మహా కుంభమేళా ముగింపు రోజున త్రిశూలం ఆకారంలో ఎయిర్ షో నిర్వహించబడిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: మహా కుంభమేళా ముగింపు రోజున 26 ఫిబ్రవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో వైమానిక దళ విమానాల ద్వారా త్రిశూలం ఆకారంలో ఎయిర్ షో నిర్వహించబడిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన. వైరల్ అవుతున్న చిత్రం 2025 ఫిబ్రవరి 26న జరిగిన మహా కుంభమేళా ముగింపు కార్యక్రమానికి సంబంధించినది కాదు, కానీ 2019 నుండి ఇంటర్నెట్‌లో ఉన్న పాత చిత్రం.

రేటింగ్/Rating : తప్పు దారి పట్టించే వాదన–

**************************************************************************

ఫిబ్రవరి 26, 2025న మహా కుంభమేళా చివరి రోజున ప్రయాగ్‌రాజ్‌లో భారత వైమానిక దళం నిర్వహించిన త్రిశూలం ఆకార నిర్మాణం యొక్క చిత్రంతో సోషల్ మీడియా హోరెత్తుతోంది.

వాదన/దావా ఈ విధంగా ఉంది: “ఈ సంవత్సరానికే ఇది చిత్రం !!! 3 సుఖోయ్ 30 MKI విమానాలతో మహాదేవ్ త్రిశూలం ఆకార నిర్మాణం !!! #భారత వాయుసేనకు సెల్యూట్ జై మహాకాల్”.

ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

వాస్తవ పరిశీలన

సోషల్ ప్లాట్‌ఫామ్‌లలో చాలా మంది ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్నందున, వైరల్ క్లెయిమ్/వాదన యొక్క ప్రామాణికతను పరిశీలించడానికి బృందం ప్రయత్నించగా, మహా కుంభమేళా ముగింపు రోజున ఎయిర్ షో సమయంలో త్రిశూలం ఆకార నిర్మాణం జరగలేదని కనుగొన్నారు. ముగింపు రోజున జరిగిన అసలు ఎయిర్ షో వీడియోని దిగువన చూడవచ్చు:

గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో మరింత సమాచారం కోసం వెతకగా, అలాంటి చిత్రం ఇంటర్నెట్‌లో చాలా కాలంగా షేర్ అవుతోందని తేలింది. 2019 నుండి ఇదే చిత్రాన్ని షేర్ చేసిన పోస్ట్ ఇక్కడ ఉంది:

2025 ఫిబ్రవరి 26న మహా కుంభమేళాలో వైమానిక దళ విమానాల ద్వారా త్రిశూలం ఆకారంలో జరిగిన ఎయిర్ షోకి సంబంధించి మరిన్ని వార్తలు/నివేదికల కోసం మరింత శోధించినా, ఎటువంటి ఫలితాలు వెలువడలేదు.కాబట్టి వైరల్ అవుతున్న చిత్రం 2025 ఫిబ్రవరి 26న జరిగిన మహా కుంభమేళా ముగింపు కార్యక్రమానికి సంబంధించినది కాదు, కానీ 2019 నుండి ఇంటర్నెట్‌లో ఉన్న పాత చిత్రం.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*