Tag Archives: telugu fact check

Fact Check: డిసెంబర్ 28న మైక్రోసాఫ్ట్ ‘ జాపనీస్ కంపెనీ సోనీ మరియు సోనీ ప్లేస్టేషన్’ను కొనుగోలు చేసినట్టు ఒక వాదన

హిస్పానిక్స్‌కు(Hispanics) చెందిన స్పానిష్ వెబ్‌సైట్ డిసెంబర్ 28, 2020న గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జపనీస్ కంపెనీ సోనీని, దాని అనుబంధ వ్యాపారాలు మరియు ప్లేస్టేషన్‌తో సహా $130 బిలియన్లకు కొనుగోలు చేసిందని పేర్కొంటూ బ్రేకింగ్ న్యూస్‌ను విడుదల చేసింది.

వెబ్‌సైట్లో ముఖ్యంశం ఇలా ఉంది: “ప్లేస్టేషన్‌తో సహా సోనీ యొక్క అన్ని విభాగాలను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది.ఒప్పందం యొక్క వివరాలను వెల్లడించింది.టెక్ దిగ్గజం మరియు Xbox యజమానైనా మైక్రోసాఫ్ట్ కు ప్రత్యర్థియైన సోనీ యొక్క ప్లేస్టేషన్‌ను సొంతం చేసుకోవడం ఎలా సహాయపడుతుందో వివరించింది.

 

కథనాన్నిమైక్రోసాఫ్టర్స్‘ అనే వెబ్‌సైట్ షేర్ చేసి,చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది మరియు చాలా మంది వ్యక్తులు ఈ వార్తలను విశ్వసించి, రీట్వీట్ చేయడం లేదా కొనుగోలుపై అంచనా వేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సోనీ లేదా మైక్రోసాఫ్ట్ నుండి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన/జవాబు లేదా అధికారిక ప్రకటన లేదు. ఇది డిసెంబర్ 28, 2020న రోజంతా ట్విట్టర్‌లో వైరల్ అయింది.

FACT CHECK

అయినప్పటికీ, Google సహాయంతో ఆంగ్లంలోకి అనువదించబడినప్పుడు స్పానిష్‌లో చక్కటి అక్షరాల ముద్రణతో,దిగువ చిత్రంలో చూపిన విధంగా “ఏప్రిల్ ఫూల్స్ డే’ అని వ్రాసి ఉంది.

ఏప్రిల్ ఫూల్స్ డే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న వచ్చినప్పటికీ, సోనీ మీద కధనం డిసెంబర్ 28న కనిపించింది.గూగుల్‌లో మరింత పరిశీలించగా, అనేక హిస్పానిక్ సంస్కృతులలో ఈ రోజును “పవిత్ర అమాయకుల దినోత్సవం”(Day of the Holy Innocents)గా విస్తృతంగా పాటిస్తారు, ఇది ప్రపంచ ఏప్రిల్ ఫూల్స్ డేకి సమానం.

ఇది నిజమైన వార్త అయితే, రెండు ప్రపంచ దిగ్గజాలు కలిసిపోతున్నట్లు గ్లోబల్ మీడియా విస్తృతంగా నివేదించి ఉండేది.హిస్పానిక్ సంస్కృతిలో చిలిపి పనుల (pranks) కోసం ఒక రోజు కేటాయిస్తారని,అందులో భాగంగానే ఈ కధనాన్ని ప్రచురించారని గ్రహించిన చాలా మంది కధనాన్ని మరియు ట్వీట్‌ను శీఘ్రంగా తొలగించారు.

వాదన/Claim:మైక్రోసాఫ్ట్ సోనీని $130 బిలియన్లకు కొనుగోలు చేసింది.

నిర్ధారణ/Conclusion:స్పానిష్ ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా సోనీని మైక్రోసాఫ్ట్ 130 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిందన్న నకిలీ వార్త(prank) సోషల్ మీడియాలో ప్రచారంలో జరిగింది.

Our rating   —Totally False.

[మరి కొన్ని fact checks: ట్రక్కు వంతెనని దాటుతూ రాకెట్‌ను తీసుకువెళుతున్నట్లు ఒక వాదన వైరల్ అయింది Fact Check

ఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check]

 

బెంగళూరు టెర్మినల్ 2 చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి; Fact Check

నవంబర్ 19, 2022న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లోని దోనీ పోలో విమానాశ్రయమని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.

క్లెయిమ్/వాదన ఈ విధంగా ఉంది: “అరుణాచల్ ప్రదేశ్ ఈ విమానాశ్రయాన్ని ఎక్కువగా BAMBU(Bamboo)తో తయారు చేసి రాష్ట్రానికి అందించారు, వావ్… నమ్మలేకపోతున్నాను… వారు ఇక్కడ భారతదేశంలో చేస్తున్నారు. అద్భుతమైన భారత్.”వీడియోలో పైకప్పు నుండి వేలాడుతున్న అలంకరణలతో కూడిన పెద్ద, ఆధునిక విమానాశ్రయ టెర్మినల్ కనపడుతుంది.

FACT CHECK

వీడియోలో ఉన్న విమానాశ్రయం ఇటీవలి బెంగుళూరు టెర్మినల్ 2 అలంకరణలను పోలి ఉన్నందున, Digiteye India బృందం దానిని పరిశీలించగా, ఆ వీడియో అరుణాచల్ ప్రదేశ్‌లోని విమానాశ్రయానికి చెందినది కాదని, బెంగుళూరులోనిదని కనుగొన్నారు.

నవంబర్ 11, 2022న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు టెర్మినల్ 2ను ప్రారంభించినప్పుడు, దిగువ చూపిన విధంగా వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది:

వాస్తవానికి, అరుణాచల్ ప్రదేశ్ యొక్క డోనీ పోలో విమానాశ్రయం చిత్రాలు(దిగువ చిత్రాలు) అక్టోబర్ 19, 2022న DGCA ద్వారా అధికారికంగా విడుదల చేయబడ్డాయి:

కావున, ఈ వార్త సరైనదే కావచ్చు, అయితే ఈ చిత్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి చెందినదనే వాదన తప్పు.చిత్రం బెంగళూరులోని టెర్మినల్ 2 విమానాశ్రయం చెందినది.

వాదన/Claim: చిత్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని దోనీ పోలో విమానాశ్రయంలోని bamboo అలంకరణలతో ఉన్న లోపలి భాగము.

నిర్ధారణ/Conclusion:బెంగళూరు విమానాశ్రయం టెర్మినల్ 2 చిత్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని దోనీ పోలో విమానాశ్రయం అని తప్పుగా తీసుకోబడింది.

Rating: Misrepresentation —

[మరి కొన్ని Fact Checks: ఎత్తైన రైల్వే వంతెనపై వెలుతున్న రైలు వీడియో భారతదేశంలోనిది కాదు, చైనా దేశంలోని వీడియో: Fact Check ; 

ఆంధ్రా తీరం ఒడ్డుకు కొట్టుకొచ్చిన రథం బంగారంతో చేసింది కాదు, బంగారు రంగులో మాత్రమే ఉంది; Fact Check]

ఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check

ప్లాస్టిక్‌ నుంచి గోధుమలు తయారవుతున్నట్లు ఒక వైరల్‌ వీడియో చూపుతోంది.
1: 15 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో కార్మికులు ‘ఉపయోగించిన ప్లాస్టిక్‌ను’ఫ్యాక్టరీలో డంప్ చేయడం,అక్కడ నుండి ప్లాస్టిక్‌ను చిన్న ముక్కలుగా విభజించి, అనేకసార్లు కడిగి, ప్లాస్టిక్ దారాలుగా చేసి, ఆపై గోధుమ గింజల వలె కనిపించేలా తయారు చేయడం కనిపిస్తుంది.ఈ వీడియో వాట్సాప్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది.

ఈ వైరల్ వీడియో యొక్క వాస్తవాన్ని పరిశీలన చేయమని Digiteye India టీమ్‌ వారికీ వాట్సాప్‌లో రిక్వెస్ట్ వచ్చింది.

FACT CHECK

Digiteye India బృందం వారు వీడియో అంతటా మధ్య దిగువన ‘స్మార్టెస్ట్ వర్కర్స్’ అనే వాటర్‌మార్క్‌ను గుర్తించారు. మేము ఈ క్లూని తీసుకొని,Googleలో కీవర్డ్ searchలో ఉపయోగించగా,’స్మార్టెస్ట్ వర్కర్స్’ యొక్క YouTube పేజీకి దారితీశాయి, అక్కడ మేము ఈ వైరల్ వీడియోను కనుగొన్నాము.

వైరల్ వీడియో సెప్టెంబరు 24, 2023న ప్రచురించబడింది మరియు దాని శీర్షిక – ప్లాస్టిక్ యొక్క కొత్త ప్రయోజనం: రీసైక్లింగ్ జర్నీని ఆవిష్కరించడం.

స్మార్టెస్ట్ వర్కర్స్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ వెంచర్ యొక్క తుది ఉత్పత్తి వాస్తవానికి ఏమిటో గుర్తించడానికి మేము ఈ ఆధారాలు ఉపయోగించాము. ఇదే విధమైన ప్రక్రియను అనుసరించే వీడియోలలో ఒకదానిలో, వీడియో తుది ఉత్పత్తి ప్లాస్టిక్ LLDPE అని పేర్కొంది, అంటే, ‘లీనియర్ తక్కువ-సాంద్రత’ కలిగిన పాలిథిలిన్.ఈ ఉత్పత్తులు ప్రాథమికంగా ప్లాస్టిక్-గుళికలు(plastic-pellets), వీటిని ప్లాస్టిక్ సీసాలు, ఆటోమొబైల్స్, నిత్యావసర వినియోగ వస్తువులు మొదలైన వాటి తయారీ వంటి బహుళ పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

ఆటోమొబైల్ పరిశ్రమలో ఉపయోగించే ప్లాస్టిక్ గుళికలను(plastic pellets) తయారు చేయడానికి అదే ప్రక్రియను/పద్దతిని ఉపయోగించే మరొక వీడియోను మేము గుర్తించాము.

Digiteye India బృందం వారు ఉజ్జయినిలో ఉన్న వ్యాపారి నిరుపమ్ అగర్వాల్‌తో మాట్లాడినప్పుడు, ఆయన ఈ వైరల్ వీడియోలోని ఈ గుళికలు(pellets) బియ్యం లేదా గోధుమ గింజలు కాదని నిర్ధారించారు.ఈ గుళికలు (pellets)రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తో తయారు చేసినవని మరియు వాటిని పరిశ్రమల్లో వాడతాం, మనుషుల వినియోగానికి కాదని’ అగర్వాల్ అన్నారు.

కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.

వాదన/CLAIM: ప్లాస్టిక్‌తో గోధుమ గింజలను తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీ వైరల్ వీడియో కనిపిస్తుంది.

నిర్ధారణ/CONCLUSION: వైరల్ వీడియో ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసే ఫ్యాక్టరీని చూపిస్తుంది.ప్లాస్టిక్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి, కడిగి, ప్లాస్టిక్ దారాలుగా చేసి, ఆపై చిన్న గుళికలగా(pellets)ఏర్పరుస్తుంది.ఈ గుళికలను(pellets) పరిశ్రమలలో ఉపయోగిస్తారు మరియు అవి మనుషుల వినియోగానికి ఉద్దేశించినవి కావు. అవి ఏ రకమైన ఆహార ధాన్యాలు కావు.

RATING: – Totally False–?????

[మరి కొన్ని Fact Checks: MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check ;

మొబైల్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లపై GST 31.3% నుంచి 18%కి తగ్గిందని క్లెయిమ్/వాదన వైరల్ అవుతోంది; Fact Check]

 

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని సైన్యంలోకి పంపారా? Fact Check

గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం మధ్య, హమాస్ ఆకస్మిక దాడిని ప్రారంభించిన తర్వాత, విభిన్న దావాలతో కూడిన పలు వీడియోలు మరియు చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.వైరల్ చిత్రాలలో ఒకటి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని ఆర్మీలో చేరడానికి పంపినట్లు పేర్కొంది.

వైరల్ ట్వీట్ బెంజమిన్ నెతన్యాహు ఒక యువకుడితో ఉన్న చిత్రం కనబడుతుంది. “ఎంతటి నాయకుడు. నిజమైన దేశభక్తి: బెంజమిన్ నెతన్యాహు హమాస్‌పై యుద్ధంలో పాల్గొనేందుకు తన కొడుకును జాతీయ విధుల్లోకి పంపుతున్నాడు. ఇజ్రాయెల్ ఆర్మీ” అని ట్వీట్‌లో ఉంది.

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో బెంజమిన్ నెతన్యాహు కుమారుడు ఇజ్రాయెల్ సైన్యంలో చేరి హమాస్‌కు వ్యతిరేకంగా పోరాడతారని ట్వీట్ పేర్కొంది.

ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ అదే claim/దావాతో చిత్రం షేర్ చేయబడింది.

ఈ వైరల్ ఇమేజ్‌ని ఫ్యాక్ట్ చెక్ చేయమని Digiteye India టీమ్‌ వారికీ వాట్సాప్‌లో రిక్వెస్ట్ వచ్చింది.

FACT CHECK

క్లెయిమ్/దావా యొక్క సత్యాన్ని పరిశీలన చేయడానికి Digiteye India టీమ్‌ Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ను ఉపయోగించగా,’ఫ్రెండ్స్ ఆఫ్ LIBI ‘అని ఇజ్రాయెల్ సైనికులకు మద్దతిచ్చే ఒక ఇజ్రాయెలీ వెబ్‌సైట్ వాళ్ళు పోస్ట్ చేసిన చిత్రం అని తేలింది.డిసెంబర్ 4, 2017 నాటి పోస్ట్‌లో, వెబ్‌సైట్ ఈ చిత్రాన్ని “ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కుమారుడు అవ్నర్ నెతన్యాహు (Avner Netanyahu)ఆర్మీ సర్వీస్‌ను పూర్తి చేశాడు” అని పేర్కొన్న పోస్ట్ కోసం షేర్ చేసింది.

ఇది బెంజమిన్ నెతన్యాహు కుమారుడు అవ్నర్ యొక్క మరిన్ని చిత్రాల కోసం వెతకడానికి దోహదపడింది. మేము కీవర్డ్ ని ఉపయోగించి వెతకగా ‘టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‘ ప్రచురించిన ఈ పోస్ట్‌కు దారితీసింది.డిసెంబరు 1, 2014 నాటి కథనం ప్రకారం, నెతన్యాహు తన కొడుకు తప్పనిసరి ఆర్మీ సర్వీస్‌లో చేరుతున్నందున అతనికి వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొంది.వార్తా ప్రచురణ ఇదే చిత్రాన్ని “డిసెంబర్ 01, 2014న జెరూసలేం అమ్మూనిషన్ హిల్లో వారి కుమారుడు అవ్నర్‌తో కలిసి కనిపించిన ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మరియు అతని భార్య సారా” అనే శీర్షికతో ప్రచురించింది.

“ఇజ్రాయెల్ ప్రధానమంత్రి చిన్న కుమారుడు అవ్నర్ నెతన్యాహు (Avner Netanyahu)సోమవారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌లో తన సైనిక సేవను ప్రారంభిస్తున్నాడు, అతను తల్లిదండ్రులచే హృదయపూర్వక వీడ్కోలు అందుకొన్న తరువాత, అతను బస్సులో ఎక్కడానికి వచ్చాడు” అని వార్తా పత్రిక శీర్షిక పేర్కొంది.

యూదు, డ్రూజ్ లేదా సర్కాసియన్(Jewish, Druze or Circassian) అయిన 18 ఏళ్లు పైబడిన ప్రతి ఇజ్రాయెల్ పౌరుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌లో పనిచేసే ‘తప్పనిసరి విధానం’ ఇజ్రాయెల్లో కలిగి ఉంది.కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పౌరులు నమోదు చేసుకున్న తర్వాత, వారు నిర్ధిష్ట రోజుల పాటు సైన్యంలో పనిచేయవలసి ఉంటుంది.పురుషులు కనీసం 32 నెలలు, మహిళలు కనిష్టంగా 24 నెలలు సేవ చేయాలని భావిస్తున్నారు.పౌరులు ‘ఎలైట్ కంబాట్ యూనిట్ల’ నుండి ‘కంబాట్ సపోర్ట్ యూనిట్ల’ వరకు ఉండే యూనిట్లలో సేవలు అందిస్తారు.

అందువల్ల ఈ దావా తప్పు.

CLAIM/దావా: ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని సైన్యంలోకి పంపారు.

CONCLUSION/నిర్ధారణ: ఈ వైరల్ చిత్రం 2014లో బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని ‘తప్పనిసరి ఆర్మీ సర్వీస్’‌లో చేరడానికి ముందు హృదయపూర్వక వీడ్కోలు అందించడానికి వెళ్లినప్పటి చిత్రం.

RATING: Misrepresentation-???

[మరి కొన్ని Fact checks: నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ మరణించారా? నకిలీ ట్విట్టర్ ఖాతా యొక్క దావా వైరల్ అవుతుంది; Fact Check ; MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check]

బ్రహ్మపుత్ర నది కింద రాబోయే 14-కిమీ సొరంగం గురించి తప్పు చిత్రంతో దావా చేయబడింది ; Fact Check

బ్రహ్మపుత్ర నది కింద అండర్ వరల్డ్ రోడ్డు-రైలు మార్గం రాబోతోందంటూ సోషల్ మీడియాలో ఓ చిత్రం వైరల్ అవుతోంది.
పరిశీలనలో ఉన్న బ్రహ్మపుత్ర నది కింద సొరంగానికి సంబంధించిన అనేక ప్రణాళికల కారణంగా ఇది ప్రాముఖ్యాత సంతరించుకుంది.

పోస్ట్‌తో పాటు, అండర్ వాటర్ రైల్-కమ్-రోడ్ నెట్‌వర్క్ యొక్క చిత్రం హిందీభాషలో ఉన్న క్లెయిమ్‌/దావాతో జోడించబడింది.
“इसे कहते हैं नया भारत…..भारत की पहली पानी के नीचे सड़क व रेलवे लाइन, यह असम में ब्रह्मपुत्र नदी के नीचे बनी लगभग 14 किलोमीटर लंबी सुरंग है। – जय हो” (తెలుగు అనువాదం: దీనిని న్యూ ఇండియా అంటారు… భారతదేశపు నీటి అడుగున మొట్టమొదటి రహదారి మరియు రైల్వే లైన్. ఇది అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింద నిర్మించిన సుమారు 14-కిమీ పొడవైన సొరంగం.జై హో).

పోస్ట్‌ వాట్సాప్‌లో విస్తృతంగా షేర్ చేయబడింది.

FACT CHECK

వాస్తవం తనిఖీ చేయడం కోసం Digiteye India చిత్రాన్ని స్వీకరించి, Google రివర్స్ ఇమేజ్ లో పరిశీలన చేయగా, అది పాత చిత్రమని మరియు దావా తప్పుదారి పట్టించే విధంగా ఉందని కనుగొన్నాము.

జర్మనీని డెన్మార్క్‌తో కలిపే యూరప్‌లోని ఫెహ్‌మార్న్ బెల్ట్ ఫిక్స్‌డ్ లింక్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన చిత్రం. ఈ చిత్రం నీటి అడుగున రైలు మరియు రహదారి లింక్ ఉండడంతో విస్తృతంగా ప్రసిద్ది చెందింది.

ప్రాజెక్ట్‌ పూర్తి అయినప్పుడు, నీటి అడుగున ఆటో మరియు రైలు సొరంగం జర్మనీ మరియు డెన్మార్క్‌లను కలుపుతుంది” అని ఈ చిత్ర సారాంశం. ఈ చిత్రం క్రెడిట్ ఫెమెర్న్‌కి క్రింద విధంగా ఇవ్వబడింది:

బ్రహ్మపుత్ర నది దిగువన ఉన్న నీటి అడుగున లింక్‌కు(underwater link ) సంబంధించిన వార్తల కోసం వెతుకుతున్నప్పుడు, రైల్వే మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మరియు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) దేశంలోనే నీటి అడుగున మొట్టమొదటి రోడ్-కమ్-రైల్ సొరంగాలను నిర్మించాలని యోచిస్తున్నట్లు పలు వార్తా నివేదికలు వెలువడ్డాయి. బ్రహ్మపుత్ర నది అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్‌లను కలుపుతుంది, దీని నిర్మాణానికి వ్యయం ₹7,000 కోట్లు అని అంచనా.

అయితే, ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ప్రణాళికను లేదా వివరణను విడుదల చేయలేదు. అందువల్ల, ఇది భారతదేశపు నీటి అడుగున మొట్టమొదటి రైలు-రోడ్డు ప్రాజెక్ట్ అనే వాదన తప్పు.

వాదన/Claim:అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింద భారతదేశంలోని నీటి అడుగున మొట్టమొదటి రహదారి మరియు రైల్వే లైన్ సొరంగం నిర్మించబడుతుందనే వాదనతో ఉన్న చిత్రం.

నిర్ధారణ/Conclusion:వార్త సరైనది కానీ చిత్రం తప్పు ,ఆ చిత్రం ఐరోపాలో రాబోయే సొరంగం చిత్రం.

Rating: Misleading:

[మరి కొన్ని fact Checks: Is Nobel laureate Amartya Sen dead? Fake Twitter account’s claim goes viral; Fact Check  Image of beautiful marine animal Sea Pen passed off as Nagapushpa, a rare flower]

మణిపూర్‌లోని పురాతనమైన ఈ చర్చిని బిజెపి మద్దతుదారులు తగులబెట్టారా? నిజమేంటి?

వాదన/Claim:మణిపూర్‌ హింసాకాండలో సెయింట్ జోసెఫ్ చర్చికి బిజెపి కార్యకర్తలు నిప్పంటించారని ఒక వీడియో వైరల్ అయింది.

నిర్ధారణ/Conclusion:తప్పు వాదన. ఫ్రెంచ్ చర్చి దహనం చూపుతున్న వీడియో మణిపూర్‌లో జరిగిన సంఘటనగా ప్రచారం చేయబడింది.

రేటింగ్: పూర్తిగా తప్పు నిరూపణ —

Fact Check వివరాలు:

మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు ముఖ్యాంశాలు అవుతున్న నేపథ్యంలో, మణిపూర్‌లోని చర్చిని బిజెపి మద్దతుదారులే తగులబెట్టారనే వాదనతో చర్చిని తగలబెట్టే ఒక వీడియో వైరల్ అవుతోంది.హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది: #मणिपुर सुग्नू इंफाल नही थम रही हिंसा आगजनी भाजपा समर्थक उग्रवादियो ने 300 साल से ज्यादा पुरानी St. Joseph’s चर्च जलाई 74 दिनो से मणिपुर जल रहा है [అనువాదం:  “మణిపూర్- ఇంఫాల్ హింస ఆగటం లేదు. 300 ఏళ్ల నాటి సెయింట్ జోసెఫ్ చర్చిని బీజేపీ కార్యకర్తలు తగులబెట్టారు. మణిపూర్ 74 రోజులుగా మండుతోంది.]

ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

మణిపూర్ యొక్క జాతి రూపురేఖలు రాష్ట్రంలో రెచ్చిపోతున్న హింస గురించి తెలుపుతుంది.మణిపురిలలో సగం మంది హిందువులైన మెయిటీస్, కుకీలు మరియు నాగాలు మిగిలిన జనాభాలో 90 శాతం ఉన్నారు మరియు వారు క్రైస్తవులు. మిగిలిన 10 శాతం జనాభా ముస్లింలు లేదా ఇతర మతాలను అనుసరిస్తున్నారు.

మే 3, 2023న ప్రారంభమైన జాతి హింస ఇప్పటివరకు 140 మంది మరణానికి దారి తీసింది. ఈ నేప‌థ్యంలో, రాష్ట్రంలోని ప్ర‌జ‌ల మ‌ధ్య మ‌రింత మతపరమైన హింసను రేపేందుకు చ‌ర్చి దహనం అయిన వీడియోను షేర్ చేయబడుతోంది.

వాస్తవం ఏంటి?

Digiteye India బృందం వారు చర్చ్‌ను కాల్చేస్తున్న వీడియోలోని కొన్ని ఫ్రేమ్‌లు తీసుకొని పరిశీలించగా, అది మార్నేలోని ‘L’église Notre-Dame-de Drosnay‘చర్చి అగ్నికి ఆహుతై కుప్పకూలిన చారిత్రాత్మక చర్చి యొక్క విజువల్స్కు కు అని తెలిసింది.మంటల్లో కాలిపోయిన 16వ శతాబ్దపు ఫ్రెంచ్ చర్చి వీడియో నుండి 25 సెకన్ల క్లిప్‌ను ఉపయోగించి, మణిపూర్‌ రాష్ట్రంలోని మెజారిటీ కమ్యూనిటీలు చర్చికి నిప్పంటించారని ఒక దావా/వాదన పేర్కొంది.

 




జూలై 7, 2023న అగ్నికి ఆహుతైన ఫ్రెంచ్ చర్చి యొక్క అసలైన వీడియోను చూడండి. మార్నే ప్రిఫెక్చర్ పత్రికా ప్రకటన ప్రకారం, అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది మరియు దానికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించడం జరుగుతోంది.పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలోని(Louvre Museum) క్యూరేటర్ నికోలస్ మిలోవనోవిక్ కూడా అగ్నిప్రమాదం “కోలుకోలేని నష్టం” అంటూ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసారు.ఈ సంఘటన ఇక్కడ మరియు ఇక్కడ ప్రధాన వార్తా సంస్థల్లో కూడా నివేదించబడింది.

మరి కొన్ని Fact Checks:

రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను ప్రకటించారా? వాస్తవ పరిశీలన

హమాస్ ఇజ్రాయెల్ ట్యాంకులను స్వాధీనం చేసుకుని వాటిపై పాలస్తీనా జెండాలను ఎగురవేయడం వీడియోలో కనిపిస్తుంది; Fact Check