సింగపూర్ మెట్రో ఫోటోతో ఉన్న పోస్టర్ను, ప్రధాని మోదీ సాధించిన ఘనతగా పశ్చిమ బెంగాల్ బీజేపీ వాళ్ళు షేర్ చేసారు: వాస్తవ పరిశీలన

వాదన/Claim: మెట్రో ఫోటోతో ఉన్న పోస్టర్, ప్రధాని మోదీ సాధించిన విజయాల్లో ఒకటిగా బీజేపీ పశ్చిమ బెంగాల్ విభాగము వారిచే చేయబడిన వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. సింగపూర్‌లోని జురాంగ్ మెట్రో ఇమేజ్ను/చిత్రాన్ని, మోదీ సాధించిన ఘనతగా చూపబడింది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

Fact Check వివరాలు:

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ బిజెపి సోషల్ మీడియాలో పోస్టర్‌ను విడుదల చేసింది, దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో భారతదేశం యొక్క మెట్రో రైలు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కృషికి అభినందనలు తెలిపారు.

బెంగాలీలో దావా ఇలా ఉంది: কর্মসংস্থান না বাড়লে কীভাবে ভারতের শহরে শহরে পৌঁছে গেল মেট্রো পরিষেবা? কংগ্রেস বলবে, বিজেপি করবে!” [బెంగాలీ అనువాదం ఇలా ఉంది: “ఉపాధిని పెంచకుండా మెట్రో సేవలు భారతదేశంలోని నగరాలకు ఎలా వచ్చాయి? కాంగ్రెస్ మాటలు చెబుతుంది, బీజేపీ చేసి చూపిస్తుంది!”]

భారత్‌లో మోడీ సాధించిన విజయానికి సంబంధించి,ఈ ఇమేజ్ ను ఆయనకు ఆపాదించడం గురించి వినియోగదారులు ప్రశ్నిస్తూన్న ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.  పోస్టర్‌లో ఉపయోగించిన రైల్వే లైన్ సింగపూర్‌లోని జురాంగ్ ఈస్ట్ MRT చిత్రమని, భారతదేశంలోనిది కాదని పలువురు X వినియోగదారులు సూచించారు.

FACT CHECK

Digiteye India టీం జురాంగ్ ఈస్ట్ MRT చిత్రాల కోసం వెతకగా, BJP యొక్క పశ్చిమ బెంగాల్ విభాగము  వికీపీడియాలో ఉపయోగించిన చిత్రాన్ని తీసుకొని అది మోడీచే నిర్మించబడిందని వాదన/దావా చేయడం జరిగిందని గుర్తించాము. జురాంగ్ ఈస్ట్ MRT స్టేషన్ అనేది సింగపూర్‌లోని జురాంగ్ ఈస్ట్‌లో ఒక ఎత్తైన కూడలి, ఇది సింగపూర్ యొక్క SMRT ట్రైన్స్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతుంది.

మరిన్ని వివరాల కోసం Digiteye India టీం Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో చిత్రాన్ని పరిశీలించగా,ఇదే చిత్రాన్నిఫిబ్రవరి 13, 2020న సింగపూర్‌కు చెందిన “ది స్ట్రెయిట్స్ టైమ్స్‌లో”  ప్రచురించబడిందని మేము గుర్తించాము.
“ట్రాక్ లోపం వల్ల చోవా చు కాంగ్ మరియు జురాంగ్ ఈస్ట్ మధ్య MRT ప్రయాణానికి అంతరాయం” ఏర్పడిందనే శీర్షికతో ప్రచురించబడింది.

మౌలిక సదుపాయాల పరంగా సాధించిన విజయాన్ని క్లెయిమ్ చేయడానికి బిజెపి విభాగము తప్పు చిత్రాన్ని ఉపయోగించడం ఇదేం మొదటిసారి కాదు. 2021లో ఉత్తరప్రదేశ్‌లో ఎక్స్‌ప్రెస్‌వే గురించి ఇదే విధమైన వాదనను Digiteye India బృందం తప్పని నిరూపించింది.

అందువల్ల, సంబంధం లేని ఫోటోతో చేసిన వాదన/దావా తప్పు.

మరి కొన్ని Fact Checks:

మోదీ మళ్లీ ప్రధాని అవుతారని రాహుల్ గాంధీ చెప్పారా? వాస్తవ పరిశీలన

SC/ST/OBC రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని అమిత్ షా తెలంగాణ బహిరంగ సభలో చెప్పారా; వాస్తవ పరిశీలన

 

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.