UAE నుంచి కేరళ పునరావాస సహాయం? వివాదానికి దారి తీసిన నకిలీ వార్తలు

kerala floods UAE aid fake news
Prime Minister Narendra Modi conducting an aerial survey of flood affected areas, in Kerala on August 18, 2018. (PIB)

విదేశీ సహాయాన్ని స్వీకరించడం గురించి మోడీ ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైయ్యింది. UAE ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు సహాయంగా ఇవ్వడానికి తయారుగా ఉన్నదని, కానీ మోడీ ప్రభుత్వం దాన్ని తిరస్కరించిందంటూ వార్తలు వెలువడ్డాయి.

భారతీయ జనతా పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నాయకులలో కేంద్ర, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రులు ఈ వివాదం లో ఉన్నారు. ఆశ్చర్యకరంగా, మాజీ విదేశాంగ కార్యకర్తలు కూడా అలాగే అభిప్రాయపడ్డారు.

2016 మే లో ప్రభుత్వం తన 200 పేజీల జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక పత్రాన్ని ఆవిష్కరించింది. విదేశాల్లో సహాయం కోసం భారతదేశం సంసిద్ధంగా ఉండకపోయినా, దేశం సహాయ ఆఫర్లను స్వీకరిస్తుందని ఈ విధాన పత్రం స్పష్టంగా చెబుతోంది. ముఖ్యంగా ఆగస్టు 22 న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కేరళ వరద సాయాన్ని హర్షించింది.

కాని ఒక జాతీయ న్యూస్ పేపర్లో వాసు అనే రిపోర్టర్ స్వంత విశ్లేషణతో UAE గవర్నమెంట్ నుండి వచ్ఛే సహాయాన్ని తిరస్కరించిందంటూ రాసాడు. నిజానికి, ఒక ఎమిరేట్స్ ఎయిర్ కార్గో ఫ్లైట్ తిరువనంతపురం వచ్చింది, యుఎఇ ప్రభుత్వ సంస్థలు, మానవతా సంస్థలు, నివాసితులు మరియు వ్యాపారాల ద్వారా విరాళంగా అందించబడిన కేరళకు 175 టన్నుల వస్తువులని తెచ్చింది. ఇంకా 13 విమానాలు సహాయాన్ని తీసుకొని రావచ్చని అంచనా వేస్తున్నారు.

ఇంతలో, జాతీయ మీడియా మోడీ ప్రభుత్వం UAE క్రౌన్ ప్రిన్స్ ఆఫర్ను తిరస్కరించిందని చెప్పినట్లుగా నకిలీ వార్తలను వెల్లడించడం ద్వారా కొత్త వివాదం ప్రారంభించింది. దీనికి తోడు మోడీ ట్వీట్ ను కూడా ఉపయోగించారు:

A big thanks to @hhshkmohd for his gracious offer to support people of Kerala during this difficult time. His concern reflects the special ties between governments and people of India and UAE.

— Narendra Modi (@narendramodi) August 18, 2018

మోడీ ట్వీట్ లో ఎక్కడా UAE ప్రభుత్వ సహాయాన్నితిరస్కరించడానికి ఉద్దేశించిన అంశం లేదు. వివాదం భారతదేశం విదేశీ సాయాన్ని ఎందుకు స్వీకరించకూడదు అని సమర్థించటానికి వెళ్ళింది. ప్రస్తుత ప్రభుత్వం హఠాత్తుగా ఆ విధానాన్ని తిరస్కరించడం మరియు విదేశీ సాయాన్ని అంగీకరించడం వంటి పరిణామాలను అంచనా వేయడం వరకు వెళ్లింది. తర్వాత, అనవసరమైన దౌత్యపరమైన వివాదానికి ఇది దారి తీయడంతో రెండు ప్రభుత్వాలు క్లారిఫికేషన్ ఇచ్చాయి.

దురదృష్టవశాత్తూ, న్యూయార్క్ టైమ్స్, ఫాక్స్ న్యూస్, డ్యుయిష్ వెల్లే వంటి విదేశీ మీడియా సంస్థలు ఈ కథను నమ్మి దాన్ని గురించి విశ్లేషంగా రాయడం జరిగింది. నిజానికి, కేరళ నాయకత్వం లేదా మోడీ ప్రభుత్వం ఎవరికీ సమస్య లేదు అని మాజీ రాయబారి MK భద్రాకుమార్  అభిప్రాయ పడ్డారు.

కేరళ ముఖ్యమంత్రి పినారాయ్ విజయన్ కేంద్రాన్నించి వచ్చిన సాయం పై తన కృతజ్ఞతను బహిరంగంగా వ్యక్తపరిచారు. రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు వివాదాస్పదాలను రేకెత్తించ వద్దని ప్రతి ఒక్కరికి సలహా కూడా ఇచ్చారు. నరేంద్ర మోడీ కూడా తన ట్వీట్లో కేరళకు తన వ్యక్తిగత వేదనను, అవగాహనను నొక్కిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*