జగన్నాథ రథయాత్ర చిత్రాన్ని కేజ్రీవాల్ అరెస్టుపై నిరసన తెలుపుతున్న ప్రజల చిత్రమని ఉపయోగించారు; వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తర్వాత భారీ సంఖ్యలో ప్రజలు రోడ్డుపై గుమిగూడి, నిరసన తెలుపుతున్నారనేది వాదనతో ఒక చిత్రం షేర్ చేయబడుతోంది.

నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. గత ఏడాది 2023లో జరిగిన ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రలోభారీగా ప్రజలు పాల్గొన్న ఇమేజ్/చిత్రమిది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టుచేసిన సంఘటన పై భారీ సంఖ్యలో ప్రజలు రోడ్డుపై గుమిగూడి,నిరసిస్తున్నారనే వాదనతో ఒక చిత్రం షేర్ చేయబడుతోంది.

ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21, 2024న రాత్రి అరెస్టు చేసి, ఏజెన్సీ కస్టడీలో ఉంచింది. అప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నిరసనలు కొనసాగిస్తోంది. మార్చి 26, 2024న దేశవ్యాప్తంగా అనేక నిరసనలు జరిగాయి. ఈ సందర్భంలో,ఈ విధమైన వాదనతో కూడిన క్రింది చిత్రం సోషల్ మీడియాలో షేర్ చేయబడింది.

మరో వినియోగదారు వాదనను వక్రీకరించి, నిరసనలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని పోస్ట్ చేసారు.
అనువాదం తర్వాత హిందీలోని వాదన ఇలా ఉంది: ” ఈ ఇమేజ్/చిత్రం చూస్తే కాంగ్రెస్‌ అంతం ఖాయమని తెలుస్తుంది… కాంగ్రెస్‌ కుయుక్తులకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లో నిరసన తెలుపుతున్నారు…. ఢిల్లీ.”

kejriwal protest

ఇదే ఇమేజ్/చిత్రం ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

FACT-CHECK

ప్రధాన ఈవెంట్‌లు లేదా నిరసనల వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గూమిగూడారని తెలపడానికి గతంలో చాలాసార్లు ఈ ఇమేజ్/చిత్రంను ఉపయోగించారు.కావున ఈ ఇమేజ్/చిత్రం బాగా తెలిసినందున Digiteye India టీమ్ దీని వాస్తవ-పరిశీలనకు పూనుకుంది. మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో ఒరిజినల్ ఇమేజ్ కోసం వెతకగా, అది 2023లో జరిగిన ప్రసిద్ధ జగన్నాథ్ పూరీ రథయాత్రలో పాల్గొన్న జనసమూహానికి సంబంధించిన ఇమేజ్/చిత్రమని గమనించాము.

ఇది వాస్తవానికి జూన్ 20, 2023న జగన్నాథ్ పూరీ రథయాత్ర మరియు వివరణతో పాటు sri_mandir వినియోగదారు ద్వారా Instagram ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ఈ చిత్రాన్ని గతంలో చాలాసార్లు అనేక వాదనలతో ఉపయోగించారు కానీ తప్పుడు వాదనలని నిరూపించబడింది. Google FactCheck Explorerలో ఈ ఇమేజ్/చిత్రాన్ని పరిశీలించగా, ఫలితాలు క్రింది విధంగా ఉన్నాయి. కాబట్టి, వాదన/దావా తప్పు.

మరి కొన్ని Fact Checks:

ఒడిశాలోని కోణార్క్ ఆలయం లోపల సూర్యుడు ఉదయిస్తాడా? వాస్తవ పరిశీలన

నాగార్జున సిమెంట్స్ వారు 9/11లో జరిగిన దాడుల నేపథ్యంతో కూడిన ప్రకటనను తయారుచేసారా? వాస్తవ పరిశీలన

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*