Did Kharge not applaud when P.V. Narasimha Rao's son received Bharat Ratna? Fact Check

పీ.వీ నరసింహారావుగారి కుమారుడు భారతరత్న స్వీకరిస్తున్న సమయంలో, ఖర్గే గారు చప్పట్లు కొట్టలేదా? వాస్తవ పరిశీలన

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం భారతరత్న అవార్డులను ప్రదానం చేసిన కార్యక్రమంలో,  దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ప్రకటించిన భారతరత్న అవార్డును ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు అందుకుంటున్న సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చప్పట్లు కొట్టలేదని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర ప్రముఖులు చప్పట్లు కొట్టడం చూడవచ్చు.

 

“అందరూ చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేయగా ఖర్గే గారు ఏమి చేస్తున్నారు.అతని ప్రవర్తన భిన్నంగా, ఉదాసీనంగా ఉంది, సందర్భానుసారంగా లేదు.” భారతీయులందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఒక్క వ్యక్తి తప్ప ” అని మరొక వాదన/దావా పేర్కొంది.

ట్వీట్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

FACT-CHECK

Digiteye India బృందం ట్విట్టర్‌లో “నరసింహారావు భారతరత్న”అనే శీర్షికతో శోధనను నిర్వహించినప్పుడు, అదే వాదన/క్లెయిమ్ తో ఉన్న చిత్రాన్ని చూపుతున్న అనేక ట్వీట్‌లను గమనించాము. కానీ PIB యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో తదుపరి ప్రయత్నించగా, పీ.వీ ప్రభాకర్ రావు అవార్డును అందుకున్న ఒరిజినల్ వీడియో మార్చి 31, 2024న రాష్ట్రపతి అధికారిక Youtube ఖాతాలో అప్‌లోడ్ చేయబడినట్లు గమనించాము.

ఈ వీడియోలో, అవార్డును ప్రకటించినప్పుడు ఖర్గే చప్పట్లు కొట్టడం స్పష్టంగా చూడవచ్చు.
దిగువ చిత్రాలను చూడండి (ఎడమవైపు, అవార్డును స్వీకరించినప్పుడు; కుడివైపు, అవార్డును స్వీకరించే ఒక నిమిషం ముందు అవార్డు ప్రకటించినప్పుడు):

కావున, పివి నరసింహారావు కుమారుడు భారతరత్న అందుకుంటున్న సమయంలో ఖర్గే చప్పట్లు కొట్టలేదన్న వాదన అబద్ధం.

వాదన/Claim:దివంగత పీవీ నరసింహారావుగారి తరపున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ భారతరత్న అందుకున్నప్పుడు, ఖర్గే చప్పట్లు కొట్టలేదనేది వాదన.

నిర్ధారణ/Conclusion: పి.వి నరసింహారావుగారి పేరును ప్రకటించినప్పుడు, ఖర్గే చప్పట్లు కొట్టారు, కానీ వైరల్ చిత్రాన్ని ఆ తరువాత తీసి, దానిని వాదనకు మద్దతుగాఉపయోగించబడింది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

మరి కొన్ని Fact Checks:

ఈ వీడియోలో 26 ఏళ్ల వయసు ఉన్న ప్రధాని మోదీ కేదార్‌నాథ్ వద్ద యోగా ముద్రలో ఉన్నట్టు కనిపిస్తుందా? వాస్తవ పరిశీలన

బెంగళూరులో షాపుల సైన్ బోర్డులు కాషాయ రంగులో ఉంటె వాటిని బెంగళూరు పౌర సంస్థ(BBMP) తొలగిస్తోందా? వాస్తవ పరిశీలన

 

జగన్నాథ రథయాత్ర చిత్రాన్ని కేజ్రీవాల్ అరెస్టుపై నిరసన తెలుపుతున్న ప్రజల చిత్రమని ఉపయోగించారు; వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తర్వాత భారీ సంఖ్యలో ప్రజలు రోడ్డుపై గుమిగూడి, నిరసన తెలుపుతున్నారనేది వాదనతో ఒక చిత్రం షేర్ చేయబడుతోంది.

నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. గత ఏడాది 2023లో జరిగిన ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రలోభారీగా ప్రజలు పాల్గొన్న ఇమేజ్/చిత్రమిది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టుచేసిన సంఘటన పై భారీ సంఖ్యలో ప్రజలు రోడ్డుపై గుమిగూడి,నిరసిస్తున్నారనే వాదనతో ఒక చిత్రం షేర్ చేయబడుతోంది.

ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21, 2024న రాత్రి అరెస్టు చేసి, ఏజెన్సీ కస్టడీలో ఉంచింది. అప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నిరసనలు కొనసాగిస్తోంది. మార్చి 26, 2024న దేశవ్యాప్తంగా అనేక నిరసనలు జరిగాయి. ఈ సందర్భంలో,ఈ విధమైన వాదనతో కూడిన క్రింది చిత్రం సోషల్ మీడియాలో షేర్ చేయబడింది.

మరో వినియోగదారు వాదనను వక్రీకరించి, నిరసనలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని పోస్ట్ చేసారు.
అనువాదం తర్వాత హిందీలోని వాదన ఇలా ఉంది: ” ఈ ఇమేజ్/చిత్రం చూస్తే కాంగ్రెస్‌ అంతం ఖాయమని తెలుస్తుంది… కాంగ్రెస్‌ కుయుక్తులకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లో నిరసన తెలుపుతున్నారు…. ఢిల్లీ.”

ఇదే ఇమేజ్/చిత్రం ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

FACT-CHECK

ప్రధాన ఈవెంట్‌లు లేదా నిరసనల వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గూమిగూడారని తెలపడానికి గతంలో చాలాసార్లు ఈ ఇమేజ్/చిత్రంను ఉపయోగించారు.కావున ఈ ఇమేజ్/చిత్రం బాగా తెలిసినందున Digiteye India టీమ్ దీని వాస్తవ-పరిశీలనకు పూనుకుంది. మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో ఒరిజినల్ ఇమేజ్ కోసం వెతకగా, అది 2023లో జరిగిన ప్రసిద్ధ జగన్నాథ్ పూరీ రథయాత్రలో పాల్గొన్న జనసమూహానికి సంబంధించిన ఇమేజ్/చిత్రమని గమనించాము.

ఇది వాస్తవానికి జూన్ 20, 2023న జగన్నాథ్ పూరీ రథయాత్ర మరియు వివరణతో పాటు sri_mandir వినియోగదారు ద్వారా Instagram ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ఈ చిత్రాన్ని గతంలో చాలాసార్లు అనేక వాదనలతో ఉపయోగించారు కానీ తప్పుడు వాదనలని నిరూపించబడింది. Google FactCheck Explorerలో ఈ ఇమేజ్/చిత్రాన్ని పరిశీలించగా, ఫలితాలు క్రింది విధంగా ఉన్నాయి. కాబట్టి, వాదన/దావా తప్పు.

మరి కొన్ని Fact Checks:

ఒడిశాలోని కోణార్క్ ఆలయం లోపల సూర్యుడు ఉదయిస్తాడా? వాస్తవ పరిశీలన

నాగార్జున సిమెంట్స్ వారు 9/11లో జరిగిన దాడుల నేపథ్యంతో కూడిన ప్రకటనను తయారుచేసారా? వాస్తవ పరిశీలన

 

ఈ వీడియోలో 26 ఏళ్ల వయసు ఉన్న ప్రధాని మోదీ కేదార్‌నాథ్ వద్ద యోగా ముద్రలో ఉన్నట్టు కనిపిస్తుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:ప్రధాని మోదీ తన 26 ఏళ్ల వయసులో కేదార్‌నాథ్ ఆలయంలో హ్యాండ్‌స్టాండ్ యోగా ముద్రను ప్రదర్శించారని, ఇది మోదీజీకి సంబంధించిన అరుదైన వీడియో అనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. వీడియోలో హ్యాండ్‌స్టాండ్ యోగా చేస్తున్న వ్యక్తి “ఆచార్య సంతోష్ త్రివేది”గారిది, 26 ఏళ్ల వయసులో ఉన్నప్పటి ప్రధాని మోదీగారిది కాదు.

రేటింగ్: పూర్తిగా తప్పు —

ఒక యోగి తన చేతులపై తలక్రిందులుగా నడుస్తున్నవీడియోలో, ఇతను ఏదో ఒక రోజు భారత ప్రధాని అవుతారని ఎవరూ అనుకోలేదు, పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోడీని ప్రస్తావిస్తూ చేస్తున్న దావా/వాదన సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది.

ఇదే వాదన/దావాతో పోస్ట్ ఇక్కడ మరియు ఇక్కడ హిందీ భాషలో షేర్ చేయబడింది. అనువాదం ఇలా ఉంది:
“ఈ వీడియో తీసినప్పుడు ఈ యోగి ఏదో ఒకరోజు దేశానికి ప్రధాని అవుతారని ఊహించి ఉండరు.అటువంటి దివ్యమైన ఆత్మ. మంచు(హిమపాతం) మధ్య తలక్రిందులుగా చేతులతో నడుస్తూ కేదార్‌నాథ్‌కు ప్రదక్షిణలు చేస్తున్నారు. అలాంటి ఆత్మలు భూమిపైకి వచ్చినప్పుడల్లా చాలా మంది వారిని దుర్భాషలాడారు. కానీ ఈరోజు ఆయన పూజలందుకుంటున్నారు.”

ఇదే వీడియోని  ఏడాది క్రితం ప్రధాని మోదీకి 26 ఏళ్ల వయసులో యోగ చేస్తుండగా తీసిన వీడియో అని నేరుగా క్లెయిమ్ చేస్తూ షేర్ చేసినట్లు గమనించాము.తెలుగు అనువాదం ఇలా ఉంది: “రిషికేశ్‌లోని సాధు దయానంద్ జీ ఆశ్రమంలో యోగా నేర్చుకున్నప్పుడు అతని వయస్సు ఇరవై ఆరు సంవత్సరాలు. ఈరోజు మన ప్రధానమంత్రి అయిన ఈ సన్యాసి/యోగిని గుర్తించండి. మోదీజీకి సంబంధించిన అరుదైన వీడియో ఇది.”

FACT-CHECK:

వీడియోలో ఉన్న వ్యక్తి ప్రధాని మోదీని పోలి లేనందున, Digiteye ఇండియా బృందం , వీడియో నుండి కొన్ని ఫ్రేమ్‌లను తీసి వాటిని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో తనిఖీ చేసి, వీడియో యొక్క ప్రామాణికతను పరిశీలించగా, శ్రీ కేదార్ 360 ట్రస్ట్ వారి అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో జూన్ 21,2021న అప్‌లోడ్ చేసిన అసలైన వీడియోను గమనించాము.

వీడియో క్యాప్షన్‌ ఈ విధంగా ఉంది:
“తీర్థ పురోహిత్ ‘ఆచార్య శ్రీ సంతోష్ త్రివేది’ కేదార్‌నాథ్ ఆలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. శ్రీ ఆచార్య జీ కలిగి ఉన్న నైపుణ్యం మరియు యోగ్యత ఆదర్శప్రాయమైనది మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వ్యక్తులకు ప్రేరేపణ కలిగిస్తుంది. జై శ్రీ కేదార్నాథ్.”

2021న వైరల్ చిత్రం సోషల్ మీడియా సర్కిల్‌లలో కనిపించడానికి ఒక సంవత్సరం ముందే, అనగా మార్చి 24, 2020న వార్తా సంస్థ ANI, ఆచార్య శ్రీ సంతోష్ త్రివేది కేదార్‌నాథ్ ఆలయంలో హ్యాండ్‌స్టాండ్(తలక్రిందులుగా) యోగా ముద్రను ప్రదర్శించిన నివేదికను ప్రచురించిందని తదుపరి పరిశోధనలో వెల్లడైయింది.
అందుకే, ప్రధాని మోదీ 26 ఏళ్ల వయసులో హ్యాండ్‌స్టాండ్ యోగా ముద్రను ప్రదర్శిస్తున్నట్లు వీడియోలో కనబడుతుందనే వాదన తప్పు.

మరి కొన్ని Fact Checks:

ఒడిశాలోని కోణార్క్ ఆలయం లోపల సూర్యుడు ఉదయిస్తాడా? వాస్తవ పరిశీలన

బెంగళూరులో షాపుల సైన్ బోర్డులు కాషాయ రంగులో ఉంటె వాటిని బెంగళూరు పౌర సంస్థ(BBMP) తొలగిస్తోందా? వాస్తవ పరిశీలన

సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తున్నప్పుడు CJI కోర్టు గదిని విడిచిపెట్టి వెళ్లిపోయారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తుండగా, ప్రధాన న్యాయమూర్తి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: పూర్తిగా తప్పు.తప్పుడు వాదన చేయడం కోసం వీడియో ఆకస్మికంగా కత్తిరించబడింది. సెషన్ మొత్తం సీజేఐ అక్కడే ఉన్నట్లు ఒరిజినల్ వీడియోలో కనిపిస్తుంది.

రేటింగ్: పూర్తిగా తప్పు-- 

రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్లపై చారిత్రక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తుండగా చీఫ్ జస్టిస్ డీ.వై చంద్రచూడ్ బయటకు వెళ్లిపోతున్న వీడియో సోషల్ మీడియాలో విభిన్నమైన వాదనలతో వైరల్‌గా మారింది.

జయేష్ మెహతా అనే వినియోగదారు చేసిన ఒక పోస్ట్ ట్విట్టర్‌లో చర్చకు దారితీసింది.

క్యాప్షన్ ఇలా ఉంది: “#CJI ఈ విధంగా ఎలా ప్రవర్తిస్తారు? SG, CJI ముందు తన వాదనలను వినిపిస్తుండగా అతను మరియు ఇతర న్యాయమూర్తులు వాయిదా వేయకుండా లేచి వెళ్లిపోయారు.. ఇది భారత ప్రభుత్వానికి ఘోర అవమానం…CJI చంద్రచూడ్‌తో సహా న్యాయమూర్తులందరినీ తీసేసి, భారత రాష్ట్రపతి ద్వారా వారందరి చేత బలవంతంగా రాజీనామా చేయించాలి. అతను మరియు ఇతర న్యాయమూర్తులు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారు.. న్యాయమూర్తుల ఈ వైఖరికి గల కారణాలను నేను త్వరలోనే ఒక థ్రెడ్ ను పోస్ట్ చేస్తాను”.

ప్రధాన న్యాయమూర్తి డీ.వై చంద్రచూడ్

FACT-CHECK

మొత్తం వీడియో చూసినప్పుడు, సొలిసిటర్ జనరల్ తన వాదనలు వినిపిస్తున్నప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి కోర్టు గదిని విడిచిపెట్టి వెళ్లకుండా ఉండడం గమనించవచ్చు. మేము అసలు వీడియో కోసం యు ట్యూబ్లో ప్రయత్నించగా, మార్చి 18, 2024న ఈ క్రింది వీడియో అప్‌లోడ్ చేయబడినట్లు గమనించాము.

ఆరోపించిన సంఘటన 24 నిమిషాల నుండి 27 నిమిషాల వ్యవధి మధ్యలో జరుగుతుంది మరియు ప్రధాన న్యాయమూర్తి తన సహోద్యోగులతో మాట్లాడటం మరియు తన సీటును సర్దుబాటు చేసుకుంటుడడం స్పష్టంగా చూడవచ్చు, కానీ సీటును వదిలి వెళ్ళలేదు. నిజానికి ఎలాంటి అంతరాయం లేకుండానే కోర్టు వ్యవహారాలు కొనసాగాయి.

24వ నిమిషం వద్ద వీడియోను హఠాత్తుగా ముగించడం ద్వారా, ప్రధాన న్యాయమూర్తి కోర్టు గది నుండి బయటకు వెళ్లినట్లు తప్పుడు వాదన చేయబడింది. కాబట్టి, దావా/వాదన పూర్తిగా తప్పు.

మరి కొన్ని Fact Checks:
భారతదేశ వ్యాప్తంగా అన్ని బాణసంచా అమ్మకాలు మరియు వాటి వాడకాన్ని సుప్రీంకోర్టు నిషేధించిందా? వాస్తవ పరిశీలన
బెంగళూరులో షాపుల సైన్ బోర్డులు కాషాయ రంగులో ఉంటె వాటిని బెంగళూరు పౌర సంస్థ(BBMP) తొలగిస్తోందా? వాస్తవ పరిశీలన

మార్చి 15న అమితాబ్ బచ్చన్ యాంజియోప్లాస్టీ చేయించుకున్నారా; వాస్తవ పరిశీలన

వాదన./Claim: మార్చి 15, 2024న అమితాబ్ బచ్చన్‌ను ఆసుపత్రికి తరలించి యాంజియోప్లాస్టీ నిర్వహించారనేది వాదన.

నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. అమితాబ్ బచ్చన్‌ తాను యాంజియోప్లాస్టీ చేయించుకున్న విషయాన్ని ఖండించారు.

రేటింగ్: తప్పు దోవ పట్టించే వార్త —

వాస్తవ పరిశీలన వివిరాలు:

ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మార్చి 15, 2024న శుక్రవారం ఉదయం యాంజియోప్లాస్టీ కోసం ఆసుపత్రిలో చేరినట్లు అనేక వార్తా సంస్థలు మరియు సోషల్ మీడియా బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేయడం ప్రారంభించాయి.
81 ఏళ్ల నటుడి ఆరోగ్య విషయమై, అతను యాంజియోప్లాస్టీ చేయించుకున్నట్లు అనేక టీవీ న్యూస్ ఛానెల్‌లలో ప్రసారం చేయబడింది. వార్తలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

“అమితాబ్ బచ్చన్ యాంజియోప్లాస్టీ చేయించుకున్నట్లు కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారని” ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక స్పష్టంగా తెలిపింది. టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క మరొక నివేదిక ప్రకారం, నటుడు అతని గుండెపై కాకుండా రక్తం కాలులో గడ్డకట్టడం వలన”యాంజియోప్లాస్టీ” చేయించుకున్న తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని తెలుస్తోంది.

FACT  CHECK

కొందరు ఆసుపత్రిలో చేరడాన్ని తిరస్కరించగా మరియు మరికొందరు కరోనరీ యాంజియోప్లాస్టీని తిరస్కరిస్తు వస్తున్నా విరుద్ధమైన నివేదికలు ఉన్నందున Digiteye India బృందం వాస్తవ పరిశీలనకు పూనుకుంది. మొదటిది, నటుడిని శుక్రవారం తెల్లవారుజామున ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు అక్కడ అతను అనారోగ్యం కోసం చికిత్స పొందారనేది స్పష్టమైంది, కానీ అనారోగ్య విషయాలను ధ్రువీకరించలేదు.

రెండవది, కరోనరీ యాంజియోప్లాస్టీ చేయించుకున్నని వ్యక్తి మరుసటి రోజే నడవమని  వైద్యులు సలహా ఇవ్వరు.కానీ నటుడు మరుసటి రోజు ఆరోగ్యంగా తన సాధారణ రీతిలో నడుస్తూ కనిపించారు. మరుసటి రోజు అతని ఆరోగ్యం గురించి ప్రశ్నించినప్పుడు, నటుడు తాను యాంజియోప్లాస్టీ చేయించుకోలేదని ఖండించారు మరియు దానిని “ఫేక్ న్యూస్” అని కొట్టి పారేశారు. క్రింద Instagramలో వీడియో చూడండి:

అందువలన, నటుడిని మార్చి 15, 2024న ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తీసుకెళ్లింది వాస్తవమే అయిన అనారోగ్యం గురించి ఖచ్చితమైన వార్తా నివేదికలు లేవు. ఆయన యాంజియోప్లాస్టీ చేయించుకున్నారనేది అవాస్తవం.

మరి కొన్ని Fact Checks:

ఒడిశాలోని కోణార్క్ ఆలయం లోపల సూర్యుడు ఉదయిస్తాడా? వాస్తవ పరిశీలన

బెంగళూరులో షాపుల సైన్ బోర్డులు కాషాయ రంగులో ఉంటె వాటిని బెంగళూరు పౌర సంస్థ(BBMP) తొలగిస్తోందా? వాస్తవ పరిశీలన

 

 

ఒడిశాలోని కోణార్క్ ఆలయం లోపల సూర్యుడు ఉదయిస్తాడా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఒడిశాలోని కోణార్క్ ఆలయం లోపల సూర్యుడు ఉదయిస్తాడనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. చిత్రాలు ఒడిశాలోని కోణార్క్ దేవాలయం లోనివి కాదు, థాయ్‌లాండ్‌లోనివి.

రేటింగ్: పూర్తిగా తప్పు- 

వాస్తవ పరిశీలన వివరాలు

సోషల్ మీడియా వినియోగదారులు ఒడిశాలోని కోణార్క్ దేవాలయం ముఖ ద్వారం లోపలి నుండి ఉదయిస్తున్నసూర్యుడి చిత్రాన్ని షేర్ చేస్తున్నారు.ఆలయం లోపల నుండి సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా ఆలయ నిర్మాణం జరిగింది. ఈ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉండటం షేర్ చేసిన చిత్రంలో చూడవచ్చు.

ఇది “200 సంవత్సరాలకు ఒకసారి ఎలా జరుగుతుందని” అని వినియోగదారులు షేర్ చేసుకుంటున్నారు.
Digiteye India బృందంకు వాస్తవ పరిశీలన చేయమని Whatsapp నంబర్‌లో అభ్యర్ధన అందుకుంది.
షేర్డ్ మెసేజ్ ఈ విధంగా ఉంది: “ఇది కోణార్క్ ఆలయం లోపలి సూర్యోదయం. ఈ సంఘటన 200 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని వారు చెప్పారు.”

Fact Check:

ఈ చిత్రం ఎంత పాతదో తెలుసుకోవడానికి మేము సోషల్ మీడియాను పరిశీలించినప్పుడు, ఇది 2015 నుండి ప్రచారంలో ఉందని మేము గమనించాము. YouTubeలో కూడా మేము ఇలాంటి వీడియోలు ఉన్నాయని తెలుకున్నాము.

క్షుణ్ణంగా పరిశీలిస్తే, వైరల్ చిత్రంలో ఉన్న ఆలయ నిర్మాణ శైలికి ఒడిశాలోని కోణార్క్ ఆలయ నిర్మాణ శైలికి పోలిక ఉన్నట్లు కనపడదు. ప్రధాన ఆలయం/ముఖ ద్వారం ఏకశిలా సారూప్యంగా(ఒకేలా) కనిపిస్తున్నప్పటికీ, పక్కన గోడలు మరియు ఇరువైపులా ఆలయ గోపురాలు కోణార్క్ ఆలయా ప్రధాన నిర్మాణానికి జోడించబడలేదు.

Sun Temple / Wikipedia CC

గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అది థాయ్‌లాండ్‌లోని ప్రసాత్ హిన్ ఫానోమ్ రంగ్ టెంపుల్ అని తేలింది. ఫానోమ్ రంగ్ అని కూడా పిలుస్తారు, ఈ హిందూ ఖైమర్ సామ్రాజ్య దేవాలయం థాయ్‌లాండ్‌లోని ఇసాన్‌లోని బురిరామ్ ప్రావిన్స్‌లో అంతరించిపోయిన అగ్నిపర్వతం అంచులపై నిర్మించబడి ఉంది. 10వ-13వ శతాబ్దాల మధ్య నిర్మించబడి, ఇది ప్రధానంగా హిందూ దేవుడు శివుని ఆలయం.


Phanom Rung Temple / Tourism Authority of Thailand (TAT)

ఈ ఆలయం అన్ని తోరణాల/ద్వారాల గుండా సూర్యుడు ప్రకాశిస్తూ, అపురూపమైన సూర్య కిరణాలు కూడా ప్రసిద్ధి చెందింది.
“ప్రసిద్ధమైన, చారిత్రాత్మక దేవాలయం యొక్క మొత్తం పదిహేను రాతి ద్వారాల గుండా సూర్యుడు సంవత్సరంలో నాలుగు సార్లు ప్రకాశిస్తాడని బురిరామ్ టైమ్స్ పేర్కొంది.
ఇది 3 నుండి 5 ఏప్రిల్ వరకు మరియు 8 నుండి 10 సెప్టెంబర్ వరకు సూర్యోదయం సమయంలో మరియు 5 నుండి 7 మార్చి వరకు మరియు 5 నుండి 7 అక్టోబర్ వరకు సూర్యాస్తమయం సమయంలో జరుగుతుంది (కొన్ని సంవత్సరాలలో ఒక రోజు ముందు జరుగుతుంది). సూర్యుడు శివలింగాన్ని తాకుతూ వెళుతుండగా, అది చూసేవాళ్లకు అదృష్టాన్ని కలిగిస్తుందని గాఢ నమ్మకం.

బ్యాంకాక్ పోస్ట్ “సూర్యునికి సంబంధించిన ఈ సంఘటనలు(solar events)మార్చి మరియు సెప్టెంబర్‌లలో విషువత్తులకి(equinoxes)ఇరువైపులా ఏటా సుమారు 14 రోజులు ఎలా జరుగుతాయనేది” నివేదిస్తుంది.

మరి కొన్ని fact Checks:

బెంగళూరులో షాపుల సైన్ బోర్డులు కాషాయ రంగులో ఉంటె వాటిని బెంగళూరు పౌర సంస్థ(BBMP) తొలగిస్తోందా? వాస్తవ పరిశీలన

నాగార్జున సిమెంట్స్ వారు 9/11లో జరిగిన దాడుల నేపథ్యంతో కూడిన ప్రకటనను తయారుచేసారా? వాస్తవ పరిశీలన

 

బెంగళూరులో షాపుల సైన్ బోర్డులు కాషాయ రంగులో ఉంటె వాటిని బెంగళూరు పౌర సంస్థ(BBMP) తొలగిస్తోందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:హిందూ దుకాణా యజమానుల కాషాయ రంగు సైన్ బోర్డులను కర్ణాటక ప్రభుత్వం తొలగిస్తోందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. BBMP ఫిబ్రవరి 28, 2024 గడువుతో బెంగళూరులో 60% కన్నడ సైన్‌బోర్డ్‌ల నియమాన్ని అమలు చేసింది, తర్వాత దీన్ని రెండు వారాలు పొడిగించారు.

రేటింగ్: తప్పు దోవ పట్టించే ప్రయత్నం–

వాస్తవ పరిశీలన వివిరాలు

“కర్ణాటకలో మీ దుకాణానికి,ఇంటికి, “కర్ణాటకలో మీ దుకాణానికి,ఇంటికి, పరిసర ప్రాంతాలకి, దేవాలయానికి కాషాయ రంగు ఉపయోగించరాదు” అని హిందీలో ఉన్న సందేశంతో కూడిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది.

మే 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, సోషల్ మీడియాలో ఇలాంటి వాదనలు కనిపిస్తున్నాయి.

See the video here:

కొంతమంది మునిసిపల్ కార్మికులు ఒక దుకాణం ముందు కాషాయ రంగులో ఉన్న ఇంగ్లీష్ సైన్ బోర్డును మరియు దాని ప్రక్కన ఉన్న మరొక భవనం నుండి తొలగిస్తున్న దృశ్యాలు వీడియోలో చూడవచ్చును.

వీడియో ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

FACT CHECK

కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే సైన్ బోర్డులపై కన్నడలో 60:40 నిబంధనను కొనసాగించాలని ఆదేశాలను అమలు చేసింది మరియు వాణిజ్య సంస్థలకు దానికి కట్టుబడి ఉండాలని కోరింది.ఈ చర్యలో భాగంగా ఇంగ్లీషులో ఉన్న సైన్ బోర్డులను తొలగించేందుకు పలువురు మున్సిపల్ కార్మికులు రంగంలోకి దిగారు. సైన్‌బోర్డ్ రంగుకు నిబంధనకు ఎలాంటి సంబంధం లేదు.

బెంగళూరు పౌర సంస్థ — బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) — ఫిబ్రవరి 28 గడువుతో 60:40 నిబంధనను అమలు చేయని దుకాణాలు/వ్యాపారులు మరియు భవనాలపై చర్యను ప్రారంభించింది,కానీ తర్వాత గడువు మరో రెండు వారాలు పొడిగించబడింది.

కాషాయ రంగు బోర్డ్‌ ఉన్న దుకాణం యజమాని మంజునాథ్ రావు, కన్నడ భాషా నియమాలకు కట్టుబడి ఉండనందుకు తన దుకాణం సైన్‌బోర్డ్‌ను తొలగించారని, మతపరమైన కారణం ఏది లేదని వార్తా సంస్థ AFPకి తెలిపారు. కాబట్టి, బెంగళూరులో కాషాయ రంగులో ఉన్న సైన్‌బోర్డ్‌లను తొలగిస్తున్నారనే వాదన అవాస్తవం.

మరి కొన్ని Fact  Checks:

ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందా? వైరల్ అవుతున్న నకిలీ సర్క్యులర్; వాస్తవ పరిశీలన

బెంగళూరు టెర్మినల్ 2 చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి; Fact Check

నాగార్జున సిమెంట్స్ వారు 9/11లో జరిగిన దాడుల నేపథ్యంతో కూడిన ప్రకటనను తయారుచేసారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:నాగార్జున సిమెంట్స్ తన ప్రకటనలో ‘కనికరం’ లేకుండా 9/11 థీమ్‌ను(9/11లో జరిగిన దాడుల నేపథ్యంతో కూడిన ప్రకటనను తయారుచేసింది) ఉపయోగించిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. నాగార్జున సిమెంట్స్‌వారు అలాంటి ప్రకటన ఏదీ చూపలేదు.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు

ఇది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సిమెంట్ తయారీదారు నాగార్జున సిమెంట్ యొక్క ప్రకటన అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేయబడుతోంది. యానిమేషన్‌లో విమానం న్యూయార్క్ నగరంలోని టవర్ను డీ-కొంటున్నట్లు కానీ టవర్స్ లోకి చొచ్చుకుపోలేక, త్వరగా వెనక్కి వెళ్లి అవతలి వైపుకు వెళ్లి ఎగిరిపోతున్నట్లు చూడవచ్చును.ఇది 9/11 దాడిని గుర్తుచేస్తుంది.ఈ వీడియోలో తెలుగు నటుడు వరుణ్ తేజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపిస్తారు. “భారతీయ ప్రకటనలు దయ(కనికరం) లేనివి” అనే శీర్షికతో దీనిని సెర్గీ కిరియానోవ్ అనే ట్విటర్ వినియోగదారు షేర్ చేసారు.

వీడియోను ఇక్కడ చూడండి:

FACT CHECK

Digiteye India బృందం వాట్సాప్ టిప్‌లైన్‌లో అభ్యర్థనను స్వీకరించి, ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రసిద్ధ సిమెంట్ అయిన నాగార్జున సిమెంట్స్‌ వారు అటువంటి ప్రకటనేమైనా తయారుచేశారని పరిశీలించింది.వరుణ్ తేజ్ దాని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండగా, న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్‌పై 9/11 విమాన దాడుల నేపధ్యాన్ని ఉపయోగించి తీసిన వీడియో ఏదీ లేదు. వరుణ్ తేజ్ నటించిన నాగార్జున సిమెంట్స్ యొక్క తాజా ప్రకటనను ఇక్కడ చూడవచ్చు:

https://www.youtube.com/@nagarjunacement3145

9/11 దాడుల నేపథ్య ప్రకటనకు సంబంధించి నాగార్జున సిమెంట్స్‌ గురించి మరింత శోధన చేయగా ఎటువంటి సమాచారం మరియు వీడియో అందుబాటులో లేదు. Digiteye India బృందం నాగార్జున సిమెంట్స్‌కి ఈ ప్రకటనపై స్పష్టత ఇవ్వాలంటూ ఒక ఇమెయిల్ పంపింది.

మరిన్ని వివరాల కోసం ప్రయత్నించగా,అది నకిలీ వీడియో అని వినియోగదారు స్వయంగా అంగీకరించారని మరియు ట్విట్టర్‌లోని సంభాషణను ఇక్కడ చూడండి:

కాబట్టి,ఈ వీడియో ఫేక్ (నకిలీది).

మరి కొన్ని Fact Checks:

ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందా? వైరల్ అవుతున్న నకిలీ సర్క్యులర్; వాస్తవ పరిశీలన

కల్తీ పాల వల్ల 2025 నాటికి 87% భారతీయులు క్యాన్సర్ బారిన పడతారని WHO హెచ్చరిక జారీ చేసిందా? వాస్తవ పరిశీలన

 

ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందా? వైరల్ అవుతున్న నకిలీ సర్క్యులర్; వాస్తవ పరిశీలన

వాదన/Claim:ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందని, మార్చి 12, 2024 నుంచి ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని సర్క్యులర్ పేర్కొంటున్నట్లు వాదన.

నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన.భారత ఎన్నికల సంఘం అటువంటి ప్రకటన ఏదీ చేయలేదు మరియు ఈ దావా నకిలీదని కొట్టిపారేసింది.

రేటింగ్: తప్పుదారి పట్టించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు

2024 సార్వత్రిక ఎన్నికల తేదీలపై భారత ఎన్నికల సంఘం (ECI) అధికారికంగా ఒక సర్క్యులర్ విడుదల చేసిందని పేర్కొంటూ వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక పోస్ట్  షేర్ చేయబడుతోంది.
Digiteye India Team తన టిప్‌లైన్‌లో వాస్తవాన్ని పరిశీలన చేయమంటూ మూడు అభ్యర్థనలను అందుకుంది.

నామినేషన్ల తేదీలు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల యొక్క తేదీలు ప్రచురించిన ఫోటో మరియు ప్రవర్తనా నియమావళి మార్చి 12, 2024 నుండి అమలులోకి వస్తుందని పేర్కొంటున్న ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వంటి విభిన్న శీర్షికలతో వాట్సాప్‌లో ఫోటో షేర్ చేయబడుతోంది. మరియు EC చీఫ్ అనగా ప్రధాన ఎన్నికల అధికారి కాదు, ప్రధాన ఎన్నికల కమీషనర్ కాబట్టి, మేము వైరల్ పోస్ట్ వాస్తవ పరిశీలన చేయటానికి పూనుకున్నాము.

Fact Check

లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్-మే 2024లో జరిగే అవకాశం ఉంది, అయితే ఎన్నికల సంఘం షెడ్యూల్ గురించి ఇప్పటివరకు ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.ECI అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించేవరకు, ప్రవర్తనా నియమావళి అమలులోకి రాదు,కానీ ఒక్కసారి షెడ్యూల్‌ ప్రకటిస్తే మాత్రం దేశంలోని అన్ని వార్తా సంస్థలు కవర్ చేయడానికి ఇది ఒక ప్రధాన వార్త అవుతుంది.

మేము భారత ఎన్నికల సంఘం యొక్క అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో సమాచారం కోసం చూడగా, సోషల్ మీడియాలో షేర్ చేయబడిన దావాను నిరాకరిస్తూ Xలో పోస్ట్ చేయబడిన క్రింది ప్రకటనను మేము గమనించాము.

క్యాప్షన్ ఇలా ఉంది, “#LokSabhaElections2024 #FactCheck షెడ్యూల్‌కు సంబంధించి వాట్సాప్ లో నకిలీ సందేశం షేర్ చేయబడుతోంది: సందేశం #నకిలీది.  #ECI ద్వారా ఇప్పటివరకు ఎటువంటి తేదీలు ప్రకటించబడలేదు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను మీడియా సమావేశం ద్వారా ప్రకటిస్తుంది. #VerifyBeforeYouAmplify”.(మీరు వ్యాపించే/విస్తరించే ముందు ధృవీకరించండి).కాబట్టి, సర్క్యులర్ మరియు దావా తప్పు.నిజం లేదు.

మరి కొన్ని ఫాక్ట్ చెక్స్

175 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీకి 142 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్ సర్వేలో తేలిందా? వాస్తవ పరిశీలన

భారతదేశంలో పోస్ట్ మాస్టర్ ఎంపిక ఈ విధంగా జరుగుతుందనే వాదనతో ఒక వీడియో వైరల్ అవుతోంది ; వాస్తవ పరిశీలన

 

175 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీకి 142 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్ సర్వేలో తేలిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 142 సీట్లతో వైఎస్సార్‌సీపీ(YSRCP) విజయం సాధిస్తుందని ఏబీపీ న్యూస్ సర్వే గ్రాఫిక్ ద్వారా కనపడుతుందనేది వాదన.

నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. YSRCPకి 142 సీట్లు వస్తాయని చూపించే వైరల్ ఒపీనియన్ పోల్ గ్రాఫిక్ కల్పితమని, ABP తాను అలాంటి సర్వే ఏది చేయలేదని కొట్టిపారేసింది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన సర్వే ఏబీపీ న్యూస్‌కి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.అధికార వైఎస్సార్‌సీపీకి(YSRCP) 142 సీట్లు రావచ్చని, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన యొక్క ప్రతిపక్ష కూటమికి 33 సీట్లు వస్తాయని పేర్కొంది.ట్విట్టర్‌లో షేర్ చేయబడిన చిత్రాన్ని/ట్వీట్ ని ఇక్కడ చూడండి:

FACT CHECK

DigitEye India బృందం ABP న్యూస్ నిర్వహించిన ఒరిజినల్ సర్వే రిపోర్టు కోసం తనిఖీ చేయగా, ABP న్యూస్ తన వెబ్‌సైట్‌లో వారు నిర్వహించిన అటువంటి సర్వే ఏది లేదని పేర్కొన్న వార్తాను గమనించారు.క్లెయిమ్‌ను ఫేక్ అని పేర్కొంటూ, ఫిబ్రవరి 29, 2024న ABP న్యూస్ “ఫేక్ న్యూస్ అలర్ట్”ని జారీ చేసింది మరియు ABP లైవ్ మరియు CVoter రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అటువంటి డేటా ఏదీ ప్రచురించలేదని నొక్కి చెప్పింది.

“ఏబీపీ లైవ్ చిత్రాన్ని కలిగి ఉన్న పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2024కి సంబంధించి ABP నెట్‌వర్క్ లేదా మరే ఇతర అనుబంధ సంస్థ అటువంటి డేటాను విడుదల చేయలేదు… వైరల్ పోస్ట్‌లో చేసిన క్లెయిమ్‌/వాదనలకు విరుద్ధంగా, ABP లైవ్ మరియు CVoter ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2024 ఎన్నికలకి సంబంధించి ఎలాంటి అంచనాలు లేదా డేటాను జారీ చేయలేదని” నివేదికలో పేర్కొంటు వాదనని ఖండించారు.

Twitterలో షేర్ చేసిన ఖండించిన నివేదికను ఇక్కడ చూడండి:

రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP 142 సీట్లు గెలుచుకోవచ్చని చెప్పడానికి ఇమేజీని/చిత్రాన్ని కల్పించి విడుదల చేయబడింది. కాబట్టి ఈ వాదన తప్పు.

మరి కొన్ని Fact Checks:

‘భారత్ మాతా కీ జై’ మరియు ‘జై శ్రీరామ్’అని ప్రజలు నినాదాలు చేస్తే ఆకలితో చనిపోతారని రాహుల్ గాంధీ ఈ వీడియోలో అన్నారా? వాస్తవ పరిశీలన

బీజేపీ గుర్తు(కమలం)తో కూడిన టీ-షర్ట్ ను రాహుల్ గాంధీ ధరించారని తప్పుడు చిత్రం షేర్ చేయబడుతోంది; వాస్తవ పరిశీలన