్యంగ్య వెబ్‌సైట్ అని స్పష్టంగా చూపుతూ, కథనాలు కల్పితం మరియు నిజమైనవి కావని డిస్క్లైమర్స్లో/disclaimers పేర్కొన్నారు. కమలా హారిస్‌కు మద్దతు తెలిపినందుకు టేలర్ స్విఫ్ట్ ను టార్గెట్ చేయడం ఇదేం మొదటిసారి కాదు.
కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.
హారిస్‌కు మద్దతు తెలిపినందుకు ఆమె మిలియన్ల కొద్దీ సోషల్ మీడియా ఫాలోవర్లను కోల్పోయారని మునుపటి పుకార్లు పేర్కొనడం జరిగింది లేదా ఇలాంటి కారణాల వల్ల కోకా-కోలా ఆమెతో తన భాగస్వామ్యాన్ని ముగించిందని కూడా వాదనలు వచ్చాయి కానీ అవి తప్పుగా నిరూపణ చేయబడ్డాయి.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

VP నామినీ J.D. వాన్స్ పేరు ప్రకటించినప్పుడు US రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ‘ఇండియా-ఇండియా’ అన్న నినాదాలు వినిపించాయా? వాస్తవ పరిశీలన

కమలా హారిస్‌ అమెరికా యొక్క సహజసిద్దమైన పౌరురాలు కాదా? US ప్రెసిడెంట్ అభ్యర్థి యొక్క అర్హతపై వాదన మళ్లీ తెరపైకి వచ్చింది; వాస్తవ పరిశీలన

 

ఇరాన్ క్షిపణి దాడుల సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బంకర్ వద్దకు పరిగెత్తుతున్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఇరాన్ క్షిపణి దాడుల నుండి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పరిగెడుతున్నట్లు వీడియోలోని వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం.ఇరాన్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగా నెతన్యాహు పారిపోతున్నట్లు చూపుతున్న వీడియో తప్పు.ఇది నెస్సెట్‌లో కీలకమైన పార్లమెంటరీ ఓటు కోసం పరిగెడుతున్నట్లు,నెతన్యాహు స్వయంగా పోస్ట్ చేసిన 2021 నాటి వీడియో ఫుటేజ్.

రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం —

మంగళవారం రాత్రి ఇరాన్ క్షిపణి దాడులు టెల్ అవీవ్‌ను ఢీకొన్న తర్వాత,ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దాడులకు ప్రతిస్పందనగా కారిడార్‌లో పరుగెత్తుతు బంకర్‌కు పారిపోతున్నాడని వినియోగదారులు పేర్కొంటున్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పోస్ట్‌తో ఉన్న క్యాప్షన్ ఇలా ఉంది: “ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పిరికివాడిలా పరిగెత్తుతున్నారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడులతో తన ప్రాణాలను కాపాడుకోవాలనుకుంటున్నాడు.” మరో పోస్ట్ ఇలా ఉంది, “ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్నాడు. అతను ఎన్ని రోజులు బంకర్‌లో దాక్కుంటాడు?”

ఇలాంటి వాదన/దావలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వాస్తవ పరిశీలన వివరాలు:

వీడియోలోని యొక్క కొన్ని కీలక ఫ్రేమ్‌లను తీసుకొని, Digiteye India బృందం Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో అన్వేషించగా ఈ వీడియో మూడేళ్ల పాతదని మరియు వేరే సందర్భంలో తీసినదని గమనించాము. క్రింద చూసినట్లుగా దీనిని నెతన్యాహు స్వయంగా తన అధికారిక X (గతంలో ట్విట్టర్) ఖాతాలో హీబ్రూ భాషలో డిసెంబర్ 14, 2021న పోస్ట్ చేసారు:

తెలుగులోకి అనువదించగా, నెతన్యాహు ఇలా పోస్ట్ చేసారు: “మీ కోసం పరిగెత్తడానికి నేను ఎల్లప్పుడూ గర్వపడుతున్నాను. ఇది నెస్సెట్‌లో అరగంట క్రితం తీయబడింది.” నెతన్యాహు ఇజ్రాయెల్ పార్లమెంట్‌లోని నెస్సెట్‌లో ఉన్నప్పుడు, ఆ సమయంలో ప్రతిపక్ష అధిపతిగా సమావేశానికి హాజరయ్యేందుకు నడుస్తున్నప్పుడు వీడియో తీయబడిందని ఇది నిర్ధారిస్తుంది.
డిసెంబరు 2021 నాటి కొన్ని హిబ్రూ వార్తా నివేదికలు ఆయన నెస్సెట్ ప్లీనంలో ఓటు సమయానికి చేరాలని పరుగెత్తుతున్నట్లు కూడా సూచిస్తున్నాయి. అందువల్ల, ఆయన ఇరాన్ క్షిపణి దాడి నుండి పారిపోతున్నాడనే వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

ఈ వీడియోలో కమలా హారిస్ ‘Xని షట్ డౌన్ చేయాలి’ అన్నారా? వాస్తవ పరిశీలన