Tag Archives: telugu fake news

భారతదేశ వ్యాప్తంగా అన్ని బాణసంచా అమ్మకాలు మరియు వాటి వాడకాన్ని సుప్రీంకోర్టు నిషేధించిందా? వాస్తవ పరిశీలన

Claim/వాదన: వాదన ఈ విధంగా ఉంది: “గతంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(Delhi-NCR)ప్రాంతం కు మాత్రమే పరిమితమైన బాణాసంచా అమ్మకాలు మరియు వాటి వినియోగంపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ప్రకటించింది, కాని అది ఇప్పుడు దేశవ్యాప్తంగా వర్తిస్తుంది.

Conclusion/నిర్ధారణ: నిషేధం దేశవ్యాప్తంగా బాణసంచా తయారీలో బేరియం వంటి హానికరమైన రసాయనాల వినియోగానికి మాత్రమే సంబంధించినది, నిషేధం అన్ని బాణసంచాలపై కాదు.

Rating: Misleading —

Fact Check వివరాలు:

వాదన ప్రకారం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(Delhi-NCR)ప్రాంతం మాత్రమే కాకుండా, భారతదేశం అంతటా బాణసంచా అమ్మకాలు మరియు వాటి వాడకాన్ని సుప్రీం కోర్టు నిషేధించిందని, సుప్రీం కోర్టును ఉద్దేశించి తప్పుదారి పట్టించే పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

వాదన ఈ విధంగా ఉంది: “గతంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(Delhi-NCR)ప్రాంతం కు మాత్రమే పరిమితమైన బాణాసంచా అమ్మకాలు మరియు వాటి వినియోగంపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ప్రకటించింది, కాని అది ఇప్పుడు దేశవ్యాప్తంగా వర్తిస్తుంది.దీనిపై శ్రీ విష్ణు శంకర్ జైన్ అభిప్రాయాలను తప్పక వినండి.”

క్రింద ట్వీట్ చూడండి:

FACT CHECK

ఈ వాదనలోని వాస్తవం పరిశీలించే క్రమంలో మొదట సుప్రీంకోర్టు అటువంటి తీర్పు ఏమైనా ఇచ్చిందా అని వెతకగా, గతంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(Delhi-NCR)ప్రాంతంకు మాత్రమే పరిమితమైన బాణాసంచా అమ్మకాలు మరియు వాటి వినియోగంపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ప్రకటించింది మరియు దానిపై ఎప్పటికప్పుడు వివరణ ఇచ్చిందని కనుగొన్నము. 2018 తీర్పును స్పష్టం చేసే వార్తా నివేదికలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

బాణసంచాలో బేరియం మరియు నిషేధిత రసాయనాల వాడకంపై నిషేధం దేశవ్యాప్తంగా వర్తిస్తుందని, అన్ని రాష్ట్రాలకు కట్టుబడి ఉంటుందని సుప్రీం కోర్టు ఒక రివ్యూ పిటిషన్‌లో తన ఆదేశాలపై స్పష్టత ఇచ్చింది.రాజస్థాన్‌కు సంబంధించి, న్యాయమూర్తులు A.S బోపన్న మరియు M.M సుందరేష్ 7 నవంబర్ 2023న వివరణ ఇచ్చారు, ఈ ఉత్తర్వులు ఇప్పుడు రాజస్థాన్‌తో సహా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని అపెక్స్ కోర్టు(apex court)పేర్కొంది.

2018 తీర్పు ప్రకారం, “గ్రీన్ క్రాకర్స్” పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు బాణాసంచా పర్యావరణ, గాలి నాణ్యతను ప్రభావితం చేయకూడదని నిర్దేశించింది మరియు తక్కువ కాలుష్య కారకాలను విడుదల చేసే మరియు విపరీతమైన శబ్దాన్ని నివారించే ‘పర్యావరణ అనుకూలమైన’ లేదా “గ్రీన్” బాణసంచా తయారీని “బాణసంచా కర్మాగారాలకు” తప్పనిసరి చేసింది.

దీపావళి బాణసంచాలో నిషేధిత రసాయనాలు ‘బేరియం సాల్ట్’ వంటివి మరియు ఈ రసాయనాలతో కూడిన బాణాసంచా వాడకాన్ని నిషేధించబడ్డాయి మరియు “గ్రీన్ క్రాకర్స్” అనుమతించబడతాయని సుప్రీం కోర్ట్ 2021 నాటి తీర్పులో పేర్కొంది.

అందువల్ల, నిషేధం దేశవ్యాప్తంగా బాణసంచా తయారీలో బేరియం వంటి హానికరమైన రసాయనాల వినియోగానికి సంబంధించినది మరియు పోస్ట్‌లో పేర్కొన్నట్లు దేశవ్యాప్తంగా అన్ని బాణసంచాలపై నిషేధం కాదు. వాస్తవానికి, తయారీదారులు సుప్రీం కోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం గ్రీన్ పటాకులు/బాణసంచా ఉత్పత్తి చేస్తున్నచో అవి అనుమతించబడతాయి. అందువల్ల, దావా తప్పుదారి పట్టించే విధంగా ఉంది.

మరి కొన్ని fact Checks:

10 లో 9 పట్టణ ప్రైవేటు పాఠశాల పిల్లలు ఇంగ్లీష్ చదవలేరట! ఎంతవరకు నిజం?

శానిటైజర్ వాడటం వలన చేతులు కాలి గాయలవుతాయ? Fact check

భారతదేశం గౌరవార్థం దుబాయ్‌లోని ‘అల్ మిన్‌హాద్’ అనే జిల్లా పేరును ‘హింద్’ గా మార్చారా? Fact Check:

దుబాయ్ అధినేత షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్(Sheikh Mohammed bin Rashid Al Maktoum) జనవరి 29న దుబాయ్ లోని ఒక జిల్లాకు “హింద్ సిటీ”గా పేరు మార్చుతున్నట్లు ప్రకటించినప్పుడు,భారతదేశం మరియు హిందువులను గౌరవించాలనే ఉద్దేశంతోనే పేరు మార్చారని సోషల్ మీడియా సందడి చేసింది.వాదనను క్రింద చూడవచ్చును.

“దుబాయ్ అధినేత మరియు యుఎఇ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎమిరేట్‌లోని ఒక జిల్లా పేరు మార్చాలని ఆదేశించారు.అల్ మిన్‌హాద్ మరియు దాని చుట్టుపక్కల 84 చదరపు కిలోమీటర్ల ప్రాంతాలు ఇప్పుడు భారతదేశం మరియు హిందువులు మానవాళికి అందించిన సహకారాన్ని గౌరవించేందుకు “హింద్ సిటీ”గా పిలువబడతాయి.

ఇలాంటి వాదనలతో సోషల్ మీడియాలో ఇక్కడ మరియు ఇక్కడ విస్తృతంగా షేర్ చేయబడింది.

FACT CHECK

దుబాయ్ నుండి వచ్చిన వార్తల ప్రకారం,షేక్ తన భార్య షేఖా హింద్ బింట్ మక్తూమ్(Sheikha Hind bint Maktoum) గౌరవార్థం జిల్లా పేరును మార్చినట్లు దుబాయ్ ‘ప్రభుత్వ మీడియా కార్యాలయం’ పేర్కొంది. వాదన/దావా ప్రకారం భారతదేశం వలన కాదు. క్రింది విధంగా ప్రకటించారు:

 

“ప్రధాన మంత్రి మరియు దుబాయ్ అధినేత హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, అతని భార్య షేఖా హింద్ బింట్ మక్తూమ్(Sheikha Hind bint Maktoum) గౌరవార్థం అల్ మిన్‌హాద్ ప్రాంతాన్ని ‘హింద్ సిటీ’గా మార్చారు” అని షేక్ మీడియా కార్యాలయం వార్తా సంస్థలకు తెలిపింది.’హింద్’ అనేది అరబిక్ పేరు,మరియు ఈ ప్రాంతం యొక్క పురాతన నాగరికతలో దాని మూలాలను కలిగి ఉంది,” అని వివరణను ఇచ్చింది.

భారతదేశం గురించి ఎటువంటి ప్రస్తావన లేకుండా నిజమైన ప్రకటన క్రింది విధంగా ఉంది:

కావున, అల్ మిన్‌హాద్ జిల్లా పేరును ‘హింద్ సిటీ’గా మార్చడంలో భారతదేశ ప్రస్తావన కానీ సంబంధం కానీ లేదు. ఈ దావా/వాదన తప్పుదారి పట్టించే విధంగా ఉంది.

Claim: భారతదేశం గౌరవార్థం దుబాయ్‌లోని ‘అల్ మిన్‌హాద్ ‘అనే జిల్లా పేరును ‘హింద్’ గా మార్చారు.
Conclusion: భారతదేశ గౌరవార్థం కాకుండా షేక్ భార్య షేఖా హింద్ బింట్ మక్తూమ్(Sheikha Hind bint Maktoum) గౌరవార్థం అల్ మిన్‌హాద్ ప్రాంతాన్ని ‘హింద్ సిటీ’గా మార్చబడింది”.
Rating: Misleading —

మరి కొన్ని Fact checks:

ఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check

Fact Check: సుడాన్‌లో డ్రోన్ దాడికి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం గాజాపై జరుగుతున్న దాడులలో ఒకటని క్లెయిమ్

బెంగళూరు టెర్మినల్ 2 చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి; Fact Check

నవంబర్ 19, 2022న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లోని దోనీ పోలో విమానాశ్రయమని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.

క్లెయిమ్/వాదన ఈ విధంగా ఉంది: “అరుణాచల్ ప్రదేశ్ ఈ విమానాశ్రయాన్ని ఎక్కువగా BAMBU(Bamboo)తో తయారు చేసి రాష్ట్రానికి అందించారు, వావ్… నమ్మలేకపోతున్నాను… వారు ఇక్కడ భారతదేశంలో చేస్తున్నారు. అద్భుతమైన భారత్.”వీడియోలో పైకప్పు నుండి వేలాడుతున్న అలంకరణలతో కూడిన పెద్ద, ఆధునిక విమానాశ్రయ టెర్మినల్ కనపడుతుంది.

FACT CHECK

వీడియోలో ఉన్న విమానాశ్రయం ఇటీవలి బెంగుళూరు టెర్మినల్ 2 అలంకరణలను పోలి ఉన్నందున, Digiteye India బృందం దానిని పరిశీలించగా, ఆ వీడియో అరుణాచల్ ప్రదేశ్‌లోని విమానాశ్రయానికి చెందినది కాదని, బెంగుళూరులోనిదని కనుగొన్నారు.

నవంబర్ 11, 2022న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు టెర్మినల్ 2ను ప్రారంభించినప్పుడు, దిగువ చూపిన విధంగా వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది:

వాస్తవానికి, అరుణాచల్ ప్రదేశ్ యొక్క డోనీ పోలో విమానాశ్రయం చిత్రాలు(దిగువ చిత్రాలు) అక్టోబర్ 19, 2022న DGCA ద్వారా అధికారికంగా విడుదల చేయబడ్డాయి:

కావున, ఈ వార్త సరైనదే కావచ్చు, అయితే ఈ చిత్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి చెందినదనే వాదన తప్పు.చిత్రం బెంగళూరులోని టెర్మినల్ 2 విమానాశ్రయం చెందినది.

వాదన/Claim: చిత్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని దోనీ పోలో విమానాశ్రయంలోని bamboo అలంకరణలతో ఉన్న లోపలి భాగము.

నిర్ధారణ/Conclusion:బెంగళూరు విమానాశ్రయం టెర్మినల్ 2 చిత్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని దోనీ పోలో విమానాశ్రయం అని తప్పుగా తీసుకోబడింది.

Rating: Misrepresentation —

[మరి కొన్ని Fact Checks: ఎత్తైన రైల్వే వంతెనపై వెలుతున్న రైలు వీడియో భారతదేశంలోనిది కాదు, చైనా దేశంలోని వీడియో: Fact Check ; 

ఆంధ్రా తీరం ఒడ్డుకు కొట్టుకొచ్చిన రథం బంగారంతో చేసింది కాదు, బంగారు రంగులో మాత్రమే ఉంది; Fact Check]

ఇజ్రాయెల్ గాజాలో సూపర్-ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ 10G పరీక్షలు నిర్వహిస్తోంది? Fact Check

ఇజ్రాయెల్ గాజాలో  10G పరీక్ష/పరిశోధనలను ప్రారంభించిందని ఒక సోషల్ మీడియా పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది. హిందీలో పెట్టిన వాదన ఇలా ఉంది:

పై హిందీ పోస్ట్ యొక్క అనువాదం:

ఇజ్రాయెల్ గాజాలో 10G పరీక్షను ప్రారంభించింది, హ్యాక్ చేయబడిన సిమ్‌లతో కూడిన చాలా మొబైలకు నెట్వర్క్ అందుబాటులో లేదు.
#Stand_with_Israel.”
ఈ వాదన ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ కూడా షేర్ చేయబడింది.

FACT CHECK

10G కోసం వెతకగా Google లేదా ఇతర సెర్చ్ ఇంజిన్స్లలో ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు,కాగా ప్రస్తుతం ఇజ్రాయెల్‌తో సహా అనేక దేశాలలో 6G పరిశోధనలు మాత్రమే చేపట్టారు. వాస్తవానికి, ఇజ్రాయెల్ సెప్టెంబర్ 29, 2020న 5Gని ప్రవేశపెట్టింది మరియు దేశం తన జాతీయ విధానంలో భాగంగా 6Gపై పరిశోధనను చేపట్టింది.

యునైటెడ్ స్టేట్స్ మరియు చైనా ఇప్పటికే ‘సిక్స్త్ జనరేషన్ కమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ల (6G)’ అభివృద్ధిపై పని చేయడం ప్రారంభించాయి.ఫిన్లాండ్, దక్షిణ కొరియా మరియు జపాన్ వంటి ఇతర దేశాలు కూడా 6G అప్లికేషన్‌ల ప్రాథమిక పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం ప్రారంభించాయి.

10G డెలివరీ చేయగల సూపర్-ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లను రూపొందించడానికి గ్లోబల్ కేబుల్ పరిశ్రమ జనవరి, 2019లో 10G గురించి విజన్ పేపర్‌ను విడుదల చేసింది.(లేదా సెకనుకు 10 గిగాబిట్‌లు).అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 6G ఇంటర్నెట్ వేగంపై పరిశోధనలు జరుగుతున్నందున ఈ పరిశోధన ఇప్పటికీ ఒక విజన్ స్టేటస్‌లో (vision status )ఉంది.

6Gకే ఇంకా పని చేసే సాంకేతికత లేనప్పుడు , 10Gని పరీక్షించాలనే వాదన ఎప్పటికి తలెత్తదు మరియు అతితక్కువ అవకాశంగానే మిగిలిపోతుంది.

వాదన/Claim:ఇజ్రాయెల్ గాజాలో 10G టెక్నాలజీని పరీక్షించడం ప్రారంభించింది.
నిర్ధారణ/Conclusion: పరిశోధన కోసం ’10G సాంకేతికత’ ఏదీ చేపట్టబడలేదు మరియు గ్లోబల్ కేబుల్ పరిశ్రమ ద్వారా ఇప్పటికీ ఇది విజన్ స్టేజ్‌లో ఉంది, ఇజ్రాయెల్ గాజాలో 10Gని పరీక్షిస్తున్న సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం అనేక దేశాలు ఇంకా 6Gపై పరిశోధనలు చేస్తున్నాయి.

Rating: Totally False —

[మరి కొన్ని Fact checks:ఎత్తైన రైల్వే వంతెనపై వెలుతున్న రైలు వీడియో భారతదేశంలోనిది కాదు, చైనా దేశంలోని వీడియో: Fact Check ;

MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check]

ఈ మనిషి యోగా శక్తితో గాలిలో తేలియాడుతున్నాడా? Fact Check

వాట్సాప్‌లో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. వైరల్ వీడియోలో ఒక వ్యక్తి ఎటువంటి మద్దతు/సహాయం లేకుండా గాలిలో తేలుతున్నట్లు ఆరోపిస్తున్నారు.యోగా శక్తి వల్లే మనిషి గాలిలో తెలియాడుతున్నడని వీడియోతో వైరల్ అవుతున్న వాదనలు పేర్కొంటున్నాయి.దావాలో ఒకటి ఈ విధంగా ఉంది,

यह लड़का तमिलनाडु का रहने वाला है। इसने योग विद्या के बल पर आसमान में उड़कर दिखाया। यह देखकर वैज्ञानिक भी हैरान हैं। श्रीरामचरित मानस और पवनपुत्र श्री हनुमान जी को काल्पनिक बताने वालों के लिये खुली चुनौती|

(అనువాదం:ఈ అబ్బాయి తమిళనాడుకు చెందినవాడు. యోగ శక్తితో ఆకాశంలో ఎగురుతున్నాడు. ఇది చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. శ్రీ రామచరిత్ర మానస్ మరియు పవన పుత్ర శ్రీ హనుమంతుడు ఊహాత్మకమైన/కల్పితం అని పిలిచే వారికి ఇది ఓపెన్ ఛాలెంజ్. )

వాట్సాప్‌లో వైరల్ అయిన ఈ వీడియోను యొక్క వాస్తవాన్ని తనిఖీ చేయమని డిజిటీ ఇండియాకు అభ్యర్థన వచ్చింది.

FACT CHECK

మనిషిని గాలిలో ఎక్కువసేపు తేలుతూ ఉండేలా ఏ విధమైన పరికరాలు, క్రేన్‌లు లేదా సపోర్టును ఉపయోగించారో తెలుసుకోవడానికి Digiteye India బృందం వీడియోను నిశితంగా పరిశీలించింది.మేము వీడియో యొక్క దిగువ ఎడమ వైపున వాటర్‌మార్క్‌ని (2 నిమిషాల 12 సెకన్లు వద్ద)చూడగా, ఇది మెజీషియన్ విఘ్నేష్ ప్రభుదని పేర్కోనుంది.ఆ తర్వాత వీడియోలో వాటర్‌మార్క్ చాలాసార్లు కనిపించింది. మేము ఈ ఆధారాన్నీ /క్లూను ఉపయోగించి,Googleలో కీవర్డ్ సెర్చ్ను(keyword search) నిర్వహించాము.

కీవర్డ్ సెర్చ్ను(keyword search)నిర్వహించగా, అది విఘ్నేష్ ప్రభు వెబ్‌సైట్‌కి దారితీసింది.తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన విఘ్నేష్ ప్రభు అంతర్జాతీయ మెజీషియన్, మెంటలిస్ట్ అని వెబ్‌సైట్ వెల్లడించింది.వీడియోలో లెవిటేటింగ్ మ్యాజిక్ గురించి కూడా ప్రస్తావించబడింది.ఇటీవల కోయంబత్తూరులోని ప్రోజోన్ మాల్‌లో తన క్లోజ్‌అప్ మ్యాజిక్ షోను ప్రదర్శించాడు. ఒక వ్యక్తి తన ల్యాప్‌టాప్‌ను గాలిలో తేలియాడేలా చేయమని అడిగాడు. కానీ మెజీషియన్ విఘ్నేష్ ప్రభు నేల మట్టం నుండి 160 అడుగుల ఎత్తులో సన్నని గాలిలో ఎగురుతూ (లేవిటేట్) మాయాజాలంలో భారతదేశ చరిత్రను సృష్టించాడు, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు” అని వెబ్‌సైట్ పేర్కొంది.

విఘ్నేష్ ప్రభు యొక్క యూట్యూబ్‌ని వెతికి లేవిటేటింగ్ వీడియోని పరిశీలించగా, అది ఆగస్టు 8, 2018న అప్‌లోడ్ చేయబడిందని కనుగొన్నాము.”FLYING MAN OF INDIA at 160 FEET | Magician Vignesh prabhu | Exclusive flying magic | Jai hind,”అనే శీర్షికతో ఉంది మరియు ఈ ట్రిక్ కోసం కెమెరా ట్రిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ లేదా రోప్‌లు పయోగించలేదని వీడియో వివరణ స్పష్టం చేసింది.

ఈ ట్రిక్ వెనుక ఉన్న సైన్స్/రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి, మేము Googleలో మరింత వెతకగా,అది ఒక తమిళ వీడియోకి దారితీసింది.వీడియోలో విఘ్నేష్ ప్రభు ‘బిహైండ్‌వుడ్స్ ఎయిర్ ఛానెల్‌’కి (Behindwoods Air channel)ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దాని వెనుక ఉన్న ఉపాయాన్ని/ట్రిక్ని వెల్లడించారు.

లెవిటేటింగ్ ట్రిక్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇంద్రజాలికులు ఉపయోగించిన పురాతన ట్రిక్స్‌లో ఒకటి.ఈ జనాదరణ పొందిన ట్రిక్ ఎలా నిర్వహించబడుతుందో ఇంద్రజాలికుడు(మెజీషియన్) వివరించే YouTube వీడియోను మేము వీక్షించాము. తరచుగా ఈ విన్యాసాలు పట్ట పగలు సన్నని ఎయిర్ క్రాఫ్ట్ కేబుల్స్ సహాయంతో జరుగుతాయని ఇంద్రజాలికుడు వెల్లడించాడు.ఈ సన్నని కేబుల్స్/తాళ్లు పగటి పూట వెలుగులో కనిపించవు ఎందుకంటే అవి సూర్యరశ్మిని ప్రతిబింబిస్తాయి.ఇంద్రజాలికులు(మెజీషియన్) ఈ కేబుల్‌ల జాడలను తొలగించడానికి VFX మరియు ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తారు. ఈ ఉపాయలన్ని దృష్టికి సంబంధించిన భ్రమలు మరియు సైన్సుపై ఆధారపడతాయి.

కాబట్టి ఈ Claim/వాదన తప్పు.

Claim/వాదన: తమిళనాడులో ఒక యువకుడు యోగా వల్ల వచ్చిన శక్తి కారణంగా గాలిలో తేలాడు.

CONCLUSION/నిర్ధారణ: ఆ వీడియోలోని కుర్రాడు ఇంద్రజాలికుడు(మెజీషియన్)విఘ్నేష్ ప్రభు. యోగా వల్ల ఆయన గాలిలో తేలలేదు.ఈ లెవిటేషన్ ట్రిక్ ఒక క్లాసిక్ మ్యాజిక్ ట్రిక్ మరియు సన్నని కేబుల్స్/తాళ్లు పగటి పూట వెలుగులో సూర్యరశ్మిని ప్రతిబింబిస్తూ,కంటికి కనబడని కారణంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంద్రజాలికులు వీటిని ఉపయోగిస్తూ ఈ ట్రిక్ ప్రదర్శిస్తారు.

RATING: ?? – Misinterpretation

[మరి కొన్ని Fact Checks: MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check ;

మొబైల్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లపై GST 31.3% నుంచి 18%కి తగ్గిందని క్లెయిమ్/వాదన వైరల్ అవుతోంది; Fact Check

ఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check]

హమాస్ ఇజ్రాయెల్‌లోకి పారాగ్లైడ్ చేసి ఆడుకునే కోర్టులోకి ప్రవేశించిందని వైరల్ వీడియో ఆరోపించింది; Fact Check

హమాస్ అని పిలవబడే, పాలస్తీనా సైనిక సమూహం, ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి మోటరైజ్డ్ పారాగ్లైడర్‌లను ఉపయోగించింది.అయితే, దాడికి సంబంధం లేని అనేక ఇతర వీడియోలు సోషల్ మీడియాలో హమాస్ చేస్తున్న నిజమైన దాడిని ఎలా చూపుతున్నాయో తెలియజేస్తున్నాయి.అలాంటి ఒక వీడియో పారాగ్లైడర్‌లు ప్లేయింగ్ కోర్ట్ లాగా కనిపించే దానిలోకి దిగుతున్నట్లు చూపిస్తుంది.

వీడియోకు జోడించిన వాదన ప్రకారం, “హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి పారాగ్లైడ్ చేశారు, వారు అమాయక పౌరులను ఊచకోత కోయడానికి, మహిళలు మరియు పిల్లలపై అత్యాచారం మరియు హత్య చేయడానికి ఇంటింటికీ వెళ్లారు.పారాగ్లైడర్‌లు గాలిలో ప్రయాణిస్తూ ప్లేగ్రౌండ్‌లోకి దిగడం వీడియోలో కనిపిస్తుంది.

వీడియో ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ కూడా ఇలాంటి వాదనలతో షేర్ చేయబడింది.వాట్సాప్‌లో వైరల్ అయిన ఈ వీడియోను యొక్క వాస్తవాన్ని తనిఖీ చేయమని Digiteye Indiaకు అభ్యర్థన వచ్చింది.

FACT CHECK

Digiteye India బృందం వారు వీడియోను అనేక కీఫ్రేమ్‌లుగా విభజించి, ప్రతి కీఫ్రేమ్‌లను ఉపయోగించి Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ అమలు చేయగా, 13 రోజుల క్రితం, అంటే సెప్టెంబర్ 30, 2023న YouTubeలో పోస్ట్ చేసిన ఈ వీడియోకి (క్రింద ఉన్న వీడియో) దారితీసింది.వీడియో అరబిక్‌ భాషలో ఉంది , మరియు అనువదించగా’పారాచూట్ ఫోర్సెస్ ఇన్ హెలియోపోలిస్’గా తెలుస్తుంది.వైరల్ అవుతున్న వీడియో, ఈ వీడియో రెండు ఒకటే. ఆడియో కూడా సరిగ్గా సరిపోయింది.

వీడియో యొక్క ఖచ్చితమైన స్థానాన్ని తెలియజేసే క్లూలను కనుగొనడానికి మేము వీడియోను నిశితంగా పరిశీలించాము. 0:01 సెకన్ల వద్ద, భుజంపై సమాంతర చారలతో నీలిరంగు జాకెట్ ధరించిన వ్యక్తిని గుర్తించాము.జాకెట్ వెనుక భాగంలో ‘EL NASR SC’ అని రాసి ఉంది. మేము కీవర్డ్ సెర్చ్ నిర్వహించగా, El Nasr SC అనేది ఈజిప్టులోని కైరోలో ఉన్న ఈజిప్షియన్ ఫుట్‌బాల్ క్లబ్ అని తేలింది.

Googleలో కీవర్డ్ సెర్చ్ నిర్వహించడానికి మేము ఈ ఆధారాలను ఉపయోగించాము. కైరోలో ఎల్-నాస్ర్ (El-Nasr)స్పోర్టింగ్ క్లబ్ ఉందని కనుగొన్నాము.అదే లొకేషనా కదా అని నిర్ధారించడానికి క్లబ్ యొక్క వివిధ చిత్రాలను పరిశీలించాము.Googleలో ఒక వినియోగదారు అదే ప్లేయింగ్ అరేనాని వేరే కోణం నుండి చూపుతూ చిత్రాన్ని పోస్ట్ చేసాడు.ఇది వీడియో యొక్క సరైనా స్థానాన్ని నిర్ధారించడంలో మాకు సహాయపడింది.

కాబట్టి, ఆ వీడియో ఇజ్రాయెల్‌కు చెందినదనే వాదన అబద్ధం.

వాదన/CLAIM: ఇజ్రాయెల్ పౌరులపై దాడి చేయడానికి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోని ప్లేగ్రౌండ్‌లోకి పారాగ్లైడింగ్ చేస్తున్నట్లు వైరల్ వీడియో ఆరోపించింది.

నిర్ధారణ/CONCLUSION: వీడియో ఇజ్రాయెల్‌కి చెందినది కాదు. ఇది ఈజిప్టులో చిత్రీకరించబడింది, ఇక్కడ పారాగ్లైడర్లు కైరోలోని ప్లేగ్రౌండ్‌లోకి దిగుతున్నారు. ఈజిప్టులోని ఎల్-నాస్ర్ (El-Nasr)స్పోర్టింగ్ క్లబ్‌లో వీడియో తీయబడింది.వైరల్ వీడియోలో చూపిన లొకేషన్, స్పోర్టింగ్ క్లబ్‌ లొకేషన్ ఒకటే.

RATING: Misrepresentation-???
[మరి కొన్ని Fact Checks: MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check ;

మొబైల్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లపై GST 31.3% నుంచి 18%కి తగ్గిందని క్లెయిమ్/వాదన వైరల్ అవుతోంది; Fact Check]

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని సైన్యంలోకి పంపారా? Fact Check

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని సైన్యంలోకి పంపారా? Fact Check

గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం మధ్య, హమాస్ ఆకస్మిక దాడిని ప్రారంభించిన తర్వాత, విభిన్న దావాలతో కూడిన పలు వీడియోలు మరియు చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.వైరల్ చిత్రాలలో ఒకటి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని ఆర్మీలో చేరడానికి పంపినట్లు పేర్కొంది.

వైరల్ ట్వీట్ బెంజమిన్ నెతన్యాహు ఒక యువకుడితో ఉన్న చిత్రం కనబడుతుంది. “ఎంతటి నాయకుడు. నిజమైన దేశభక్తి: బెంజమిన్ నెతన్యాహు హమాస్‌పై యుద్ధంలో పాల్గొనేందుకు తన కొడుకును జాతీయ విధుల్లోకి పంపుతున్నాడు. ఇజ్రాయెల్ ఆర్మీ” అని ట్వీట్‌లో ఉంది.

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో బెంజమిన్ నెతన్యాహు కుమారుడు ఇజ్రాయెల్ సైన్యంలో చేరి హమాస్‌కు వ్యతిరేకంగా పోరాడతారని ట్వీట్ పేర్కొంది.

ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ అదే claim/దావాతో చిత్రం షేర్ చేయబడింది.

ఈ వైరల్ ఇమేజ్‌ని ఫ్యాక్ట్ చెక్ చేయమని Digiteye India టీమ్‌ వారికీ వాట్సాప్‌లో రిక్వెస్ట్ వచ్చింది.

FACT CHECK

క్లెయిమ్/దావా యొక్క సత్యాన్ని పరిశీలన చేయడానికి Digiteye India టీమ్‌ Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ను ఉపయోగించగా,’ఫ్రెండ్స్ ఆఫ్ LIBI ‘అని ఇజ్రాయెల్ సైనికులకు మద్దతిచ్చే ఒక ఇజ్రాయెలీ వెబ్‌సైట్ వాళ్ళు పోస్ట్ చేసిన చిత్రం అని తేలింది.డిసెంబర్ 4, 2017 నాటి పోస్ట్‌లో, వెబ్‌సైట్ ఈ చిత్రాన్ని “ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కుమారుడు అవ్నర్ నెతన్యాహు (Avner Netanyahu)ఆర్మీ సర్వీస్‌ను పూర్తి చేశాడు” అని పేర్కొన్న పోస్ట్ కోసం షేర్ చేసింది.

ఇది బెంజమిన్ నెతన్యాహు కుమారుడు అవ్నర్ యొక్క మరిన్ని చిత్రాల కోసం వెతకడానికి దోహదపడింది. మేము కీవర్డ్ ని ఉపయోగించి వెతకగా ‘టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‘ ప్రచురించిన ఈ పోస్ట్‌కు దారితీసింది.డిసెంబరు 1, 2014 నాటి కథనం ప్రకారం, నెతన్యాహు తన కొడుకు తప్పనిసరి ఆర్మీ సర్వీస్‌లో చేరుతున్నందున అతనికి వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొంది.వార్తా ప్రచురణ ఇదే చిత్రాన్ని “డిసెంబర్ 01, 2014న జెరూసలేం అమ్మూనిషన్ హిల్లో వారి కుమారుడు అవ్నర్‌తో కలిసి కనిపించిన ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మరియు అతని భార్య సారా” అనే శీర్షికతో ప్రచురించింది.

“ఇజ్రాయెల్ ప్రధానమంత్రి చిన్న కుమారుడు అవ్నర్ నెతన్యాహు (Avner Netanyahu)సోమవారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌లో తన సైనిక సేవను ప్రారంభిస్తున్నాడు, అతను తల్లిదండ్రులచే హృదయపూర్వక వీడ్కోలు అందుకొన్న తరువాత, అతను బస్సులో ఎక్కడానికి వచ్చాడు” అని వార్తా పత్రిక శీర్షిక పేర్కొంది.

యూదు, డ్రూజ్ లేదా సర్కాసియన్(Jewish, Druze or Circassian) అయిన 18 ఏళ్లు పైబడిన ప్రతి ఇజ్రాయెల్ పౌరుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌లో పనిచేసే ‘తప్పనిసరి విధానం’ ఇజ్రాయెల్లో కలిగి ఉంది.కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పౌరులు నమోదు చేసుకున్న తర్వాత, వారు నిర్ధిష్ట రోజుల పాటు సైన్యంలో పనిచేయవలసి ఉంటుంది.పురుషులు కనీసం 32 నెలలు, మహిళలు కనిష్టంగా 24 నెలలు సేవ చేయాలని భావిస్తున్నారు.పౌరులు ‘ఎలైట్ కంబాట్ యూనిట్ల’ నుండి ‘కంబాట్ సపోర్ట్ యూనిట్ల’ వరకు ఉండే యూనిట్లలో సేవలు అందిస్తారు.

అందువల్ల ఈ దావా తప్పు.

CLAIM/దావా: ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని సైన్యంలోకి పంపారు.

CONCLUSION/నిర్ధారణ: ఈ వైరల్ చిత్రం 2014లో బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని ‘తప్పనిసరి ఆర్మీ సర్వీస్’‌లో చేరడానికి ముందు హృదయపూర్వక వీడ్కోలు అందించడానికి వెళ్లినప్పటి చిత్రం.

RATING: Misrepresentation-???

[మరి కొన్ని Fact checks: నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ మరణించారా? నకిలీ ట్విట్టర్ ఖాతా యొక్క దావా వైరల్ అవుతుంది; Fact Check ; MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check]