దక్షిణ భారత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం మరియు పసుపు నీటిని అందిస్తోందనేది వీడియో లోని వాదన
దక్షిణ భారత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం మరియు పసుపు నీటిని అందిస్తోందనేది వీడియో లోని వాదన

దక్షిణ భారత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం మరియు పసుపు నీటిని అందిస్తున్నారనేది వీడియో లోని వాదన; వాస్తవ పరిశీలన

వాదన/Claim: దక్షిణ భారత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం మరియు పసుపు నీటిని అందిస్తున్నారనేది వీడియో లోని వాదన.

నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన.వైరల్ వీడియోలో ఆరోపిస్తున్నట్లు, వీడియో దక్షిణ భారతదేశంకు సంబంధించినది కాదని ఒడిశా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిదని నిర్ధారింపబడింది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు

దక్షిణ భారతదేశంలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో అన్నం,పసుపు నీళ్లు మాత్రమే అందిస్తున్నారంటూ పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ చిన్న వీడియో వైరల్ అవుతోంది.  హిందీలో క్యాప్షన్ ఈ విధంగా ఉంది:” देखें कि दक्षिण भारत के सरकारी स्कूलों में मध्याह्न भोजन कैसे उपलब्ध कराया जा रहा है। केवल चावल और हल्दी वाला पानी।” [తెలుగు అనువాదం “దక్షిణ భారతదేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఎలా అందిస్తున్నారో చూడండి. అన్నం మరియు పసుపు నీళ్లు మాత్రమే.”]

ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

Fact Check

వీడియో యొక్క ముఖ్య ఫ్రేమ్‌లను తీసుకుని, Digiteye India బృందం గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను ఉపయోగించి చూడగా, ఒరిజినల్ వీడియోను బిగుల్ టీవీ (ఒడిశా) యూట్యూబ్‌లో ఫిబ్రవరి 1, 2024న పోస్ట్ ను గమనించాము.వీడియో శీర్షిక ఇలా ఉంది”మిడ్-డే భోజనంలో ఇలాంటి పప్పులను ఎవరూ తమ మొత్తం జీవితంలో తిని ఉండరు ;మన పూర్వీకులకు కూడా తిని ఉండరు.ఈ ప్రభుత్వ హయాంలో అది ఎలా సాధ్యం అయింది?”

ఒరిజినల్(అసలు) వీడియోలో, ఆ వ్యక్తి తాను ఫిర్యాదు చేయడం లేదని, అయితే ఎలాంటి పప్పులు వడ్డిస్తున్నారో తెలుసుకోవాలని కార్మికులతో ఒడియాలో ఇలా మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది.  “ఇవి పప్పులు కావు, మీరు వడ్డిస్తుంది నీరు. మీరు తక్కువ మోతాదులో ఆహార పదార్థాలను అందుకున్నందున పరిమిత వనరులతో ఇక్కడ పని చేస్తున్నారని నాకు తెలుసు,అయినా కానీ నేను వెళ్లి దీని గురించి BDO (బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్)కి ఫిర్యాదు చేస్తాను.

అందువలన, వీడియో ఒడిశాలోని ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినది, దక్షిణ భారత ప్రభుత్వ పాఠశాలకు చెందినది కాదు.

మరి కొన్ని fact Checks:

చాక్లెట్ తినడం వల్ల మొటిమలు వస్తాయని వైరల్ పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; వాస్తవ పరిశీలన

‘గాఢమైన పసుపురంగు’ ఉన్న పసుపులో ‘లెడ్ క్రోమేట్’అనే పదార్థముందని వైరల్ సందేశం పేర్కొంది; వాస్తవ పరిశీలన