Tag Archives: X platform

ట్రంప్ పరిపాలనను విమర్శిస్తున్న అకౌంట్ల నిలిపివేత గురించి మస్క్ Xలో పోస్ట్ చేశారా? వాస్తవ పరిశీలన

వాదన/Claimట్రంప్ పరిపాలనను విమర్శించే అన్ని ట్వీట్లను నిలిపివేస్తామని ఎలాన్ మస్క్ Xలో పోస్ట్ చేశారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. ట్రంప్ పరిపాలనను విమర్శించే X ఖాతాలను సస్పెండ్ చేస్తామని/నిలిపివేస్తామని ఎలోన్ మస్క్ పోస్ట్‌ను షేర్ చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు.

రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన —

*****************************************************************************

X యజమాని మరియు బిలియనీర్ ఎలోన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా నిరసన తెలిపే ఖాతాలను/అకౌంట్లను X ప్లాట్‌ఫామ్ నుండి సస్పెండ్ చేయడం/నిలిపివేయడం జరుగుతుందనే సందేశాన్ని పోస్ట్ చేశారని ఒక క్లెయిమ్/వాదన సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

దావా/వాదన ఈ విధంగా ఉంది: ” ట్రంప్ పరిపాలనను నిరసిస్తున్న ఎవరైనా X నుండి సస్పెండ్ చేయబడతారు. ట్రంప్ వ్యతిరేక డ్రామా అంతా థ్రెడ్స్, రెడ్డిట్, బ్లూస్కై, ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ వంటి లిబరల్ ఎకో చాంబర్లలో ((liberal echo chamber) పోస్ట్ చేసుకోవచ్చు”.

FACT-CHECK

ఈ వాదన ఆందోళనకరంగా ఉండటం మరియు అమెరికా వాక్ స్వేచ్ఛ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో, Digiteye India బృందం ఆ వాదన యొక్క ప్రామాణికతను పరిశీలించింది. ముందుగా చిత్రంలోని పోస్ట్‌లో టైమ్‌స్టాంప్ లేదు, కానీ మస్క్ ప్రొఫైల్ ఇమేజ్ మరియు హ్యాండిల్ “@elonmusk” ఉండటం గమనించాము.

ఇంకా, వాదన/క్లెయిమ్ చేయబడిన చిత్రంలో “ఫాలో” బటన్ మాత్రమే ఉంది, కానీ మస్క్ అసలైన (Original)పోస్ట్ ఎగువ కుడి మూలలో xAI లోగోతో పాటు “సబ్‌స్క్రైబ్” బటన్‌ కూడా ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని ఇక్కడ క్రింది చిత్రాలలో స్పష్టంగా చూడవచ్చు:

మేము ఎలోన్ మస్క్ అధికారిక హ్యాండిల్‌ను పరిశీలించినప్పుడు, అతని X ఖాతాలో అలాంటి పోస్ట్ ఏది లేదు, మరియు ఈ పోస్ట్ పై ఎటువంటి వార్తా నివేదికలు లేవు. మస్క్ అటువంటి పోస్ట్‌ను X లో అధికారికంగా షేర్ చేసి ఉంటే అది వేగంగా వార్తల్లోకి వచ్చేది. కాబట్టి, ఆ వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

ఈ వీడియోలో కమలా హారిస్ ‘Xని షట్ డౌన్ చేయాలి’ అన్నారా? వాస్తవ పరిశీలన

బడ్జెట్ 2024-25 ప్రకారం, విదేశాలకు వెళ్లే వారందరికీ పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరా? వాస్తవ పరిశీలన

ఎలోన్ మస్క్ X ప్లాట్‌ఫారమ్‌లో పుష్ప-2 చిత్రం కోసం కొత్త ‘లైక్’ బటన్‌ను ప్రవేశపెట్టారా? వాస్తవ పరిశీలన

Claim: ఎలోన్ మస్క్ X ప్లాట్‌ఫారమ్‌లో లైక్ బటన్‌ను మార్చారనేది వాదన.

Conclusion: పూర్తిగా తప్పు. ఎలోన్ మస్క్ X ప్లాట్‌ఫారమ్‌లోని లైక్ బటన్‌ను మార్చలేదు మరియు యూసర్ ఎంగేజ్మెంట్ (User Engagement) పెంచడానికి చేసే ఇటువంటి ఉపాయాలకు/కార్యకలాపాలకు X వ్యతిరేమని హెచ్చరించారు.

Rating: పూర్తిగా తప్పు —

(యూసర్ ఎంగేజ్మెంట్ (User Engagement): యూసర్ ఎంగేజ్మెంట్ అనేది వెబ్‌సైట్ లేదా యాప్‌తో వినియోగదారులు ఎలా పరస్పర చర్య చేస్తారో, తరచుగా దాన్ని ఉపయోగిస్తున్నారా మరియు ఎంతకాలం వారు దానిపై ఉంటారనేది కొలిచే మెట్రిక్. )

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

***********************************************************************

భారతీయ చలనచిత్రాలు ప్రతి చిత్రానికి ఖర్చును పెంచుతున్నందున, తెలుగు నటుడు అల్లు అర్జున్ యొక్క “పుష్ప 2 చిత్రం” చుట్టూ జరుగుతున్న ప్రచారం కొత్త స్థాయికి చేరుకుంది.ఈ తీవ్ర ప్రచారం మధ్య, ఎలోన్ మస్క్ లైక్ బటన్‌ను మార్చినట్లు సూచిస్తూ Xలో సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేయబడింది.

వాదన/దావా ఇలా ఉంది: “ఇది అబద్ధం/ఫేక్ కాదు, ఎలోన్ మస్క్ ‘లైక్’ బటన్‌ను దీనికి మార్చారు❤️‍🔥 దానిపై క్లిక్ చేసి చూడండి.”

“ఎలోన్ మస్క్ నిజంగా లైక్ బటన్‌ను మార్చారు-ఇది నిజం!”,అంటూ, మరొక వినియోగదారుడు దీనికి మద్దతు తెలిపారు.


డిసెంబర్ 5, 2024, గురువారం నాడు పాన్-ఇండియా స్థాయిలో వేర్వేరు డబ్బింగ్ వెర్షన్‌లతో తెలుగు చలనచిత్రం పుష్ప 2 విడుదలైంది. ఈ సినిమా మొదటి భాగం పెద్ద హిట్ అయ్యింది మరియు దాని సీక్వెల్ కూడా ఊపందుకుంటున్నది.

వాస్తవ పరిశీలన

ఎక్స్ పాలసీలో లైక్ బటన్‌లపై అటువంటి మార్పు కోసం బృందం పరిశీలించినప్పుడు, ఎలోన్ మస్క్ ‘పుష్ప 2’ చిత్రం కోసం లైక్ బటన్‌ను మార్చలేదని మరియు అది ఫేక్ క్లెయిమ్/వాదన అని తేలింది.

బటన్‌పై ఒకరు క్లిక్ చేసినప్పుడు, అది ఆటోమేటిక్‌గా పోస్ట్‌ను ఇష్టపడుతున్నట్టు(లైక్ చేస్తున్నట్టు) తెలుపుతుంది.అంతేకాకుండా,షేర్ చేయబడిన వీడియో, లైక్ బటన్ ద్వారా ఇష్టపడేలా చేసి యూసర్ ఎంగేజ్మెంట్ పెంచడానికి చేసే మోసపూరిత ప్రక్రియ కోసం ఉద్దేశించబడింది,ఇది x విధానానికి విరుద్ధం.

ఇలాంటి కార్యకలాపాలకు/మాయలకు వ్యతిరేకంగా ఏప్రిల్‌లో ఎలాన్ మస్క్ హెచ్చరించారు.

అందువల్ల, ఈ దావా/వాదన పూర్తిగా తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

ఈ వీడియోలో కమలా హారిస్ ‘Xని షట్ డౌన్ చేయాలి’ అన్నారా? వాస్తవ పరిశీలన

బడ్జెట్ 2024-25 ప్రకారం, విదేశాలకు వెళ్లే వారందరికీ పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరా? వాస్తవ పరిశీలన

 

 

మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందా? వాస్తవ పరిశీలన

 వాదన/Claim : మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion:వాదన లేదా ఆరోపించిన విధంగా తెలంగాణలో రేషన్‌కార్డులను రద్దు చేసే ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు.

రేటింగ్: తప్పు దారి పట్టించే వార్తా-

తెలంగాణ రాష్ట్రంలో ‘ప్రజాపాలన’ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులు రద్దయ్యాయంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవస్థను పునరుద్ధరించే ప్రక్రియను ప్రారంభించినందున,వారి రేషన్ కార్డుల చెల్లుబాటు గురించి మండలాల వారీగా వివరాలను ఇస్తూ, ప్రజలలో భయాందోళనలను కలిగించే విధంగా పోస్ట్ చేయబడింది. పోస్ట్ ని ఇక్కడ చూడండి.

ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 39,270, బాలానగర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 35,210 కార్డులు రద్దయ్యాయి.

“ఇతర జిల్లాల్లో కూడా రేషన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం ఉంటుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.”

ఇది తెలుగు స్క్రైబ్ ద్వారా పోస్ట్ చేయబడింది, మరియు తెలంగాణలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఫిర్యాదులను పరిష్కరించే ప్రధాన ప్రక్రియను చేపట్టడం వలన,అలాగే దాని సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను కూడా “ప్రజాపాలన” కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకోవాలని కోరడం వలన ఇది X ప్లాట్‌ఫారమ్‌లో అనేక విమర్శలను అందుకుంది.

FACT CHECK

Digiteye India టీమ్‌ ఈ క్లెయిమ్/దవా లోని వాస్తవం పరిశీలించినప్పుడు,AIMIM నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్‌లో సమస్యను లేవనెత్తారని మరియు దావాపై సమాధానం కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ట్యాగ్ చేశారని మేము గమనించాము.దీనిపై సంబంధిత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ ఆ వాదనలో వాస్తవం లేదన్నారు.”అసాద్, రేషన్ కార్డుల రద్దు వార్త పూర్తిగా అబద్ధం. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క రేషన్ కార్డును మా ప్రభుత్వం రద్దు చేయలేదని నేను మీకు హామీ ఇస్తున్నాను” అని రాశారు.

ఆయన సమాధానం ఇక్కడ ఉంది:

Here's his reply:

ఇంకా,మేము ఇతర వార్తా సంస్థలను పరిశీలించినప్పుడు,ఇలాంటి వార్తలు ఎక్కడా ప్రచురించలేదు మరియు ఏ టీవీ న్యూస్ ఛానెల్‌ కూడా ఈ సమస్యను ప్రసారం చేయలేదు.ఇలాంటి ప్రతికూల చర్య అనేక విమర్శలను ఆకర్షించి ఉండేది ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా లక్ష మంది లబ్ధిదారులు తమ రేషన్ కార్డులను కోల్పోవడమనేది పెద్ద వార్త.

కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.

మరి కొన్ని Fact Checks:

కరోనా వైరసును ఎలా గుర్తించాలో AIIMS ఒక ప్రకటనను విడుదల చేసిందా? వాస్తవ పరిశీలన

క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో 1.5 లక్షల మంది హనుమాన్ చాలీసా పఠించారా? వాస్తవ పరిశీలన