ఈ వీడియోలో పూజారులు ఆలయ విరాళాల డబ్బుల కోసం గొడవ పడుతున్నారా ? వాస్తవ పరిశీలన

వాదన/Claim: కర్ణాటకలోని ఒక విరాళాల హుండీ డబ్బు కోసం పూజారులు గొడవ పడుతున్నట్లు చూపిస్తున్న ఒక వీడియో వైరల్ అవుతోంది.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. వాస్తవానికి ఈ వీడియో మంగళూరులోని కటీల్ పట్టణంలో జరిగే సాంప్రదాయ అగ్ని ఖేలి లేదా తూథేధార ఆచారాన్ని వర్ణిస్తుంది, ఆలయ విరాళాల కోసం పూజారులు గొడవ కాదు.

రేటింగ్/Rating : తప్పుగా చూపించే ప్రయత్నం —

************************************************************************

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి

లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి

******************************************************

విరాళాల హుండీ డబ్బు కోసం పూజారులు గొడవ పడుతున్నట్లు సూచించే ఒక వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది.

జూలై 7, 2025న సూర్య రాజ్ నాగవంశీ అనే యూజర్ హిందీ క్యాప్షన్‌తో ఆచారానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసాడు:

भिखारियों को दान पेटी में से हिस्सा नहीं मिला तो आपस में ही भीड़ गए!!! ये धंधा नहीं तो क्या है????

పోస్ట్ అనువాదం ఇలా ఉంది: “వారికి విరాళాల హుండీ/పెట్టె నుండి వాటా రాలేదు, కాబట్టి వారు తమలో తాము గొడవ పడుతున్నారు!!! ఇది వ్యాపారం కాకపోతే, మరి ఏమిటి????!!!”

ఫేస్ బుక్ లో మరొక పోస్ట్ ఈ విధంగా ఉంది: “दान पेटी में से हिस्सा नहीं मिला तो आपस में ही भीड़ गए, मंदिर में सारा मामला दान दक्षिण का है ”

తెలుగు అనువాదం: “వారికి విరాళాల హుండీ/పెట్టె నుండి వాటా రాలేదు, కాబట్టి వారు తమలో తాము గొడవ పడుతున్నారు!ఆలయంలో అంతా విరాళాల గురించే.”

FACT CHECK 

DigitEYE India బృందం వీడియో నుండి కీలక ఫ్రేమ్‌లను తీసుకుని,ఆ ఫ్రేమ్‌లపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది అగ్ని ఖేలి ఆచారానికి సంబంధించిన వార్తకి దారితీసింది. తూథేధార అని కూడా పిలువబడే ఇది 17వ శతాబ్దానికి ముందు నాటిది మరియు ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో కర్ణాటకలోని మంగళూరులోని కటీల్ పట్టణంలోని శ్రీ దుర్గాపరమేశ్వరి ఆలయంలో ఈ ఆచారం నిర్వహించబడుతుంది.

తూథేధార అంటే ఏమిటి?
మంగళూరులోని కటీల్‌లోని శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయంలో వార్షిక ఉత్సవంలో భాగంగా భక్తులు నిప్పుతో ఆడుకోవడం, కాలుతున్న తాటి కర్రలను ఒకరిపై ఒకరు విసరడం అనే ఒక ఆచారం.నారింజ రంగు ధోవతులు ధరించిన భక్తులు తమ శరీరంపై బూడిదను పూసుకుని, ప్రత్యర్థి బృందం నుండి 15 నుండి 20 మీటర్ల దూరంలో నిలబడి,వారు ఒకరిపై ఒకరు మండుతున్న తాటి కర్రలను విసురుకుంటారు మరియు ఈ ఆచారం దాదాపు పదిహేను నిమిషాల పాటు కొనసాగుతుంది,ఆ తరువాత వారు ఆలయంలోకి ప్రవేశిస్తారు.ఈ పండుగ సందర్భంగా, భక్తులు 8 రోజులు ఉపవాసం ఉండి ఘనంగా జరుపుకుంటారు.ఈ ఆచారం ప్రతికూల శక్తిని తరిమికొట్టే మార్గంగా పరిగణించబడుతుంది.

ఈ పండుగ గురించి తెలుగులో వివరిస్తూ ABP దేశం చేసిన YouTube వీడియోను క్రింద చూడవచ్చును:

కర్ణాటకలో అగ్ని ఖేలి ఆచారంపై మరింత సమాచారంతో కూడిన వ్యాసం హిందూస్తాన్ టైమ్స్ 23 ఏప్రిల్, 2022న ప్రచురించింది.

 

అందువలన, అగ్ని ఖేలి ఆచార వీడియో తప్పుడు కధనంతో పోస్ట్ చేయబడింది.పూజారులు గొడవ పడుతున్నారనే వాదన పూర్తిగా కల్పితం మరియు ఈ ఆచారం యొక్క సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యతను తప్పుగా చూపించే ప్రయత్నం చేయబడింది.

కాబట్టి ఈ వాదనలో నిజం లేదు.

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.