Tag Archives: telugu fake news

ఈ వీడియోలో చూసినట్లుగా జగన్ మోహన్ రెడ్డి ఆలయ తీర్థాన్ని ‘పారేశారా’? వాస్తవ పరిశీలన

వాదన/Claim: గత 5 ఏళ్లలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో తీర్థం పారేసి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశాడని వీడియో పేర్కొంది.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం.జగన్ మోహన్ రెడ్డి చరణామృతం/తీర్థాన్ని పారబోస్తున్నట్లు చూపించే తప్పుడు వీడియో(కత్తిరించిన(cropped) వీడియో)షేర్ చేయబడింది.

రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలయ ప్రసాదం, తీర్థాన్ని పారబోస్తున్నట్లు కన్పించే ఒక వీడియోను, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి చెందిన కొందరు అనుచరులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోని ఇక్కడ చూడండి:

తెలుగులో దావా/వాదన ఈ విధంగా ఉంది: “తిరుమల లడ్డూ ప్రసాదంగా ఇస్తే, వాసన చూడటం వదిలేయటం. ఇంట్లో గుడి సెట్టింగ్ వేసుకోవటం, అక్కడ తీర్ధం ఇస్తే తాగినట్టు యాక్షన్ చేసి కింద పోసేయటం. ఏ నాడు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు ఇవ్వక పోవటం. గత 5 ఏళ్ళ వ్యక్తిగతంగా కూడా స్వామి వారిని అపవిత్రం చేసాడు జగన్ రెడ్డి.”

వాస్తవ పరిశీలన వివరాలు:

మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని నిర్వహించగా, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ,ఆయన సతీమణి వైఎస్ భారతి రెడ్డి వార్షిక సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న వీడియోకి దారి తీసింది.అది జనవరి 14, 2024న సాక్షి టీవీ అప్‌లోడ్ చేసిన ఒరిజినల్ యూట్యూబ్ వీడియో అని తేలింది.

ఈ వీడియోలో, పూజారి, జగన్ ‘కు చరణామృతం'(తీర్థం)ని ఇవ్వడం , ఆయన తాగడం 2:58 టైమ్‌స్టాంప్‌ దగ్గర స్పష్టంగా చూడవచ్చును.మరియు దక్షిణ భారతదేశంలో ఆచారం ప్రకారం అతని తల చుట్టూ తన చేతిని తిప్పాడు. కానీ వైరల్ అయిన వాదన/దావాలో షేర్ చేయబడిన వీడియో నుండి ఈ భాగం తొలగించబడింది. కత్తిరించిన(cropped) వీడియో మరియు ఒరిజినల్ వీడియో దిగువన చూసినట్లుగా YSRCP ద్వారా మళ్లీ షేర్ చేయబడింది:


అందువల్ల, X హ్యాండిల్ @JaiTDP ద్వారా చేయబడిన దావా/వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

VP నామినీ J.D. వాన్స్ పేరు ప్రకటించినప్పుడు US రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ‘ఇండియా-ఇండియా’ అన్న నినాదాలు వినిపించాయా? వాస్తవ పరిశీలన

 

పోలీసు వ్యాన్‌లో గణేశ విగ్రహం యొక్క చిత్రం తప్పుదారి పట్టించే వాదనతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim: పోలీసు వ్యాన్‌లోని వినాయకుడి విగ్రహం ఉన్న చిత్రం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కర్నాటక పోలీసులు గణేశుడిని అరెస్టు చేసినట్లుగా క్లెయిమ్ చేయబడింది.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. నిరసనకారులు గణేశుడి విగ్రహాన్ని నిషేధిత ప్రదేశానికి తీసుకురాగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, విగ్రహాన్ని వ్యాన్‌లో ఉంచారు, తరువాత అధికారులు సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు.

రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి..

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గణేష్ జీని ‘అరెస్టు’ చేసిందన్న వాదనతో పోలీస్ వ్యాన్‌లో వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్తున్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది మరియు హిందువులు ‘అవమానించబడటానికి కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేస్తారు’ అనే ప్రశ్నతో ఆ చిత్రాన్ని పోస్ట్ చేయబడింది.
X.comలో వాదన/దావాలను ఇక్కడ చూడండి:

The claim reads in Hindi: “कर्नाटक पुलिस ने श्री गणेश जी को हिंदू कार्यकर्ताओ के साथ हिरासत मे ले लिया
ये गिरफ्तारियां नाग मंगला मे गणेश जुलूस पर कट्टरपंथियो द्वारा किए गए पथराव की निंदा करते हुए विरोध प्रदर्शन के बाद हुईं
अभी भी समय है जाग जाओ हिंदुओ नही तो यही हाल पूरे देश मे होगा?”

తెలుగు అనువాదం ఇలా ఉంది: కర్ణాటక పోలీసులు హిందూ కార్యకర్తలతో పాటు శ్రీ గణేష్ జీని అదుపులోకి తీసుకున్నారు. నాగ్ మంగళాలో జరిగిన గణేష్ ఊరేగింపుపై జరిగిన రాళ్ల దాడిని ఖండిస్తూ నిరసనలు తెలిపిన తర్వాత అరెస్టులు జరిగాయి. సమయం మించిపోలేదు, హిందువులారా మేల్కోండి లేకపోతే దేశం మొత్తం ఇదే పరిస్థితి అవుతుంది.

 

వాదనలు/దావాలు ఇక్కడ మరియు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

వాస్తవ పరిశీలన వివరాలు

మొదట, మేము సంఘటన గురించి వివిధ వార్తా నివేదికలు పరిశీలించగా, కర్ణాటకలో గణేష్ పూజను ఎప్పుడూ నిషేధించలేదనే విషయాన్నీ కనుగొన్నాము. రెండవది, పోలీసు వ్యాన్‌లో గణేష్ విగ్రహాన్ని ఎందుకు తీసుకెళ్లాసిన అవసరం వచ్చిందో వార్తలు నివేదికలు(ఇక్కడ మరియు ఇక్కడ) వెల్లడించాయి.

దీని వెనక నేపధ్యం:

సెప్టెంబరు 11 న చెలరేగిన మతపరమైన అల్లర్లను అనుసరించి, కర్ణాటకలోని మాండ్య జిల్లా నాగమంగళలో గణేష్ చతుర్థి ఊరేగింపును మసీదు ముందు చాలా సమయం పాటు నిలిపివేసినప్పుడు, కర్ణాటక పోలీసులు 55 మందిని అరెస్టు చేసి రాష్ట్రవ్యాప్తంగా నిషేధాజ్ఞలు విధించారు. అరెస్టులు జరిగిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు నిరసనలకు దిగారు.

అసలేం జరిగింది?

సెప్టెంబరు 13, 2024న, బెంగుళూరు టౌన్ హాల్ సమీపంలో మాండ్య మత హింసపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ, ఆ ప్రదేశంలో నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ, అలాంటి ఒక నిరసన ప్రదర్శన జరిగింది. నిరసనకారులలో ఒక వ్యక్తి గణేశ విగ్రహాన్ని పట్టుకొని ఉన్నందున, పోలీసులు అతనితో పాటు ఇతరులను అదుపులోకి తీసుకున్నారు మరియు అతను పట్టుకున్న విగ్రహాన్ని ఖాళీ పోలీసు వ్యాన్‌లో ఉంచగా, ఇది గణేశుడిని అరెస్టు చేసినట్లు తప్పుడు వాదనకు దారితీసింది.

ఫ్రీడమ్ పార్క్ వద్ద మాత్రమే నిరసనలకు అనుమతించబడిందన్న కర్ణాటక హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ బెంగళూరులోని టౌన్ హాల్‌లో ఆందోళనకారులు సమావేశమయ్యారని బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు. బెంగళూరు సెంట్రల్ డివిజన్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (DCP), శేఖర్ హెచ్. టెక్కన్నవర్ మీడియాతో ఇలా అన్నారు: “సెప్టెంబర్ 13, 2024న, నాగమంగళ గణేష్ ఊరేగింపు ఘటనపై హిందూ సంఘాలు హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ బెంగళూరులోని టౌన్ హాల్‌ దగ్గర నిరసన తెలిపాయి. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. గణపతి విగ్రహాన్ని అధికారులు పూజలతో సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు.

కాబట్టి, ఈ దావా తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

VP నామినీ J.D. వాన్స్ పేరు ప్రకటించినప్పుడు US రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ‘ఇండియా-ఇండియా’ అన్న నినాదాలు వినిపించాయా? వాస్తవ పరిశీలన

 

సెప్టెంబరు 10న ట్రంప్‌తో ప్రెసిడెన్షియల్ డిబేట్ సమయంలో కమలా హారిస్ తన చెవిపోగుల్లో ‘ఇయర్‌పీస్’ పెట్టుకున్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: సెప్టెంబరు 10 ప్రెసిడెన్షియల్ డిబేట్ సందర్భంగా డెమోక్రటిక్-నామినీ కమలా హారిస్ NOVA H1 వైర్‌లెస్ ఇయర్‌పీస్ ధరించారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన. సెప్టెంబరు 10న చర్చకు హారిస్ ధరించిన చెవిపోగులు ఆమె పాత ఆభరణాలలోనివి మరియు వాదన చేయబడినట్లు NOVA H1 ఇయర్‌పీస్‌లు కాదు.అలాగే, ఆ ​​చెవిపోగులు తమ హెచ్1 ఆడియో ఇయర్ రింగ్స్ కాదని “ఐస్‌బాచ్ సౌండ్ సొల్యూషన్స్” కూడా స్పష్టం చేసింది.

రేటింగ్/Rating:తప్పు దారి పట్టించే వాదన. —

డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ మరియు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య సెప్టెంబర్ 10, 2024న జరిగిన US ప్రెసిడెన్షియల్ డిబేట్/చర్చ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశంగా మారింది.అయితే, సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఒక వాదన ఆసక్తికరంగా మారింది. కమలా హారిస్ చెవిపోగులో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ను పొందుపరిచినట్లు ఒక కథనం.

చర్చ నిబంధన ప్రకారం, ABC న్యూస్ నిర్వహించే చర్చలో అభ్యర్థులు విరామ సమయంలో ఆధారాలు,చర్చకు సంబంధించి ముందుగా వ్రాసిన పెట్టుకున్న పంక్తులు లేదా వారి ప్రచార సిబ్బందితో పరస్పర చర్యకు అనుమతించబడరు.

సోషల్ మీడియా లో పోస్ట్ ఈ విధంగా ఉంది:

ఆమె ఒక విధమైన ఇయర్‌పీస్‌ని వింటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

అందుకే నిన్న రాత్రి జరిగిన #PresidentialDebateని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

మీరు ఏమనుకుంటున్నారు??

 

It has been widely shared and can be accessed here and here.

 

FACT CHECK

Digiteye India బృందం వాట్సాప్‌లో వాస్తవ పరిశీలన అభ్యర్థనను స్వీకరించినప్పుడు,మేము కమలా హారిస్ చెవిపోగుల కోసం X లో పరిశీలించగా,అవి చెవిపోగులు పాతవని, ఆమె గతంలో చాలాసార్లు ధరించారని తేలింది. వాదన ప్రకారం ఇయర్‌పీస్ నోవా హెచ్1 అని, మ్యూనిచ్ ఆధారిత “ఐస్‌బాచ్” సౌండ్ సొల్యూషన్స్ విక్రయిస్తున్నందున, మేము ఇయర్ రింగ్‌ల వివరాల కోసం మరింత అన్వేషించగా, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు ఒక జత ముత్యాల చెవిపోగులలో పొందుపరిచినట్లు కనుగొన్నాము..

అయితే, ఐస్‌బాచ్ సౌండ్ సొల్యూషన్స్ సంస్థ, సెప్టెంబర్ 13న ఒక పత్రికా ప్రకటనలో, చర్చలోని ఫోటోల విశ్లేషణ ఆధారంగా, “ఇవి మా H1 ఆడియో ఇయర్ రింగ్‌లు కాదని మేము నిర్ధారణకు వచ్చాము” అని తెలిపింది.

Xలోని ఒక వినియోగదారు హారిస్‌ ధరించిన చెవిపోగుల వంటి మరొక “టిఫనీ” చెవిపోగుల ఫోటోను షేర్ చేసారు, ఇది $3,300 కంటే ఎక్కువ ధర చేయబడుతుంది కానీ టిఫనీ వెబ్‌సైట్‌లో ఇప్పుడు అందుబాటులో లేదు.

చర్చకు ముందు కూడా హారిస్ ఇవే చెవి రింగులు ధరించినట్లు మేము కనుగొన్నాము. వైట్ హౌస్‌లో ఏప్రిల్లో జరిగిన ఈవెంట్, ఫిలడెల్ఫియాలో మేలో జరిగిన క్యాంపెయిన్ ఈవెంట్, మరియు జూన్ 2024లో జరిగిన కన్సర్ట్/కచేరీలోని రాయిటర్స్ ఫోటోలు చూడవచ్చు. చర్చ జరిగిన తర్వాత కూడా, ఆమె 9/11 దాడుల 23వ వార్షికోత్సవ వేడుకకు హాజరైనప్పుడు వాటిని ధరించడం కనిపించింది.

అంతేకాదు, ప్రెసిడెన్షియల్ డిబేట్/చర్చ సమయంలో అభ్యర్థులు ఇయర్‌పీస్‌ను ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు
రావడం కొత్తేమీ కాదు.2020లో అప్పటి డెమోక్రటిక్ అభ్యర్థి బిడెన్‌పై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. 2016లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి.

కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

VPనామినీ J.D. వాన్స్ పేరు ప్రకటించినప్పుడు US రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ‘ఇండి77యా-ఇండియా’ అన్న నినాదాలు వినిపించాయా? వాస్తవ పరిశీలన

ఈ వీడియోలో కమలా హారిస్ ‘Xని షట్ డౌన్ చేయాలి’ అన్నారా? వాస్తవ పరిశీలన

కమలా హారిస్‌ అమెరికా యొక్క సహజసిద్దమైన పౌరురాలు కాదా? US ప్రెసిడెంట్ అభ్యర్థి యొక్క అర్హతపై వాదన మళ్లీ తెరపైకి వచ్చింది; వాస్తవ పరిశీలన

 

ఈ వీడియోలో కమలా హారిస్ ‘Xని షట్ డౌన్ చేయాలి’ అన్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: X ప్లాట్‌ఫారమ్‌ను మూసివేయాలని(షట్ డౌన్) కమలా హారిస్ అన్నారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. ట్రంప్ యొక్క ట్విట్టర్ ఖాతా రద్దుపై చేసిన పాత ఇంటర్వ్యూ వీడియోను, హారిస్ Xని మూసివేయాలని కోరుతున్నట్లు తప్పుగా షేర్ చేయబడింది.

రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం–

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఎక్స్ ఓనర్ ఎలోన్ మస్క్ గురించి మాట్లాడుతూ ఆయన తన ఎక్స్ షట్ డౌన్ చేయాలని చెప్పినట్లు ఒక వీడియో షేర్ చేయబడుతోంది.

“ఆయన తన అధికారాలను కోల్పోయారు మరియు తన Xని షట్ డౌన్ చేయాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, Facebook కోసం ఒక నియమం మరియు Twitter కోసం వేరే నియమం ఉంది. ఈ సోషల్ మీడియా సైట్‌ల యొక్క శక్తి సామర్ధ్యాలని అర్థం చేసుకోవడానికి వాటిపై ఒక బాధ్యత ఉంచబడాలి.వారు ఎటువంటి విధమైన పర్యవేక్షణ లేదా నియంత్రణ లేకుండా లక్షలాది వ్యక్తులతో నేరుగా మాట్లాడుతున్నారు, అది ఆపివేయాలి” అని హారిస్ వీడియోలో చెప్పడం చూడవచ్చు.

“ఇది X ప్లాట్ఫారం లో వాక్ స్వాతంత్య్రాన్ని నియంత్రించే ప్రయత్నమంటూ” ఇక్కడ షేర్ చేయబడింది.

FACT CHECK

మేము కీలక ఫ్రేమ్‌లను తీసుకొని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, X (గతంలో ట్విట్టర్)నుండి అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను తీసివేయడంపై CNN హోస్ట్ జేక్ తాపర్‌తో హారిస్ 2019లో మాట్లాడుతున్నప్పటి వీడియో అని కనుగొన్నాము, మరియు అది కమల హారిస్ CNNకు ఇచ్చిన అక్టోబర్ 2019 నాటి ఇంటర్వ్యూలో ట్రంప్ యొక్క X అధికారిక ఖాతాను సస్పెండ్ చేసిన సందర్భంలో మాట్లాడిన వీడియో క్లిప్ అని ఫలితాలు వెల్లడయ్యాయి. అసలు/ఒరిజినల్ ఇంటర్వ్యూని ఇక్కడ చూడండి:

ఇంటర్వ్యూలో చిన్న మార్పులు చేయబడి, హారిస్ ఎన్నికైన తర్వాత ఆమె Xని మూసివేస్తారని వాదన చేయబడింది. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వీడియో క్లిప్, అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌ను(ప్రస్తుతం X ప్లాట్‌ఫారమ్) ఉపయోగించడం గురించి హారిస్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన 2019 నాటి ఇంటర్వ్యూ వీడియో క్లిప్ నుండి తీసుకోబడింది. అందువల్ల, హారిస్ తన ప్రచారంలో ఇప్పటివరకు Xని మూసివేయడం గురించి ఎటువంటి ప్రకటనలు చేయలేదు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

VPనామినీ J.D. వాన్స్ పేరు ప్రకటించినప్పుడు US రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ‘ఇండి77యా-ఇండియా’ అన్న నినాదాలు వినిపించాయా? వాస్తవ పరిశీలన

కమలా హారిస్‌ అమెరికా యొక్క సహజసిద్దమైన పౌరురాలు కాదా? US ప్రెసిడెంట్ అభ్యర్థి యొక్క అర్హతపై వాదన మళ్లీ తెరపైకి వచ్చింది; వాస్తవ పరిశీలన

 

 

ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు వేయడానికి ముందు వినేష్ ఫోగట్ 2.1 కిలోల బరువు ఎక్కువగా ఉందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ అనుమతించదగిన పరిమితి కంటే 2.1 కిలోల బరువు ఎక్కువగా ఉండటంతో ఒలింపిక్స్ ఫైనల్‌లో అనర్హతకు గురైందనేది వాదన.

నిర్ధారణ /Conclusion:తప్పు దారి పట్టించే వాదన. వినేష్ ఫోగట్ తన బరువు కేటగిరీలో 50 కిలోల పరిమితి కంటే కేవలం 100 గ్రాముల బరువు మాత్రమే ఎక్కువగా ఉండటం వలన అనర్హురాలయ్యారు.

రేటింగ్/Rating: :తప్పు దారి పట్టించే వాదన —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

భారతీయ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్ 2024 పారిస్ ఒలింపిక్స్ లో విజయవంతమైన బౌట్‌లు సాధించడంతో ఆగస్టు 6,2024న ముఖ్యాంశాలుగా మారి అందరి దృష్టి అమెపై పడింది. అయితే మరుసటి రోజు ఉదయం ఆమె అధిక బరువు కారణంగా ఫైనల్‌లో పాల్గొనేందుకు అనర్హురాలంటూ  దిగ్భ్రాంతికరమైన న్యూస్ వెలువడింది.

ఎక్కువ వివరాలను చెప్పకుండా వినేష్ ఫోగట్ తన 50 కిలోల బరువు కేటగిరీలో “కేటగిరీ” కంటే కొంచెం ఎక్కువని IOA అధికారికంగా పేర్కొంది.

“ఆమె 2.1 కిలోల అధిక బరువుతో ఉంది. 2 కిలోలు అనుమతించదగిన పరిమితి. వినేష్ 2 కిలోలు + 100 గ్రాముల బరువుతో ఉన్నారు” అని సోషల్ మీడియాలో వాదన/దావా పోస్ట్ చేయబడింది.

వినేష్ ఫోగట్ 50 కిలోల పరిమితి కంటే 2.1 కిలోల బరువు ఎక్కువగా ఉన్నారని, అందువల్ల అనర్హురాలంటూ పేర్కొంటూ సోషల్ మీడియా మొదట పోస్ట్‌లు వైరల్ అయ్యాయి.

FACT-CHECK

ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ (IOA) అధికారిక ప్రకటన ప్రకారం, రెజ్లర్ “50 కిలోల కంటే కొన్ని గ్రాముల బరువు కలిగి ఉన్నారు”, ఇది ఆమె అనర్హతకు దారితీసింది.
Xలో IOA ఇలా పేర్కొంది: “ఉమెన్స్ రెజ్లింగ్ 50 కిలోల విభాగం నుండి వినేష్ ఫోగాట్ యొక్క అనర్హత వార్తను భారత బృందం తెలియపరచడం విచారకరం. రాత్రంతా బృందం ఎంత శ్రమించినప్పటికీ, ఆమె ఈ ఉదయం 50 కిలోల కంటే కొన్ని గ్రాముల అధిక బరువుతో ఉంది”.

భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ బరువు సమస్య ఆమె అనర్హతకు దారితీసిందని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పార్దివాలా ఒక ప్రకటనలో వివరించారు.
ఈ ప్రకటనలో, పార్దివాలా మాట్లాడుతూ, “”అయితే, వినేష్ తన 50 కిలోల బరువు కంటే 100 గ్రాములు అధిక బరువు ఉన్నట్లు కనుగొనబడటంతో ఆమెపై అనర్హత వేటు పడింది.ఆమె జుట్టు కత్తిరించడం సహా అన్ని కఠినమైన చర్యలు ప్రయత్నించినప్పటి ఆమె అనుమతించబడిన 50 కిలోల బరువుకు రాలేక పోయింది.

మరియు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి కూడా పార్లమెంటులో తన ప్రకటనలో ఈ క్రింది విధంగా చెప్పారు:


అందువల్ల, వినేష్ ఫోగట్ 50-కిలోల పరిమితి కంటే 2.1 కిలోల బరువు ఎక్కువగా ఉన్నారనే వాదన నిరాధారమైనది మరియు తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

మీ లిప్ స్టిక్ కోచినియల్ బగ్స్ నుండి తీసిన రంగుతో తయారు చేయబడిందా? వాస్తవ పరిశీలన

IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జరిమానా విధించబడుతుందా? వాస్తవ పరిశీలన

 

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులను BBC కవర్ చేయలేదా? వాస్తవ పరిశీలన

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత హింసాత్మక అల్లర్ల చెలరేగి, అనేక ఫిర్యాదులు మరియు ఎదురు ఫిర్యాదులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందులో ఒకటి బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసను కవర్ చేయడంలో బీబీసీ(BBC) విఫలమైందనే వాదనతో ఒక వీడియో షేర్ చేయబడుతోంది.

వీడియోతో కూడిన దావా ఇలా ఉంది: “బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసను కవర్ చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి నేను BBC న్యూస్ వెబ్‌సైట్‌కి వెళ్లాను. లేదు. దురదృష్టమైన వాస్తవం ఏమిటంటే దురాక్రమణదారులు ఇస్లామిక్ తీవ్రవాదులు. @elonmusk & @X కు ధన్యవాదాలు, వారి దుస్థితిని ప్రచారం చేయవచ్చు.”

సత్య పరిశీలన వివరాలు

BBC దక్షిణాసియాలో విస్తృత కవరేజీ రికార్డు కలిగిన గ్లోబల్ మీడియా అవుట్‌లెట్. కాబట్టి,బంగ్లాదేశ్ హింస యొక్క వార్తని BBC ప్రసారం చేసిందా, లేదాని Digiteye India బృందం పరిశీలించగా, Google మరియు Youtubeలో క్రింది ఫలితాలను సూచించింది. సోషల్ మీడియాలో క్లెయిమ్ షేర్ చేయబడిన రోజు కంటే ఒక రోజు ముందు అంటే 7 ఆగస్టు 2024న ప్రచురించబడిన BBC కథనం ఇక్కడ ఉంది.

ఇది బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులపై కరస్పాండెంట్ ఇచ్చిన కధనమని స్పష్టంగా తెలుస్తుంది. మరొక కథనం, హిందువులపై దాడులకు సంబంధించిన BBC వాస్తవిక పరిశీలన ఇక్కడ అందూబాటులో ఉంది.

అదనంగా, ఇక్కడ చూసినట్లుగా BBC వీడియోలు కూడా దాడులకు సంబంధించిన వార్తలను ప్రసారం చేశాయి.

కాబట్టి, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులను బిబిసి కవర్ చేయలేదన్న వాదన తప్పుదారి పట్టించే విధంగా ఉంది.

వాదన/Claim:బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసను కవర్ చేయడంలో బిబిసి విఫలమైందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన/దావా. BBC బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులను వార్తా కథనం మరియు వీడియో రూపంలో కవర్ చేసింది.

రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన/దావా —

మరి కొన్ని సత్య పరిశీలన కధనాలు:

కమలా హారిస్‌ అమెరికా యొక్క సహజసిద్దమైన పౌరురాలు కాదా? US ప్రెసిడెంట్ అభ్యర్థి యొక్క అర్హతపై వాదన మళ్లీ తెరపైకి వచ్చింది; వాస్తవ పరిశీలన

రేపటి నుంచి ఉచిత విద్యుత్ సబ్సిడీ ఆగిపోతుందని ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించారా? వాస్తవ పరిశీలన

 

 

బడ్జెట్ 2024-25 ప్రకారం, విదేశాలకు వెళ్లే వారందరికీ పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: 2024-25 బడ్జెట్ నియమాల ప్రకారం, విదేశాలకు వెళ్లే వ్యక్తులందరూ అక్టోబర్ 1, 2024 నుండి ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందాలనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పన్ను వ్యాజ్యం లేదా బాధ్యతలు/ బకాయిలు(tax litigation or liabilities) రూ.10 లక్షలు కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న భారతీయ పౌరులకు విదేశాలకు వెళ్లే ముందు మాత్రమే అవసరం.

రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

బడ్జెట్ 2024-25 సమావేశం తర్వాత, అనేక వాదనలు చుట్టుముట్టాయి మరియు భారతీయ పౌరులందరూ విదేశాలకు వెళ్లే ముందు ఆదాయపు పన్ను అధికారుల నుండి పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందాలని పేర్కొంది. కొత్త నిబంధన అక్టోబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తుందని పేర్కొంది.

బిజినెస్ టుడే న్యూస్ రిపోర్ట్‌ ద్వారా X లో ఈ దావా వైరల్ అయ్యింది, “ఫైనాన్స్ బిల్లు 2024, భారతదేశంలో నివాసం ఉండే ఏ వ్యక్తి అయినా దేశం విడిచి వెళ్లాలంటే ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ తప్పనిసరి” అని పేర్కొంది.

వాదన/దావాలు ఇక్కడ మరియు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

FACT CHECK

బడ్జెట్ 2024-25 సమావేశాలలో IT క్లియరెన్స్ సర్టిఫికేట్ జారీ చేయబడింది. బడ్జెట్ 2024-25 ప్రకారం, భారతదేశంలో నివసించే వ్యక్తులు దేశం విడిచి వెళ్లే ముందు అన్ని పన్ను బకాయిలు మరియు ‘క్లియరింగ్ సర్టిఫికేట్‌లు’ పొందవలసి అవసరం ఉందని కొత్త చట్టం చెబుతోంది.

సోషల్ మీడియాలో కొత్త నిబంధనపై చర్చలు/వాదనలు జరిగిన తర్వాత, ఈ కొత్త నిబంధన ప్రకారం వ్యక్తులందరూ పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది, అయితే ఆదాయపు పన్ను శాఖ ముందు పెండింగ్‌లో ఉన్న ఆర్థిక అవకతవకలు లేదా ప్రధాన పన్ను బకాయిలు ఉన్నవారికి ఇది వర్తిస్తుంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆగస్టు 20, 2024 నాటి తన ప్రకటనలో ప్రతి వ్యక్తి ఈ సర్టిఫికేట్ పొందాల్సిన అవసరం లేదని, ఆర్థిక అవకతవకలు ఉన్నవారికి లేదా రూ. 10 లక్షల కంటే ఎక్కువ ప్రత్యక్ష పన్ను బకాయిలు ఉన్నవారికి మాత్రమే ఈ సర్టిఫికేట్ అవసరం అని స్పష్టం చేసింది.

ప్రకటన ఇలా పేర్కొంది, “… CBDT, దాని సూచన సంఖ్య. 1/2004, తేదీ 05.02.2004 ప్రకారం, చట్టంలోని సెక్షన్ 230(1A) కింద పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్‌ను భారతదేశంలో నివాసముంటున్న వ్యక్తులు కింది పరిస్థితులలో మాత్రమే పొందవలసి అవసరం ఉంటుందని పేర్కొంది:

–వ్యక్తి తీవ్రమైన ఆర్థిక అవకతవకలకు పాల్పడి, మరియు “ఆదాయపు పన్ను చట్టం లేదా సంపద-పన్ను చట్టం” కింద కేసుల దర్యాప్తులో అతని అవసరం మరియు అతనిపై పన్ను చెల్లించాలనే ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్న సందర్భాలలో
 (లేదా)
— రూ.10 లక్షలు కంటే ఎక్కువ మొత్తంలో ప్రత్యక్ష పన్ను బకాయిలు వ్యక్తిపై ఉన్నపుడు

అందువల్ల, విదేశాలకు వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ ఐటి క్లియరెన్స్ సర్టిఫికేట్( IT Clearance Certificate ) పొందాలనే వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జరిమానా విధించబడుతుందా? వాస్తవ పరిశీలన

సైనికుల (అగ్నివీర్స్) రిక్రూట్ కోసం అగ్నిపథ్ పథకం కొన్ని మార్పులతో మళ్లీ ప్రారంభించబడిందా? వాస్తవ పరిశీలన-వీడియో

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారతదేశం మాల్దీవుల నుండి 28 దీవులను కొనుగోలు చేసిందని మరియు అధ్యక్షుడు ముయిజు వాటిని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు అప్పగించారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన/దావా. భారతదేశం ఎప్పుడూ కూడా 28 దీవులను కొనుగోలు చేయలేదు కానీ మాల్దీవులు ఆ దీవులపై నీరు మరియు మురుగునీటి ప్రాజెక్టుల అమలు కోసం భారతదేశానికి అప్పగించింది.

రేటింగ్/Rating: తప్పు దారి పట్టించే వాదన/దావా —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

మాల్దీవులలో ప్రభుత్వం మారినప్పటి నుండి,  ద్వైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి, అయితే ఇటీవల, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ద్వీప దేశాన్ని సందర్శించారు మరియు చైనా అనుకూల నేతగా కనిపించే మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఆధ్వర్యంలోని కొత్త ప్రభుత్వంతో అనేక ఒప్పందాలను కుదుర్చుకున్నారు.

జైశంకర్ సందర్శన తర్వాత, ద్వీపసమూహ రాష్ట్రం(మాల్దీవులు) నుండి భారతదేశం 28 ద్వీపాలను “కొనుగోలు చేసింది” అనే వాదనతో సోషల్ మీడియా పోస్ట్‌లు వెలువడ్డాయి.

ఇతర X వినియోగదారులు, “భారతదేశం మాల్దీవుల నుండి 28 దీవులను కొనుగోలు చేసింది. మాల్దీవులు తన 28 దీవులను భారతదేశానికి అప్పగించింది. అధ్యక్షుడు ముయిజు స్వయంగా ఒప్పందంపై సంతకం చేశారు” అని పోస్ట్ చేసారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రధాని మోదీ లక్షద్వీప్ దీవులను సందర్శించడాన్ని ప్రస్తావిస్తూ, “50 మీటర్ల నడక మరియు ఒక ట్వీట్ యొక్క అద్భుతం”, అని మరొక మరో వినియోగదారు పోస్ట్ చేసారు.

 

 

అదే దావా/వాదన ఇక్కడ షేర్ చేయబడుతోంది:

వాస్తవ పరిశీలన వివరాలు:

భారతదేశం,దీవులను కొనుగోలు చేయడం గతంలో ఎన్నడూ జరగలేదు కాబట్టి, Digiteye India బృందం సంబంధిత సమాచారం కోసం Googleలో అన్వేషించగా, అది తప్పుదారి పట్టించే దావా అని కనుగొన్నారు. మాల్దీవులు చైనాతో దగ్గరి సంబంధాలు ఏర్పరుచుకుంటున్న తరుణంలో జైశంకర్ మూడు రోజుల పర్యటన కీలకమైన సమయంలో జరిగిందని వార్తా నివేదికలు వెల్లడించాయి.

వాస్తవానికి, భారతదేశం గతంలో మాల్దీవుల ప్రభుత్వంతో 28 దీవులలో అనేక నీరు మరియు మురుగునీటి ప్రాజెక్టులను అమలు చేయడానికి ప్రతిపాదించింది.  భారత విదేశాంగ మంత్రి పర్యటన ఈ ప్రాజెక్టులను ఖరారు చేసింది మరియు తదనుగుణంగా, ద్వీప దేశం యొక్క అత్యవసరమైన అవసరాలను అందించడానికి నీటి ప్రాజెక్టుల అమలు కోసం మాల్దీవుల ప్రభుత్వం ఆ దీవులను అప్పగించింది.

వార్తా కథనాలను ధృవీకరిస్తూ జైశంకర్ తన ట్వీట్లలో కూడా ప్రాజెక్ట్స్ ల ప్రస్తావన ప్రకటించారు:

ప్రెసిడెంట్ ముయిజ్జూతో కలిసి జై శంకర్ మాల్దీవుల్లో నీరు మరియు మురుగునీటి నెట్‌వర్క్‌ను ప్రారంభించినట్లు వార్తా నివేదిక పేర్కొంది.
ఈ ప్రాజెక్ట్ మాల్దీవులలోని 28 దీవులను కలుపుతుంది మరియు అవి ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్ రుణాల సహకారంతో నిర్మించబడ్డాయి. అదనంగా, భారతదేశం మానసిక ఆరోగ్యం, వీధి దీపాల వంటి ఇతర సమాజ-కేంద్రీకృత ప్రాజెక్టులను చేపట్టింది.

మాల్దీవుల ప్రెసిడెంట్ మియుజు కూడా ఈ సంఘటన గురించి ట్వీట్ చేశారు మరియు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

కాబట్టి, ఈ దీవులను నీరు మరియు మురుగునీటి ప్రాజెక్టులను అమలు చేయడానికి అప్పగించినందున, భారతదేశం ఈ 28 దీవులను కొనుగోలు చేసిందనే వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జరిమానా విధించబడుతుందా? వాస్తవ పరిశీలన

సైనికుల (అగ్నివీర్స్) రిక్రూట్ కోసం అగ్నిపథ్ పథకం కొన్ని మార్పులతో మళ్లీ ప్రారంభించబడిందా? వాస్తవ పరిశీలన-వీడియో

ఏనుగులు 1 గంట ముందే వాయనాడ్ కొండచరియలను పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశాయా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఏనుగులు 1 గంట ముందే వాయనాడ్ కొండచరియలను పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశాయనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. దావా చేయబడిన వీడియో జనవరి 2024 నాటి పాత వీడియో, మరియు జూలై 30, 2024న వాయనాడ్ కొండచరియలు విరిగిపడడానికి ఒక గంట ముందు జరిగిన సంఘటన కాదు.

రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటానికి ముందు ఏనుగుల గుంపు సురక్షిత ప్రాంతానికి పరుగెడుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

వీడియో క్లిప్ఈ విధంగా షేర్ చేయబడింది: “కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటానికి 1 గంట ముందు ఏనుగులు సురక్షిత ప్రాంతానికి పరుగెత్తుతున్నాయి. జంతువులకు సూక్ష్మ దృష్టి ఉంటుంది.”

(సూక్ష్మ దృష్టి(subtle vision)అనేది భౌతిక కంటికి కనిపించని వస్తువులను/పరిస్థితులను చూడగల/పసిగట్టగల అంతర్గత భావం లేదా దృష్టి.)

జూలై 30, 2024న సంభవించిన విషాదకరమైన కొండచరియలను జంతువులు ఒక గంట ముందే పసిగట్టాయని మరియు జంతువులకు ప్రకృతి వైపరీత్యాల గురించి సూక్ష్మ దృష్టి ఉంటుందని దావా/ వాదన చేయబడింది. వాదనలు ఇక్కడ మరియు ఇక్కడ Xలో అందుబాటులో ఉన్నాయి.

వాస్తవ పరిశీలన వివరాలు:

మేము(DigitEye India బృందం) వీడియో నుండి కొన్ని కీలక ఫ్రేమ్‌లను తీసుకొని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో పరిశీలించగా ఈ వీడియో క్లిప్ నాలుగు నెలల క్రితం 2024లో అప్‌లోడ్ చేయబడిన @TravelwithAJ96 యొక్క Youtube ఛానెల్లోనిదని తెలుసుకున్నాము.

ఇదే వీడియోని Instagramలో @wayanadan మరియు jashir.ibrahim ద్వారా జనవరి 12, 2024న “కేవలం 900 కండి విషయాలు…” అనే శీర్షికతో చూడవచ్చు.

క్లెయిమ్ చేసినట్లుగా ఏనుగులు వాయనాడ్ కొండచరియలు విరిగిపడటానికి(జూలై 30, 2024) ఒక గంట ముందు కాక, జనవరి 2024లో సురక్షిత ప్రాంతానికి పరుగెత్తుతున్నాయని ఒరిజినల్ వీడియో క్లిప్ స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి, ఈ వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

మీ లిప్ స్టిక్ కోచినియల్ బగ్స్ నుండి తీసిన రంగుతో తయారు చేయబడిందా? వాస్తవ పరిశీలన

IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జరిమానా విధించబడుతుందా? వాస్తవ పరిశీలన

 

ఇటీవల భారీ వర్షాల వలన ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియాను అలలు తాకుతూ ఆ ప్రాంతమంతా జలమయం అయిందా?వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఇటీవల భారీ వర్షాల వలన ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియాను అలలు తాకుతూ ఆ ప్రాంతమంతా జలమయం అయిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. ఇది మే 2021లో ముంబయిలో తుఫాను “తౌక్టే” గేట్‌వే ఆఫ్ ఇండియాను తాకుతున్న పాత వీడియో, కానీ ముంబైలో సంభవించిన ఇటీవల వరదల కారణంగా జరిగిన సంఘటనగా షేర్ చేయబడింది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

ప్రతి సంవత్సరం, ముంబై నగరంలో భారీ వర్షాలు కురిసిన తర్వాత ప్రాంతాలన్నీ జలమయంగా మారి, అనేక రోడ్లు మరియు నివాస ప్రాంతాలు నీటిలో మునిగిపోయినట్లు చూపే చిత్రాలు మరియు వీడియోలు అనేకం చూడవచ్చు. ఇలాంటి నేపథ్యంలో ఐకానిక్ స్మారక చిహ్నమైన గేట్‌వే ఆఫ్ ఇండియాను తాకుతున్న సముద్రపు అలలు మరియు మొత్తం ప్రాంతమం

వాదన/దావా ప్రకారం, “గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద భారీ వర్షపాతం”, ఇది జూలై 22, 2024న షేర్ చేయబడింది.

“భూమి మరియు సముద్ర మట్టం ఒకటే.ఈ వీడియో తాజ్‌మహల్ హోటల్, గేట్‌వే ఆఫ్ ఇండియా, ముంబై” అనే శీర్షికతో అదే వీడియోను జూలై 27, 2024న Xలోషేర్ చేయబడింది.

FACT-CHECK

Digiteye India బృందం వాస్తవ పరిశీలన కావించగా, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో గేట్‌వే ఆఫ్ ఇండియాను తాకుతున్న తరంగాలను చూపుతున్న కీ ఫ్రేమ్‌ను సెర్చ్ చేయడం ద్వారా, ఆ వీడియో మే 2021లో టౌక్టే తుఫాను కారణంగా ముంబైలో భారీ వర్షాలు కురిసినప్పుడు షేర్ చేసిన పాత వీడియో అని తేలింది.ఇది మే 18, 2021న ట్విట్టర్‌లో షేర్ చేయబడింది.

ఈ వీడియో మే 2021లో తుఫాను బారిన పడిన ముంబైకి సంబంధించినదని వార్తా నివేదికలు కూడా ధృవీకరించాయి.ఇది మే 2021లో ముంబయిలో తుఫాను “తౌక్టే” గేట్‌వే ఆఫ్ ఇండియాను తాకుతున్న పాత వీడియో. కావున, గత వారం జులై 21 నుండి 27, 2024 వరకు నగరంలో భారీ వర్షాలు కురవడంతో గేట్‌వే ఆఫ్ ఇండియా వరదలకు గురైందని చూపుతున్న వీడియో తప్పు.

 

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జరిమానా విధించబడుతుందా? వాస్తవ పరిశీలన

సైనికుల (అగ్నివీర్స్) రిక్రూట్ కోసం అగ్నిపథ్ పథకం కొన్ని మార్పులతో మళ్లీ ప్రారంభించబడిందా? వాస్తవ పరిశీలన-వీడియో